పవన్ కల్యాణ్ ఆస్తులు రూ.164.54 కోట్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, కుటుంబ సభ్యులకు కలిపి రూ.164.54 కోట్ల ఆస్తులు, రూ.65.77 కోట్ల అప్పులున్నాయి.
అప్పులు రూ.65.77 కోట్లు
వైకాపా హయాంలో 6 కేసులు
ఈనాడు, రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్, కుటుంబ సభ్యులకు కలిపి రూ.164.54 కోట్ల ఆస్తులు, రూ.65.77 కోట్ల అప్పులున్నాయి. ఇవి పవన్తోపాటు భార్య అన్నా, పిల్లలు దేశాయ్ అకీరానందన్, దేశాయ్ ఆద్య, కొణిదెల పోలినా అన్డ్జ్హనీ, కె.మార్క్శంకర్ పేరిట ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్వో కార్యాలయంలో మంగళవారం పవన్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తం చరాస్తులు రూ.46.18 కోట్లు. వీటిలో పవన్ పేరిట రూ.41.65 కోట్లు, భార్య పేరుతో రూ.కోటి, పిల్లల వద్ద రూ.90 లక్షల విలువైన చరాస్తులున్నాయి.
- పవన్ వద్ద రూ.3.15 లక్షల నగదు, బ్యాంకుల్లో రూ.16.48 కోట్లు ఉన్నాయి. భార్య అన్నా చేతిలో రూ.19,340, బ్యాంకుల్లో రూ.86 లక్షలున్నాయి. పవన్ వద్దనున్న 1.6 కిలోల బంగారం, ఇతర ఆభరణాల విలువ రూ.2.34 కోట్లు. అన్నా నగల విలువ రూ.13.97 లక్షలు. కుమార్తె పోలినా పేరిట 50 గ్రాముల బంగారముంది.
- పవన్ కుటుంబ సభ్యులకు రూ.14.01 కోట్ల విలువ చేసే 11 వాహనాలున్నాయి. వాటిలో 9 కార్లు.
- మొత్తం స్థిరాస్తులు రూ.118.36 కోట్లు. వీటిలో పవన్ పేరుతో రూ.94.41 కోట్లు, భార్య పేరిట రూ.1.95 కోట్లు, పిల్లలు పోలినా, మార్క్శంకర్ పేరున చెరో రూ.11 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి.
వదిన దగ్గర రూ.2 కోట్ల రుణం
పవన్ వివిధ బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు, వ్యక్తులు, సంస్థల వద్ద రూ.46.70 కోట్లు, ఇతరత్రా రూ.1.50 కోట్ల రుణం తీసుకున్నారు. రుణ మొత్తం రూ.65.77 కోట్లు. వదిన కొణిదెల సురేఖ వద్ద రూ.2 కోట్ల అప్పు తీసుకోగా, వీఆర్ విజయలక్ష్మి వద్ద రూ.8 కోట్లు, హారిక అండ్ హాసినీ క్రియేటివ్స్ నుంచి రూ.6.35 కోట్లు, మైత్రీ మూవీ మేకర్స్ వద్ద రూ.3 కోట్ల చొప్పున రుణం పొందారు.
ఆంధ్ర, తెలంగాణలో 8 కేసులు
పవన్ కల్యాణ్పై తెలుగు రాష్ట్రాల్లో 8 కేసులు ఉండగా, వీటిలో వైకాపా అధికారంలోకి వచ్చాక 6 నమోదయ్యాయి. వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేశారంటూ 2023లో గుంటూరు, విజయవాడ, ఏలూరులో కేసులు పెట్టారు. విద్వేష ప్రసంగం చేశారని 2023 జులైలో ఏలూరు, విజయవాడలో 2 కేసులు నమోదయ్యాయి. వాహనాన్ని వేగంగా నడపడంతోపాటు రూఫ్ టాప్పై ప్రయాణించారంటూ 2022 నవంబరులో తాడేపల్లిలో కేసు నమోదైంది. కేసీఆర్పై విమర్శలు చేశారని 2018లో మహబూబాబాద్లో, మీడియాపై ఆరోపణలు చేశారని బంజారా హిల్స్ స్టేషన్లో మరో కేసు ఉంది.
చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు
పవన్ గత ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లు కాగా, ఆదాయ పన్ను రూపేణా రూ.47.07 కోట్లు చెల్లించినట్లు జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ కింద రూ.26.85 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. ‘పవన్ కల్యాణ్ రూ.20 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చారు. అందులో జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమా సేవా కార్యక్రమాలకు రూ.17.15 కోట్లు, వివిధ సంస్థలకు విరాళాల కింద రూ.3.32 కోట్లు అందజేశారు. కేంద్రీయ సైనిక బోర్డు, పీఎం సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్కు రూ.కోటి చొప్పున ఇచ్చారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున అందించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు రూ.30.11 లక్షలు, పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్లెన్స్కు రూ.2 లక్షల విరాళమిచ్చారు.
నరేంద్రవర్మ ఆస్తులు రూ.109.47 కోట్లు
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ, ఆయన భార్య హరికుమారి దంపతుల ఉమ్మడి ఆస్తి రూ.109.47 కోట్లు. వర్మ పేరిట చరాస్తులు రూ.73.72 కోట్లు, స్థిరాస్తులు రూ.22.59 కోట్లు కలిపి మొత్తంగా రూ.96.31 కోట్లు ఉన్నాయి. అప్పు రూ.25.91 కోట్లు. హరికుమారికి రూ.11.29 కోట్ల చరాస్తులు, రూ.1.87 కోట్ల స్థిరాస్తులున్నాయి. వర్మకు సొంత కారు లేదు. ఆయనపై 9 పోలీసు కేసులున్నాయి. ఇవన్నీ వైకాపా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో నమోదైనవే.
విష్ణుకుమార్రాజు ఆస్తులు రూ.106.22 కోట్లు
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు, భార్య సీతాసుజాత ఉమ్మడి ఆస్తులు రూ.106.22 కోట్లు. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తులు రూ.91.69 కోట్లు, చరాస్తులు రూ.2.90 కోట్లు, అప్పులు రూ.5.72 కోట్లు. భార్యకు రూ.10.14 కోట్ల స్థిరాస్తులు, రూ.1.49 కోట్ల చరాస్తులున్నాయి. ఆమె అప్పు రూ.1.67 కోట్లు. ఆయనపై ఒక పోలీసు కేసుంది. వీరికి వాహనాల్లేవు.
ప్రత్తిపాటి పుల్లారావుపై 13 కేసులు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెదేపా అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 13 కేసులున్నాయి. 2019లో కేసుల్లేకపోగా, వైకాపా అధికారంలోకి వచ్చాకే ఈ కేసులన్నీ పెట్టారు. పుల్లారావు దంపతుల పేరుతో చరాస్తులు రూ.55.70 కోట్లు, స్థిరాస్తులు 15.51 కోట్లు, అప్పులు రూ.35.90 కోట్లు ఉన్నాయి.
విజయసాయిరెడ్డిపై 11 సీబీఐ, 8 ఈడీ కేసులు
ఈనాడు, నెల్లూరు: నెల్లూరు లోక్సభ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేణుంబాక విజయసాయిరెడ్డి.. అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం.. సీఎం జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడి(ఏ-2)గా ఉన్న సాయిరెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు 8, సీబీఐ కేసులు 11 ఉన్నాయి. వీటిపై న్యాయ విచారణ కొనసాగుతోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లతో పాటు నేరపూరిత కుట్ర, మోసం తదితర సెక్షన్ల కింద కేసులున్నాయి. ఇటీవల కందుకూరులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 2 కేసులు నమోదయ్యాయి.
సాయిరెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.36.36 కోట్లు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస భవనాల విలువ రూ.29.32 కోట్లు. భార్య సునందారెడ్డి వద్ద రూ.4.46 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఉన్నాయి. వీరికి రూ.22.84 లక్షల అప్పుంది. 2022 మేలో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్తో పోల్చితే.. ఆస్తులు రూ.14.79 కోట్లు పెరిగాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్