అంతా ఆణిముత్యాలట.. అక్రమార్కుల మాటేంటి?
విజయనగరం నుంచి వైకాపా తరఫున లోక్సభకు పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్తోపాటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివారు, వెన్నలాంటి మనసున్న వారని సీఎం జగన్ కితాబిచ్చారు.
విజయనగరం జిల్లాలో పోటీ చేసే వైకాపా వాళ్లంతా
సౌమ్యులని జగన్ కితాబు
ఈనాడు, అమరావతి, విజయనగరం: విజయనగరం నుంచి వైకాపా తరఫున లోక్సభకు పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్తోపాటు అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివారు, వెన్నలాంటి మనసున్న వారని సీఎం జగన్ కితాబిచ్చారు. విజయనగరం జిల్లా చెల్లూరులో మంగళవారం నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సుయాత్రలో వారిని ప్రజలకు పరిచయం చేశారు. అయిదేళ్లుగా విజయనగరం జిల్లాలో భూకబ్జాలు, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలకు పాల్పడిన నాయకులెవరో కూడా సీఎం జగన్ కనుక్కుని ఓటర్లకు వివరిస్తే బాగుండేదేమో? అని జిల్లావాసులు పేర్కొంటున్నారు.
సౌమ్యుడు-1: బొత్స సత్యనారాయణ
‘చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ నాకు తండ్రిలాంటి వారు. అన్నా అంటాను. మంచివాడు. సౌమ్యుడు’ అంటూ జగన్ ఆయన్ని ఆకాశానికెత్తేశారు. ఆయన ప్రాతినిధ్యం వహించే చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఒక కుటుంబం కొన్నేళ్లుగా శాసిస్తోంది. వారు చెప్పిందే వేదం.. చేసిందే నిర్ణయమన్నట్లు ఉంది. మరి మీరు మంచివారనే బొత్స సత్యనారాయణకు వాళ్ల సంగతి ఏమైనా తెలుసా? భూవివాదాలైనా, ఇతర ఆస్తుల గొడవలైనా ఈ కుటుంబమే సెటిల్మెంట్లు చేస్తుందని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులనుంచి ఉద్యోగుల వరకు వీరు చెప్పినట్లు చేయాల్సిందేనని అంటున్నారు. సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకుంటున్నారని.. బొబ్బిలిలోని పారిశ్రామిక గ్రోత్సెంటర్లో ఒక నాయకుడి సోదరుడు తక్కువ ధరకే భూమి దక్కించుకున్నారనే విషయమైనా మంత్రి బొత్స దృష్టికి వచ్చిందో లేదో కాస్త ఆరా తీసి ఓటర్లకు వివరిస్తారా జగన్?
సౌమ్యుడు-2: బొత్స అప్పలనరసయ్య
‘గజపతినగరం నుంచి పోటీ చేస్తున్న అప్పలనరసయ్య మంచివాడు.. సౌమ్యుడు. వెన్నలాంటి మనసున్నవాడు’ అని జగన్ పరిచయం చేశారు. గజపతినగరంలో స్థిరాస్తి వ్యాపారం చేసే నాయకుడొకరు తాము వేసే లేఅవుట్లకు ప్రభుత్వ నిధులతో రోడ్లేయిస్తారట. పట్టణంలో బాహ్యవలయ రహదారి పేరుతో తమ భూముల విలువలూ పెంచుకున్నారట. తన నియోజకవర్గంలో జరిగే ఈ అక్రమాలు అప్పలనరసయ్యకు తెలిసే ఉంటాయి కదా? కాస్త కనుక్కుంటారా జగన్! కె.కొత్తవలస, ఎం.గుమడాం గ్రామాల్లో రైతుల మధ్య భూవివాదాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసి లాభాలు దండుకున్న ప్రముఖులెవరో తెలుసుకుని ఓటర్లకు చెబుతారా?
సౌమ్యుడు-3 కోలగట్ల వీరభద్రస్వామి
‘విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రస్వామి సౌమ్యుడు. ఆయన మనసు వెన్న’ అంటూ జగన్ కితాబిచ్చారు. వెన్నలాంటి మనసున్న వీరభద్రస్వామికి విజయనగరంలో అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకునే నాయకుల సంగతి ఏమైనా తెలుసో లేదో? పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు కొని అదే భూమిని మళ్లీ ప్రభుత్వానికే ఎక్కువ ధరకు అమ్ముకున్న నాయకులెవరో కాస్త కనుక్కోకూడదూ? ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే రెవెన్యూ, పోలీసు, నగరపాలక సంస్థ, రిజిస్ట్రేషన్లు తదితర ప్రభుత్వ శాఖల్లో ఏ పని కావాలన్నా కప్పం కట్టాల్సిందేనట! వ్యాపారం ప్రారంభిస్తే అందులో వాటా ఇవ్వాల్సిందేనట. ఇవన్నీ చేసేదెవరో, నియోజకవర్గాన్ని గంజాయి మాఫియాకు కేంద్రబిందువుగా మార్చిందెవరో సౌమ్యుడైన వీరభద్రస్వామి మీకు ఏమైనా చెప్పారా? లేదా? కాస్త ఆరా తీయండి.
సౌమ్యుడు-4 బడ్డుకొండ అప్పలనాయుడు
‘నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తున్న అప్పలనాయుడు మంచివాడు. సౌమ్యుడు. మీ అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి’ అని జగన్ పరిచయం చేశారు. మైనింగ్ మాఫియాకు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చి భోగాపురం మండలంలో మైనింగ్ తవ్వకాల ద్వారా గ్రామాలను ధ్వంసం చేసి నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి కొండపై తవ్వకాలకు ఏర్పాట్లుచేసిన ప్రముఖులెవరో మీకెంతో నమ్మకస్తులైన అప్పలనాయుడికి తెలుసో లేదో? భూఆక్రమణలు, ఇసుక దందాల ద్వారా రూ.కోట్లు ఆర్జించే నాయకులెవరో కనుక్కుంటారా?
సౌమ్యుడు-5 శంబంగి వెంకట చినఅప్పలనాయుడు
‘బొబ్బిలి నుంచి పోటీ చేస్తున్న చినఅప్పలనాయుడు మంచివాడు. సౌమ్యుడు. వెన్నలాంటి మనసున్నవాడు’ అని జగన్ పొగడ్తలు కురిపించారు. వెన్నలాంటి మనసున్న చినఅప్పలనాయుడుకు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు బెదిరించి తక్కువ ధరకు లాక్కునే నాయకుల సంగతి ఏమైనా తెలిసి ఉంటుందంటారా? ఆ నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా టెండరు వేసేది ఒక్క సంస్థేనట. అధికారాన్ని ఉపయోగించి లేఅవుట్లలో సామాజిక అవసరాల స్థలాన్నీ అమ్మేసుకుంటారంట.. వాళ్లెవరో ఆయన్ను కనుక్కుని చెబుతారా?
సౌమ్యుడు-6: గొర్లె కిరణ్
‘ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తున్న కిరణన్న మంచివాడు. సౌమ్యుడు. కటువుగా అప్పుడప్పుడు కనిపిస్తాడు గానీ .. గుండె చాలా మెతక’ అని జగన్ కితాబిచ్చారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇసుక దోపిడీ, రియల్ఎస్టేట్ దందాలు అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాల్సిందేనట. కొండల్ని కరిగించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో సౌమ్యుడైన కిరణ్ను కనుక్కుంటారా? ప్రశాంత ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని హత్యా రాజకీయాలకు వేదికగా మార్చిన నాయకుడెవరో మెతక గుండె కలిగిన మీ మంచివాడికి తెలుసేమో కనుక్కుని ఓటర్లకు వివరిస్తారా జగన్?
సౌమ్యుడు-7 బెల్లాన చంద్రశేఖర్
‘విజయనగరం లోక్సభ స్థానానికి పోటీ చేసే చంద్రశేఖరన్న. మంచివాడు, సౌమ్యుడు’ అని సీఎం జగన్ ప్రజలకు పరిచయం చేశారు. చీపురుపల్లి మండలం దేవరాపొదిలాంలో తనకు ప్రభుత్వం కేటాయించిన 4.75 ఎకరాల మెట్ట భూమి కబ్జాకు గురైందని మాజీ సైనికుడు ఎస్.శ్రీనివాసరావు రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాసిన సంగతి మంచివాడైన చంద్రశేఖర్కు తెలుసా? ఆయనకు చెప్పి శ్రీనివాసరావుకు న్యాయం చేయకూడదూ? పోలీసు కేసులు, ప్రైవేటు వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేసే నేతలెవరో.. మద్యం సిండికేట్, అక్రమ మైనింగ్ తవ్వకాలకు కారకులెవరో కాస్త కనుక్కుంటారా?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం