కొత్త కోర్సులు.. సరికొత్త అవకాశాలు
విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించి ఏడాదైంది. ఈ ఏడాదిలో వారు తీసుకున్న చర్యలేమిటి.? భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు.? కొత్త కోర్సులేం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. తదితర అంశాలపై బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతులతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు....
ఈనాడు, హైదరాబాద్
విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించి ఏడాదైంది. ఈ ఏడాదిలో వారు తీసుకున్న చర్యలేమిటి.? భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు.? కొత్త కోర్సులేం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. తదితర అంశాలపై బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతులతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు.
విద్యార్థులకు ప్రత్యేకంగా మొబైల్ యాప్
- కె.సీతారామారావు, ఉపకులపతి, బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
1. ఏడాదిలో యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొస్తున్నాం. న్యాక్ అక్రిడిటేషన్కు సంబంధించి ప్రక్రియ చేపట్టాం. అకడమిక్, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాం. ఈఎమ్మార్సీ, సీఎస్టీడీని ఆధునికీకరించాం. సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్ ఏర్పాటు చేసి రెండు కోర్సులు తీసుకొచ్చాం. ఫీజు చెల్లింపులన్నీ ఆన్లైన్లో చేశాం. రాష్ట్రవ్యాప్తంగా లెర్నర్ సపోర్టు సెంటర్లు(ఎస్ఎస్సీ) పెంచుతున్నాం. సెమిస్టర్ తరగతులు 70 శాతం ఆన్లైన్, 30 శాతం ఆఫ్లైన్లో బోధిస్తున్నాం.
2. ఆచార్యుల భర్తీ జరగకపోవడంతో బోధనపై ప్రభావం పడుతోంది. దీన్నెలా అధిగమిస్తున్నారు.?
రెగ్యులర్ ఆచార్యులు లేకపోయినా.. బోధనకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. పదవీ విరమణ చేసిన, ఒప్పంద ఆచార్యులను నియమించుకున్నాం.
3. ప్రభుత్వం నుంచి జీతాలకు మినహా ఇతరత్రా గ్రాంట్లు రావడం లేదు. నిధుల కొరతను అధిగమించే ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు?
గతంతో పోల్చితే ఈసారి ప్రభుత్వం నిధులు పెంచింది. ఇంకా పెరగాల్సి ఉంది. జీతాలు, పింఛన్లకు పూర్తిస్థాయిలో నిధులివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మిగిలిన వివిధ గ్రాంట్ల రూపేణా సొంతంగా సమకూర్చుకుంటున్నాం.
4. వర్సిటీ విభజన ఎంత వరకు వచ్చింది.?
విభజనపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కాకుండా అప్పుడప్పుడు చర్చిస్తోంది. దీనివల్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.
5. కొత్త కోర్సులు ఏమైనా తీసుకువస్తున్నారా.?
2022-23 నుంచి కొత్త కోర్సులు రానున్నాయి. మేనజ్మెంట్ విభాగంలో డిప్లొమా, సైకాలజీలో కౌన్సెలింగ్, బీఏలో ఇంటర్నేషనల్ స్టడీస్, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ తీసుకొస్తున్నాం. పీజీ స్థాయిలోనూ ప్రవేశపెట్టనున్నాం.
6. రానున్న రెండేళ్లలో మీ ప్రణాళికలు.?
వచ్చే విద్యా సంవత్సరం నుంచే పీజీలో సెమిస్టర్ విధానంతోపాటు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నాం. ఈ ఏడాది ఆఖరుకల్లా న్యాక్కు అవసరమైన పత్రాలు సమర్పించి.. వచ్చే ఏడాదిలో మంచి గ్రేడ్తో గుర్తింపు సాధిస్తాం. సైన్స్ కోర్సుల కోసం ల్యాబ్లు పీజీ స్థాయికి అప్గ్రేడ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్, లాంగ్వేజీ తీసుకురానున్నాం. వర్సిటీ మొబైల్ యాప్ తీసుకొస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలు యాప్లో లభిస్తాయి. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు అవసరమైన సిలబస్ స్టడీ మెటీరియల్ తీసుకొస్తున్నాం. దీన్ని నామమాత్రపు ధరలకే అందిస్తాం.
ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి చదువుకునే వీలు
- టి.కిషన్రావు, ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
1. ఏడాదిలో యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?
ప్రతి కోర్సులో సీట్ల సంఖ్యను మూడింతలు పెంచి ఆసక్తి కలిగిన ప్రతి విద్యార్థి చదువుకునే అవకాశం కల్పించాం. పేద విద్యార్థుల ఫీజులకు ఇబ్బంది లేకుండా దాతల సహకారంతో చెల్లిస్తున్నాం. పదేళ్ల తర్వాత ఎంఏ హిస్టరీ, కల్చర్ అండ్ టూరిజం తిరిగి పునరుద్ధరించాం. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు ప్రారంభించాం. ఎంఫిల్, పీహెచ్డీలో 160 సీట్లు భర్తీ చేశాం. ప్రాజెక్టు అసిస్టెంట్లు, ఇన్స్ట్రక్టర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా కల్పించి జీతాలు పెంచాం. 70 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశాం. ఎలాంటి రాజకీయ జోక్యం, పైరవీలు లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కవులు, రచయితలను ఎంపిక చేసి అవార్డులు అందించాం.
2. ఆచార్యుల భర్తీ జరగకపోవడంతో బోధనపై ప్రభావం పడుతోంది. దీన్నెలా అధిగమిస్తున్నారు.?
2. రెగ్యులర్ ఆచార్యులు లేకపోవడంతో ఇబ్బంది ఉన్నా.. బోధనకు లోటు లేకుండా చూసుకుంటున్నాం. పదవీ విరమణ చేసిన వారితోపాటు తాత్కాలిక అధ్యాపకులను నియమించుకున్నాం. దూరవిద్యపై కొంత ప్రభావం రెగ్యులర్ పీజీ కోర్సులు ఆగిపోయాయి. ఆ స్థానంలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తున్నాం.
3. ప్రభుత్వం నుంచి జీతాలకు మినహా ఇతరత్రా గ్రాంట్లు రావడం లేదు. నిధుల కొరతను అధిగమించే ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు?
ఏడాది కాలంలో నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. బాచుపల్లిలోని క్యాంపస్లో జరుగుతున్న భవన నిర్మాణాలు రూసా నిధులతో జరుగుతున్నాయి.
4. వర్సిటీ విభజన ఎంత వరకు వచ్చింది.?
విభజన విషయంలో ఏపీ ప్రభుత్వంలో అలసత్వం కనిపిస్తోంది. చర్చల దశలోనే ఉంది. అక్కడి పీఠాలలోని సిబ్బందికి జీతాలు సరిగా అందకపోవడంతో యూనివర్సిటీ నుంచే భరించాల్సి వస్తోంది.
5. కొత్త కోర్సులు ఏమైనా తీసుకువస్తున్నారా.?
బాచుపల్లికి మారిన తర్వాత కొత్త కోర్సులు తీసుకొచ్చే ఆలోచన ఉంది. లైబ్రరీ సైన్స్, డిజైన్ కోర్సులు ప్రారంభిస్తున్నాం.
6. రానున్న రెండేళ్లలో మీ ప్రణాళికలు.?
త్వరలోనే బాచుపల్లికి క్యాంపస్ను తరలించాలనుకుంటున్నాం. అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడ కేవలం పీజీ కోర్సులే నిర్వహిస్తాం. సర్టిఫికెట్, డిప్లొమాతోపాటు సాయంకాల కోర్సులు నాంపల్లి క్యాంపస్లో కొనసాగిస్తాం. ఈ ఏడాది జులైలో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
[ 26-04-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా