ఆడపిల్లలమైనా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అధికారాన్ని, ఏపీ పోలీసులను అడ్డుపెట్టి అవినాష్రెడ్డిని కాపాడారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
అధికారాన్ని అడ్డం పెట్టి అవినాష్ను జగన్ కాపాడారు
నిందితులకు శిక్ష పడితే ప్రజాకోర్టుకు వచ్చేవాళ్లమే కాదు
న్యాయం కోసం నిలబడకపోతే మనుషులకు, మానులకు తేడా ఏముంది?
చెల్లెలికి ఆస్తిలో వాటా ఇవ్వడం అన్న బాధ్యత
కొసరు వాటా ఇచ్చి అప్పుగా చూపించే వాళ్లున్నారు
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఈనాడు, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అధికారాన్ని, ఏపీ పోలీసులను అడ్డుపెట్టి అవినాష్రెడ్డిని కాపాడారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు. న్యాయయాత్రలో భాగంగా ఆదివారం కర్నూలు వచ్చిన ఆమె నగరంలోని పాతబస్తీ ప్రాంతంలోనూ, అనంతరం విలేకర్లతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీటులో చేర్చిందని... తాను గానీ, సునీత గానీ సీబీఐ చెప్పింది మాత్రమే చెబుతున్నామని మరోసారి గుర్తుచేశారు. ‘వివేకా హత్యకేసులో నేటివరకూ న్యాయం జరగలేదు. అందుకే నేను, సునీత నిలబడి కొట్లాడుతున్నాం. ప్రజాకోర్టులో న్యాయం పొందే అవకాశం ఉండటంతో అడుగుతున్నాం. ఇందులో తప్పేముంది? అవినాష్రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలు వచ్చినప్పుడు సీబీఐ పని సాఫీగా జరిగి ఉంటే, అవినాష్రెడ్డిని జగన్ కాపాడకపోయి ఉంటే.. కేసుకు న్యాయం జరిగి ఉంటే.. హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్షలు పడి ఉంటే ఈ రోజు మేము రోడ్డు మీదకు వచ్చే అవసరమే ఉండేది కాదు. అయిదేళ్లు వేచి చూసినా న్యాయం జరగలేదు. అందుకే ప్రజాతీర్పు కోసం ప్రజాకోర్టులో కొంగుచాచి న్యాయం అడుగుతున్నాం. ఇది తప్పెలా అవుతుంది? ప్రజల్నే తీర్పు చెప్పాలంటున్నాం. హత్య కేసులో నిందితులు వివేకా హత్యకు ముందు, హత్య తర్వాత కూడా అవినాష్రెడ్డిని కలిశారని గూగుల్ టేకౌట్ మ్యాప్ల ఆధారంగా తెలుస్తోందని సీబీఐ స్పష్టంగా చెప్పింది. ఆయా మ్యాప్లలో 50 మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల తేడా వస్తుందని అవినాష్రెడ్డి చెబుతున్నారు. ఆయన ఇంట్లోనే సాక్ష్యాలు ఎందుకు చూపుతున్నాయి? వెయ్యి మీటర్ల తర్వాత ఎందుకు చూపలేదో ఆయన సమాధానం చెప్పాలి. దీంతోపాటు అవినాష్రెడ్డికి, హత్య కేసులో నిందితులకు మధ్య సంభాషణలు జరిగినట్లు ఫోన్కాల్ రికార్డులు కూడా ఉన్నాయి. వాటినీ కాదని బుకాయిస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే సామాన్యులకు న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంటుంది? హత్యకు నగదు లావాదేవీలు జరిగాయని సీబీఐ చెప్పింది. అప్రూవర్, నిందితులు కూడా అడ్వాన్సులు తీసుకున్నట్లు ఒప్పుకొన్నట్లు సీబీఐ స్పష్టంగా తేల్చింది. అయినా అది కాదంటున్నారు. దేవుడు ప్రజలందరికీ ఇంగితజ్ఞానం ఇచ్చారు. సీబీఐ ఆయా సాక్ష్యాలు, ఆధారాలు చూపక ముందు ఇంటి వాళ్లే ఆ హత్య చేశారన్న విషయాన్ని మేమే నమ్మలేదు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటాం? పోనీ సీబీఐ ఇంకెవరినైనా నిందితులుగా చూపించిందా? సునీతను గానీ, ఆమె భర్త రాజశేఖర్ను గానీ చూపిందా? వారిపై ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సీబీఐ చూపించిన నిందితులపై తప్ప ఇతరులపై ఎలాంటి సాక్ష్యాలు లేవు. అన్నివేళ్లూ అవినాష్రెడ్డివైపే చూపిస్తున్నాయి. శాస్త్రీయంగా చెప్పిన అంశాలనే ప్రజలు నమ్ముతారు. సభ్యసమాజంలో బతుకుతూ... న్యాయం కోసం నిలబడకపోతే మనుషులకు, మానులకు తేడా ఏముంటుంది?’ అని షర్మిల ప్రశ్నించారు.
న్యాయం కోసం పోరాడుతున్నా
తన గుండెల్లో నిజాయతీ ఉందని, న్యాయం కోసమే పోరాటం చేస్తున్నామని.. ఆస్తుల కోసమో, రాజకీయం కోసమో, వారసత్వం కోసమో చేస్తున్న పోరాటం కాదని వైఎస్ షర్మిల అన్నారు. న్యాయం జరగలేదని సునీతమ్మ, సౌభాగ్యమ్మ కుమిలిపోతున్నారని గుర్తుచేశారు. ఒక పెద్దమనిషిని ఏడుసార్లు గొడ్డలితో నరికితే, ఎముకలు, మెదడు కూడా బయటకు వచ్చి ఘోరంగా మృత్యువాత పడితే కొందరు పెద్దవాళ్లు దాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అందుకే ఆడపిల్లలమైనా ప్రాణాలకు తెగించి మొండిగా పోరాడుతున్నట్లు చెప్పారు. ఒకరి స్క్రిప్టు చూసి చదవాల్సిన అవసరం లేదన్నారు.
న్యాయరాజధాని చేస్తామన్నారు.. ఒక్క ఇటుక వేశారా?
కర్నూలును న్యాయరాజధాని చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు కనీసం ఒక్క ఇటుకైనా వేశారా అని షర్మిల ప్రశ్నించారు. కర్నూలును స్మార్ట్సిటీగా మారుస్తానని చెప్పి కనీసం ఒక మురుగు కాలువనైనా నిర్మించారా? అని నిలదీశారు. ఆయన రూ.వంద ఇచ్చి... రూ.వెయ్యి లాగుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మట్టి చెంబులిచ్చి... వెండి చెంబులు లాక్కుంటున్నారని దుయ్యబట్టారు.
జగన్పై పరోక్షంగా చురకలు
‘జగన్ నాకు అప్పిచ్చారు... అదే విషయాన్ని అఫిడవిట్లో చేర్చాను. ఏ అన్న అయినా చెల్లెలికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి. అది ఆడబిడ్డ హక్కు. ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. ఆ ధర్మాన్ని సహజంగా అందరూ పాటిస్తుంటారు. కొందరు చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమదిగా భావిస్తుంటారు. కొందరు గిఫ్టుగా ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేవాళ్లు కూడా లేకపోలేరు. చెల్లెలి వాటా ఇవ్వకపోగా, ఒక్క కొసరు భాగం ఇచ్చి... దాన్నీ అప్పు ఇచ్చినట్లుగా చూపించేవాళ్లు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం. అది దేవుడికి తెలుసు. మా కుటుంబంలో అందరికీ తెలుసు’ అని షర్మిల పరోక్షంగా తన సోదరుడు జగన్పై చురకలు వేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!