icon icon icon
icon icon icon

చంద్రబాబు విజయమే మా లక్ష్యం

రాష్ట్రంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకోని జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు ఓటెయ్యాలని మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రశ్నించారు.

Published : 25 Apr 2024 06:37 IST

మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగ

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకోని జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు ఓటెయ్యాలని మాదిగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రశ్నించారు. దళితులకు న్యాయం జరగాలన్నా, రక్షణ ఉండాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెదేపా విజయానికి రాష్ట్రంలో ఉన్న 35 మాదిగ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయని వెల్లడించారు. కూటమి గెలుపు కోసం విజయవాడ నుంచి శ్రీకాళహస్తి వరకు చేపట్టిన చైతన్యయాత్ర కడపకు చేరుకున్న సందర్భంగా బుధవారం ఇక్కడ వెంకటేశ్వరరావు మాట్లాడారు. వైకాపా సర్కార్‌లో ఎస్సీల సంక్షేమాన్ని నిర్వీర్యం చేశారని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు రద్దు చేశారని ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా జగన్‌ మౌనం వహించడం దుర్మార్గమన్నారు. గత ఎన్నికల్లో కోడి కత్తి, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. జగన్‌ నాటకాలు ఇక సాగవని, దళితులందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో వైకాపా విజయానికి మాల, మాదిగల ఓట్లే కారణమని, ఇప్పుడు చంద్రబాబును గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమావేశంలో మాదిగ సంఘాల నాయకులు ఆర్‌జే.ప్రకాశ్‌, రమేష్‌, జెంజిమిన్‌, సుబ్బయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img