పట్టు నిలపాలని.. పాగా వేయాలని..
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్, భారాస, భాజపాలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. 2008లో నూతనంగా ఏర్పడిన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన భారాస మరో విజయంతో హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
విజయమే లక్ష్యంగా పార్టీల వ్యూహరచన
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్, భారాస, భాజపాలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. 2008లో నూతనంగా ఏర్పడిన చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన భారాస మరో విజయంతో హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ రెండో గెలుపు నమోదు చేసి పట్టు సాధించాలని తహతహలాడుతోంది. ప్రధాని మోదీ చరిష్మాను నమ్ముకున్న భాజపా ప్రత్యేక వ్యూహంతో ఎన్నికల సమరంలో ముందుకెళ్తోంది.
న్యూస్టుడే, వికారాబాద్.
తొలి గెలుపు సాధనకు భాజపా కసరత్తు
తొలి విజయం కోసం కమలదళం కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆ పార్టీని వీడి భాజపాలో చేరి తమ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. తొలి విజయం కోసం శ్రమిస్తున్నారు.
హ్యాట్రిక్ కోసం భారాస..
చేవెళ్లలో వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని భారాస ప్రణాళికలు రచిస్తోంది. 2014లో భారాస అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి, 2019లో గడ్డం రంజిత్రెడ్డిలు విజయం సాధించారు. శాసనసభ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తుండగా, తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించి భారాసలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో దించింది. గత శాసనసభ ఎన్నికల్లో భారాసకు ఏడు నియోజకవర్గాల్లో కలిపి కాంగ్రెస్ కంటే 65,600 ఓట్లు అధికంగా వచ్చాయి.ఈసారికూడా గెలుస్తామని ఆశిస్తున్నారు.
కార్యకర్తలను సమాయత్తం చేస్తూ..
భారాస నుంచి సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలువగా, భారాస కాసాని జ్ఞానేశ్వర్ను, భాజపా కొండా విశ్వేశ్వర్రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఇంఛార్జిగా వేంనరేందర్రెడ్డి, భారాస ఇంఛార్జిగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని నియమించగా, భాజపా ఇంకా నియమించలేదు. ప్రస్తుతం మూడు పార్టీలు నియోజకవర్గ, మండల స్థాయిల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి.
రెండో గెలుపుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
చేవెళ్లలో రెండో విజయంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. 2009లో గెలిచిన ఆ పార్టీ 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రస్తుతం చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ]్యం వహిస్తున్నారు. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో భారాస ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, ఇతర పార్టీల నుంచి నాయకులు చేరడంతో కొంత బలం పుంజుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
[ 20-05-2024]
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!