జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు.. పరిపాలన చేతకాక జనాన్ని నట్టేట ముంచేసిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.
వైకాపాను భూస్థాపితం చేయడానికే మా శపథం
సింగవరం సభలో తెదేపా అధినేత చంద్రబాబు
మే 13న ఫ్యాన్ స్విచ్ఛాఫ్ చేయండి
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పిలుపు
ఈనాడు, విజయనగరం: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు.. పరిపాలన చేతకాక జనాన్ని నట్టేట ముంచేసిన దుర్మార్గుడు జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి, వైకాపాను భూస్థాపితం చేస్తానని ప్రతినబూనారు. జనం కూడా జగన్ను ఓడించి, ఎన్డీయే కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విజయనగరం, సింగవరంలలో బుధవారం జరిగిన బహిరంగ సభల్లో వారాహి వాహనం పైనుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి ఆయన మాట్లాడారు. రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం శిరస్సు తొలగించిన ముష్కరులను పట్టుకోలేని ఈ జగన్ను ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘101 దేవాలయాలకు ధర్మకర్త అయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజుపై కూడా కేసులు పెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే నాపైనే కేసులు పెడతారు. అధికారం కోసం 2019లో బాబాయ్ హత్య డ్రామాతో వచ్చారు. ఈసారి గులకరాయి నాటకమాడుతున్నారు. కానీ ప్రజలు ఆయన్ను నమ్మరు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులు నామినేషన్ల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ ద్వారా కానిస్టేబుల్, గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటా. ఉద్యోగాలొచ్చే వరకు నిరుద్యోగభృతి అమలు చేస్తా. పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తా’ అని పేర్కొన్నారు.
జగన్కు బాబు సవాల్
‘జగన్ ఉత్తరాంధ్రకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా తెచ్చారా? ఒక్కటైనా పూర్తి చేశారా? మా హయాంలో ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చా. ఆనాడే భూసేకరణ జరిపి, శంకుస్థాపన కూడా చేశాం. జగన్ వచ్చి దానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. కూటమి అధికారంలోకి వస్తే 2025 నాటికే ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేయిస్తా. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి. ఈ ప్రాంతం సస్యశ్యామలమవ్వాలన్నదే నా కల. దుర్మార్గుడైన జగన్ వచ్చి అవన్నీ నాశనం చేశారు. పైగా ఈ ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ 25కి 25 ఎంపీ సీట్లొస్తాయని చెప్పుకొంటున్నారు’ అని పేర్కొన్నారు. ‘వై నాట్ పులివెందుల’ అని జగన్కు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మేలు కోసం రాజకీయాల్లో అడుగుపెట్టిన నేత మన పవన్ కల్యాణ్ అని చంద్రబాబు అన్నారు. జగన్కు, పవన్కు పోలికే లేదన్నారు. వైకాపాను చిత్తు చేసే వరకు తామిద్దరం నిద్రపోమన్నారు. జగన్ సింగిల్గా వస్తున్నా అంటున్నారు.. కానీ అవినీతి డబ్బుతో, బందిపోట్ల అండతో వస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి రూ.450 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్ నుంచి రూ.800 కోట్లు, పంచాయతీల నుంచి రూ.8 వేల కోట్లు, భవన నిర్మాణ కార్మికుల నుంచి రూ.450 కోట్లు దోచేశార[ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, డ్రగ్స్ కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రం అన్నింట్లోనూ వెనుకబడి ఉన్నా.. గంజాయిలో మాత్రం అగ్రస్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెరిగాయన్నారు. కరెంటు బిల్లు తగ్గాలంటే వాడకం తగ్గించడం కాదని.. మే 13న ‘ఫ్యాన్’ స్విచ్ ఆపేయండని జనసేనాని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఏపీలో ఎన్నో వనరులను పెట్టుకుని ప్రజలు ఇతర రాష్ట్ర్రాలకు, విదేశాలకు ఎందుకు వలస వెళ్లాలి? ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలి. కూటమిని గెలిపిస్తే ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. రాష్ట్ర ప్రగతికి సేవకుడిలా, ప్రజల భవితకు కూలీలా పనిచేస్తా. విజయనగరం ఎప్పుడు వచ్చినా.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు ద్వారా తెలుస్తోంది. మేం వచ్చాక అన్నిరకాలుగా ఆదుకుంటాం’ అని చెప్పారు.
మీ భవిష్యత్తు కోసమే పోరాడుతున్నాం
‘70 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఆయనకు రాజకీయ పోరాటం మాత్రమే తెలుసు. నాకు డబ్బులు అవసరం లేదు. రూ.కోట్లలో ఆదాయపన్ను కట్టాను. నా అఫిడవిట్ చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరినీ మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మాకేమీ కాదు. కానీ రాష్ట్రంలో యువత, రైతులు అన్ని వర్గాలవారు నష్టపోతారు. మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే మేం కలిసి పోరాడుతున్నాం. పొత్తు కోసం జనసేన నాయకులు ఎలా తగ్గారో తెదేపా, భాజపా నాయకులు కూడా అలాగే తగ్గారు’ అని పవన్ పేర్కొన్నారు.
మాట మార్చిన జగన్
‘విశాఖ విమానాశ్రయంలో ఈగలను తోలుకుంటుంటే.. భోగాపురం విమానాశ్రయం అవసరమా అని ప్రతిపక్ష నేతగా జగన్ ఎద్దేవా చేశారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ అధికారంలోకి వచ్చాక విమానాశ్రయ భూముల్ని లాక్కున్నారు. నాడు జీఎంఆర్కు వద్దని.. ఇప్పుడు మళ్లీ అదే సంస్థకు నిర్మాణ పని అప్పగించారు’ అని పవన్ ధ్వజమెత్తారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థులు లోకం మాధవి, అదితి గజపతిరాజులను గెలిపించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కోరారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి. -
జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?
సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. -
మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్ బుక్’ ఉందని హెచ్చరించారు. -
దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. -
మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. -
పోస్టల్ బ్యాలెట్కు రూ.3 వేలు
తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించే కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించకూడదు. -
జగన్ గెలిస్తే ప్రజల భూములన్నీ తాకట్టే!
కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల భూముల్ని తాకట్టు పెట్టడానికి జగన్ కుట్ర పన్నినట్లు తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. -
సందిగ్ధతతో ఓటును చెల్లని కాగితంగా చేయొద్దు..!
పోస్టల్ బ్యాలట్ వేయడంలో కొంతమంది ఉద్యోగులు చేస్తున్న తప్పుల కారణంగా ఓట్లు చెల్లనివిగా మారుతున్నాయి. ఓటు వేయడంలో సందేహాలు ఉంటే అక్కడే ఉండే పీఓ, ఏపీఓల సహాయం సైతం తీసుకోవచ్చు. -
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తంగా మారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజల ఆస్తులు లాక్కొనేందుకు జగన్ కుట్ర
భూ యాజమాన్య హక్కు చట్టం పేరిట ప్రజల ఆస్తులను లాక్కొనేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
నేడు ధర్మవరానికి అమిత్షా.. జమ్మలమడుగుకి రాజ్నాథ్సింగ్
అనంతపురం జిల్లా ధర్మవరంలోని బత్తలపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొననున్నారు. -
రేపు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాతో తెదేపా, జనసేన కూటమిగా జట్టుకట్టిన తర్వాత తొలిసారిగా చిలకలూరిపేట బహిరంగసభకు వచ్చిన మోదీ.. తాజాగా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటించేందుకు సోమవారం రానున్నారు. -
పవన్ను ఇబ్బంది పెట్టాలని హెలిప్యాడ్ ధ్వంసం
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా నిర్మించిన హెలిప్యాడ్ను వైకాపా నాయకులు శనివారం ధ్వంసం చేశారు. -
అలా ఫిర్యాదు... ఇలా ఆదేశాలు
సీఎం జగన్ మొదలుకుని కింది స్థాయి వైకాపా నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా అసత్య ఆరోపణలతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయటంపై ఎన్ని ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం (ఈసీ).. ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు చేస్తున్న ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తోంది. -
జగనన్న బ్రాండ్లు వద్దే వద్దు...‘గోవా’ నకిలీ మద్యం అంటగట్టొద్దు
‘జగనన్న బ్రాండ్ల మద్యం వద్దే వద్దు..గోవా బ్రాండ్ల పేరిట అంటగడుతున్న నకిలీ మద్యం అసలే వద్దు. ప్రచారానికి వస్తుంటే మా ప్రాణాలతో చెలగాటమాడతారా? -
ఎన్నికలయ్యేలోపు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టేసుకోండి
ఎన్నికల వేళ ఓట్లను అక్రమంగా పొందడానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కొత్త ఎత్తు వేశారు.