మద్యనిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతారు జగన్?
మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్న మీరు...ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మ్యానిఫెస్టోని విడుదల చేసి ఓట్లు అడుగుతున్నారని సీఎం జగన్ను తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు.
85 శాతం హామీల్ని విస్మరించి.. ఇంకో మ్యానిఫెస్టోతో మోసం
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్న మీరు...ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మ్యానిఫెస్టోని విడుదల చేసి ఓట్లు అడుగుతున్నారని సీఎం జగన్ను తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. ‘‘మ్యానిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నారు. వాటిలో ఏ ఒక్కదాని మీదన్నా మీకు గౌరవం ఉంటే...2019 వైకాపా మ్యానిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యనిషేధం చేసి ఉండేవారు’’ అని ఎక్స్ వేదికగా శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రేషన్ దుకాణాల ద్వారా వంద శాతం సన్నబియ్యం పంపిణీ, వారంలో సీపీఎస్ రద్దు, బడుగుబలహీన వర్గాలకు 45 ఏళ్లకే పింఛన్, ప్రత్యేక హోదా సాధన...మీరిచ్చిన 730 హామీల్లో కొన్ని. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా అమలుచేయలేదు. ఆ మాటకొస్తే 85 శాతం హామీలను జగన్ నెరవేర్చలేదు’’ అని చంద్రబాబు విమర్శించారు. మళ్లీ ఇంకోసారి మోసపోవడానికి మీరు సిద్ధమా అని జగన్ అడుగుతున్నారని..మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం అని గట్టిగా చెప్పండని ప్రజలకు పిలుపునిచ్చారు.
వైకాపా మ్యానిఫెస్టో తేలిపోయింది
-తెదేపా
ఈనాడు డిజిటల్, అమరావతి: గత ఎన్నికల్లో 25మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేకహోదా సాధిస్తానని గొప్పలు చెప్పిన సీఎం జగన్.. నేడు వైకాపా మ్యానిఫెస్టోలో హోదా మాటే తీయలేదని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్బాబు, అధికార ప్రతినిధి జీవీరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తామని, మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి.. ఈసారి వాటి ప్రస్తావనే విస్మరించారని మండిపడ్డారు. ఎన్డీయే ‘సూపర్సిక్స్’ పథకాల ముందు వైకాపా మ్యానిఫెస్టో తేలిపోయిందని ఎద్దేవా చేశారు.99 శాతం హామీల్ని అమలు చేశామంటూ జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పాతర్ల రమేశ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో మాయాజాలం
-రఘురామకృష్ణరాజు
ఈనాడు డిజిటల్, భీమవరం, కాళ్ల, న్యూస్టుడే: జగన్ సినిమా కథలు చెప్పి మోసం చేయాలని చూస్తే ప్రజలు నమ్మరని.. పాత సీసాలో పాత సారానే నింపి కొత్త మ్యానిఫెస్టో పేరిట మరో మాయాజాలానికి సిద్ధమయ్యారని నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు విమర్శించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘ఇంటింటికీ పింఛను పంపిణీ చేయనంటూ సీఎస్ అనడం హాస్యాస్పదంగా ఉంది. శవ రాజకీయాలను నమ్ముకున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారు. మే 1న ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా ఈసీ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
జగన్ మ్యానిఫెస్టోను నమ్మరు
-పురందేశ్వరి
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: సీఎం జగన్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మరని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో వైకాపా విడుదల చేసిన మ్యానిపెస్టోను ఏ మేరకు అమలు చేశారనే దానిపై ముందు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘పేదలకు గృహాల నిర్మాణం, రైతు భరోసా విషయంలో మోసం చేశారు. రైతులకు కోల్డ్స్టోరేజీలు, ప్రతి జిల్లాలో ఎయిర్పోర్టుల నిర్మాణంపై మాట తప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం నీరుగార్చారు. పోలవరం పరిస్థితి అందరికీ తెలిసిందే. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం మరిచిపోగలమా?’ అని ప్రశ్నించారు. కూటమి మ్యానిఫెస్టోపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే తెదేపా, జనసేన కలిసి సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టాయని, ఇక కేంద్రప్రభుత్వం అమలు చేసే పథకాలను జతచేసి ముందుకెళతామని తెలిపారు.
జగన్ నిస్సహాయతకు అద్దం
-నీలాయపాలెం
ఈనాడు, అమరావతి: రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా, ఆదాయాన్ని పెంచేలా, పరిశ్రమలు తెచ్చేలా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలేవీ లేని వైకాపా మ్యానిఫెస్టో చూస్తే.. జగన్ నిస్సహాయ స్థితిలోకి వెళ్లారని స్పష్టంగా తెలుస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ విమర్శించారు. ‘హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు మూడు రాజధానుల ఆలోచనను తప్పుపట్టినా, మూర్ఖత్వంతో జగన్ మళ్లీ అదే పాటపాడారు’ అని మండిపడ్డారు.
అంతా బూటకం
-లంకా దినకర్
ఈనాడు డిజిటల్, అమరావతి: గతంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చకపోగా మళ్లీ ఈ ఎన్నికల్లో పాత పాటే పాడుతున్నారని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. వైకాపా విడుదల చేసిన 2024 మ్యానిఫెస్టో అంతా బూటకమని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు.
పాత పథకాలే
-సాదినేని యామినీశర్మ
వైకాపా విడుదల చేసిన 2024 మ్యానిఫెస్టోని ప్రజలు నమ్మే స్థితిలో లేరని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ పేర్కొన్నారు. పాత పథకాలనే కొనసాగిస్తూ ప్రజలని మరోసారి మోసం చేయడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్