icon icon icon
icon icon icon

వైకాపా అభ్యర్థికి చెందిన కళాశాలలో రూ.67లక్షలు స్వాధీనం

విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కి చెందిన నగరంలోని 104ఏరియాలో ఉన్న రామబాణం కళాశాలలో అనధికారికంగా ఉన్న రూ.67లక్షలను ఉత్తర నియోజకవర్గ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకుంది.

Published : 27 Apr 2024 05:51 IST

విశాఖపట్నం (మాధవధార), న్యూస్‌టుడే: విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కి చెందిన నగరంలోని 104ఏరియాలో ఉన్న రామబాణం కళాశాలలో అనధికారికంగా ఉన్న రూ.67లక్షలను ఉత్తర నియోజకవర్గ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకుంది. కళాశాలలో డబ్బుల పంపిణీ జరుగుతోందని ఫిర్యాదు రావడంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పట్టుకున్న రూ.67లక్షల నగదును ఈఆర్వో కార్యాలయంలో అప్పగించారు. వీటికి సరైన పత్రాలు లేకపోవడంతో ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు ఏఈఆర్వో శ్రీరామూర్తి తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే వైకాపా నాయకులు గత కొన్ని రోజులుగా ఈ కళాశాల నుంచి డబ్బుల పంపిణీ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన వారిని వైకాపాలో చేర్చుకునే కార్యక్రమం ఇక్కడే నిర్వహించి, వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఈ కళాశాలలో ప్రత్యేక నిఘా పెట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తే అనధికారిక నగదు, ఇతర సామగ్రి బయటపడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img