మే నెల పింఛన్లు ఇళ్ల వద్దే ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే సామాజిక పింఛన్లను మే నెలలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఆ మేరకు చర్యలు తీసుకోవాలి
పంపిణీని ఎన్నికల సంఘం పర్యవేక్షించాలి
సీఈసీ రాజీవ్కుమార్కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే సామాజిక పింఛన్లను మే నెలలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం వారితో కుమ్మక్కైన కొందరు అధికారులు ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారని, ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్కు 16 పేజీల లేఖ రాశారు. ‘లబ్ధిదారులకు ప్రభుత్వపరమైన ప్రయోజనాలను అందించేటప్పుడు వాలంటీర్లను దూరం పెట్టి, సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 30న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి పింఛన్లను లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పంపిణీ చేయడమే మంచిదని, అది సాధ్యమేనని జిల్లా కలెక్టర్లు చెప్పారు. అందుకోసం గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితోపాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్ద పంపిణీ చేసి, మిగతావారికి సచివాలయాల వద్ద అందించాలని ఉత్తర్వులిచ్చింది. అందరికీ ఇళ్ల వద్దే అందించాలన్న నా విజ్ఞప్తిని సీఎస్, అధికారులు పెడచెవిన పెట్టారు. ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీకి అవసరమైన డబ్బును ఏప్రిల్ 3న విడుదల చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఆ మూడు రోజులూ మండుటెండల్లో సచివాలయాల చుట్టూ తిప్పారు. ఈ ప్రక్రియలో 33 మంది చనిపోయినట్లు వార్తలొచ్చాయి. దీన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత మీడియా సంస్థలు, వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఈ మొత్తం వ్యవహారానికి ఎన్నికల సంఘం, ప్రత్యర్థి రాజకీయ పార్టీలే కారణమని విషప్రచారం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, వారితో చేతులు కలిపిన అధికారులు మే నెల పింఛన్ల పంపిణీలోనూ ఇదే తరహా కుట్రకు తెరతీసేందుకు అవకాశాలున్నాయి. ఎండలు భరించలేని స్థాయికి చేరినందున లబ్ధిదారులను సచివాలయాలకు రప్పించి గంటల తరబడి ఎండల్లో నిలబెడితే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గ్రామస్థాయిలో పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున రెండు రోజుల్లో అందరికీ ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వొచ్చు. మే 1న పింఛన్లను లబ్ధిదారులందరికీ ఇళ్ల వద్దే ఇస్తామని ప్రభుత్వం మీడియాలో విస్తృత ప్రచారం చేయాలి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలి. పింఛన్ల పంపిణీని పర్యవేక్షించి పేదల ప్రాణాలను కాపాడాలి’ అని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు.
రాజీనామా చేసిన వాలంటీర్లన ఏజెంట్లుగా అనుమతించొద్దు: కనకమేడల
రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా అనుమతించవద్దని తెదేపా మాజీ ఎంపీ, ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘ఎన్నికల్లో నిష్పాక్షికతను, పారదర్శకతను కాపాడటానికి ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఇప్పటి వరకు లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు పంపిణీ చేసినవారు ఓటింగ్కు వచ్చే పేదలను అధికార పార్టీకి అనుకూలంగా ఓటేయమని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల రాజీనామా చేసిన, ఉద్యోగాల నుంచి తొలగించిన వాలంటీర్లు ఎవర్నీ పోలింగ్ ఏజెంట్లుగా కానీ, కౌంటింగ్ ఏజెంట్లుగా కానీ అనుమతించకుండా రిటర్నింగ్ అధికారులకు తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలి’ అని లేఖలో కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి. -
జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?
సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. -
మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్ బుక్’ ఉందని హెచ్చరించారు. -
దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. -
మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. -
పోస్టల్ బ్యాలెట్కు రూ.3 వేలు
తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించే కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించకూడదు. -
జగన్ గెలిస్తే ప్రజల భూములన్నీ తాకట్టే!
కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల భూముల్ని తాకట్టు పెట్టడానికి జగన్ కుట్ర పన్నినట్లు తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. -
సందిగ్ధతతో ఓటును చెల్లని కాగితంగా చేయొద్దు..!
పోస్టల్ బ్యాలట్ వేయడంలో కొంతమంది ఉద్యోగులు చేస్తున్న తప్పుల కారణంగా ఓట్లు చెల్లనివిగా మారుతున్నాయి. ఓటు వేయడంలో సందేహాలు ఉంటే అక్కడే ఉండే పీఓ, ఏపీఓల సహాయం సైతం తీసుకోవచ్చు. -
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తంగా మారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజల ఆస్తులు లాక్కొనేందుకు జగన్ కుట్ర
భూ యాజమాన్య హక్కు చట్టం పేరిట ప్రజల ఆస్తులను లాక్కొనేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
నేడు ధర్మవరానికి అమిత్షా.. జమ్మలమడుగుకి రాజ్నాథ్సింగ్
అనంతపురం జిల్లా ధర్మవరంలోని బత్తలపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొననున్నారు. -
రేపు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాతో తెదేపా, జనసేన కూటమిగా జట్టుకట్టిన తర్వాత తొలిసారిగా చిలకలూరిపేట బహిరంగసభకు వచ్చిన మోదీ.. తాజాగా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటించేందుకు సోమవారం రానున్నారు. -
పవన్ను ఇబ్బంది పెట్టాలని హెలిప్యాడ్ ధ్వంసం
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా నిర్మించిన హెలిప్యాడ్ను వైకాపా నాయకులు శనివారం ధ్వంసం చేశారు. -
అలా ఫిర్యాదు... ఇలా ఆదేశాలు
సీఎం జగన్ మొదలుకుని కింది స్థాయి వైకాపా నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా అసత్య ఆరోపణలతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయటంపై ఎన్ని ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం (ఈసీ).. ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు చేస్తున్న ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తోంది. -
జగనన్న బ్రాండ్లు వద్దే వద్దు...‘గోవా’ నకిలీ మద్యం అంటగట్టొద్దు
‘జగనన్న బ్రాండ్ల మద్యం వద్దే వద్దు..గోవా బ్రాండ్ల పేరిట అంటగడుతున్న నకిలీ మద్యం అసలే వద్దు. ప్రచారానికి వస్తుంటే మా ప్రాణాలతో చెలగాటమాడతారా? -
ఎన్నికలయ్యేలోపు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టేసుకోండి
ఎన్నికల వేళ ఓట్లను అక్రమంగా పొందడానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కొత్త ఎత్తు వేశారు.