కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రణాళిక: కనుమూరి
కలిగొట్ల: ప్రచారంలో తెదేపా అభ్యర్థి రఘురామ, రామరాజు
ఉండి, న్యూస్టుడే: జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.ఆరేడు, కలిగొట్ల, ఉప్పులూరు గ్రామాల్లో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఎమ్మెల్యే రామరాజుతో కలిసి మాట్లాడారు. రామరాజుకు ప్రజా సమస్యలన్నీ తెలుసని.. ఆయన ఇచ్చిన హామీలన్నీ తాను నెరవేరుస్తానని తెలిపారు. గ్రామస్థులంతా కలిసి కలిగొట్లలో వంతెన నిర్మించుకోవడం ప్రశంసనీయమన్నారు. ఇదే ఐక్యతతో తెదేపా, జనసేన, భాజపా కూటమిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. రామరాజు మాట్లాడుతూ కలిగొట్ల ఎప్పుడూ తెదేపాకు కంచుకోట అన్నారు. రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ అందించాలని కోరారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు రుద్రరాజు యువరాజు అధ్యక్షతన జరిగిన సభలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజు, సర్పంచి మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, ఐతెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యశోద కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గొల్లలకోడేరు (పాలకోడేరు), ఆకివీడు, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై నాలుగేళ్లుగా యుద్ధం చేస్తున్న రఘురామకృష్ణరాజును గెలిపించి ప్రజాస్వామ్యన్ని కాపాడాలని ఆయన సతీమణి రమాదేవి విజ్ఞప్తి చేశారు. గొల్లలకోడేరులో తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి ఆమె బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసిన తన భర్తను జగన్రెడ్డి అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు కోటేశ్వరరాజు, నాయకులు కామన రాంబాబు, కమ్మిల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
- ఆకివీడులో రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ ఎన్నికల ప్రచారం చేశారు. తొలుత తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్, బొల్లా వెంకట్రావు, పిల్లా నరసింహరాజు (బాబులు), గొంట్ల గణపతి, గంధం ఉమా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మేమేం చేశాం పాపం?
[ 04-05-2024]
జగన్ సర్కారు అక్కసుతో పింఛనుదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అగ్నిగుండంలాంటి ఎండలో పింఛను కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం. -
మీ గెండెల్లో ధైర్యం నింపడానికి వచ్చా
[ 04-05-2024]
కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాయంతో కృషి చేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. -
ఎగవేత.. లేదంటే కోత
[ 04-05-2024]
రైతే రాజన్నది నానుడి. అయిదేళ్ల కాలంలో జగనన్న వారినీ వదల్లేదు. తన మార్కు చర్యలతో కర్షకులను అన్ని విధాలా కష్టపెట్టారు. అయితే వ్యవసాయ రాయితీల ఎగవేత.. లేదంటే కోతలతో అన్నదాతలకు నష్టాలను మూట కట్టారు. -
హక్కు చట్టంతో.. ఆస్తులకు కాళ్లొస్తాయ్!
[ 04-05-2024]
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా... ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. -
జగన్ సిద్ధం.. జనానికి నరకం
[ 04-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభ.. జనానికి నరకం చూపింది. -
వైకాపా తెచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్’ అమలైతే సామాన్యులకు తీవ్ర నష్టం
[ 04-05-2024]
భూ హక్కు(ల్యాండ్ టైటిలింగ్) పేరిట వైకాపా సర్కారు తెచ్చిన చట్టం అమలులోకి వస్తే సొంత భూములపై హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ రమణరావు స్పష్టం చేశారు. -
పథకాల ఊకదంపుడే.. ప్రగతి ఊసేలేదు
[ 04-05-2024]
ఇరవై నిమిషాల ప్రసంగంలో జిల్లా ప్రగతి గురించి.. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిపై..ఒక్క మాట కూడా మాట్లాడలేదు. -
నేడు నూజివీడులో చంద్రబాబు సభ
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నూజివీడులో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించే సభకు ఏర్పాట్లు చేశారు. -
నిర్వాసితుల్ని ఆదుకుంటాం
[ 04-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నియోజకవర్గాన్ని చిర్రి బాలరాజుతో కలిసి అభివృద్ధి చేస్తామని ఎన్డీయే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. -
తపాలా ఓటు వేయనిస్తారా.. లేదా?
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తపాలా బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. -
కల్యాణం.. రమణీయం
[ 04-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. -
వాటా ఇవ్వరు..జమ చేయరు!
[ 04-05-2024]
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి ఇచ్చి.... అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు. -
కూటమి ప్రభంజనం తథ్యం
[ 04-05-2024]
వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం తథ్యమని ఉండి శాసనసభ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కార్మికులకు భరోసా
[ 04-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. -
బాలుడి అనుమానాస్పద మృత
[ 04-05-2024]
ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం నూజివీడులో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు