icon icon icon
icon icon icon

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్‌

కేంద్ర పథకాలకు జగన్‌ తన పేరు పెట్టుకొని ప్రచారం చూసుకుంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 22 Apr 2024 05:51 IST

పేరాల చంద్రశేఖర్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేంద్ర పథకాలకు జగన్‌ తన పేరు పెట్టుకొని ప్రచారం చూసుకుంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపాకు ఒక్క ఎమ్మెల్యే లేకున్నా రాష్ట్రాన్ని కేంద్రం ఏనాడూ చిన్నచూపు చూడకుండా అన్ని విధాలా అభివృద్ధి చేసిందని తెలిపారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. వైద్యరంగం కోసం సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది’ అని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

జగన్‌కు పురందేశ్వరి గురించి మాట్లాడే అర్హత లేదు

రూ.40 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో నిందితుడైన సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గురించి మాట్లాడే అర్హతే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌డీ విల్సన్‌ అన్నారు. ‘హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు, బాబాయిని హతమార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని జగన్‌ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు’ అని విల్సన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img