అబద్ధాలు చెప్పను.. మోసం చేయను
‘జగన్ అబద్ధాలు ఆడడు, చేయలేకపోతే చేయనని చెబుతాడు తప్ప మోసం చేయడు. అబద్ధపు హామీలతో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవే 2019 మ్యానిఫెస్టోలో చెప్పి.
2019 మ్యానిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశాం
వచ్చే ఐదేళ్లలో పింఛన్ రెండు విడతల్లో రూ.500 పెంపు
2024 ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా జగన్
మూడు రాజధానులు ఉంటాయని పునరుద్ఘాటన
ఈనాడు, అమరావతి: ‘జగన్ అబద్ధాలు ఆడడు, చేయలేకపోతే చేయనని చెబుతాడు తప్ప మోసం చేయడు. అబద్ధపు హామీలతో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవే 2019 మ్యానిఫెస్టోలో చెప్పి.. వాటిలో 99 శాతం అమలు చేసి, ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాం’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ‘2019 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేస్తూ ఏటా ఏమేం అమలు చేశామనేదీ ప్రజల వద్దకు తీసుకువెళ్లాం. ఇలాంటిది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు’ అని పేర్కొన్నారు. ‘మ్యానిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా పేదలను ప్రేమించడంలో, వారికి మంచి చేయడంలో జగన్ వేసినన్ని అడుగులు ఎవరూ వేయలేదు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలిస్తే.. 2019 నుంచి ఇప్పటి వరకూ మేం 2.30 లక్షల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబుతో అబద్ధాల్లో పోటీపడలేను. ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎంత చేయగలమో ఆ మేరకే చెబుతున్నా’ అంటూ శనివారం ఆయన వైకాపా మ్యానిఫెస్టోను ప్రకటించారు. కొత్త హామీలు, ఉన్న పథకాల్లోనూ పెద్దగా మార్పుచేర్పులేమీ లేకుండా సాదాసీదా మ్యానిఫెస్టో విడుదల చేశారు.
యువత-ఉపాధి
‘నైపుణ్యంపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లను ఏర్పాటు చేస్తాం. 26 జిల్లా కేంద్రాల్లోనూ ఒక్కోటి చొప్పున నైపుణ్యాభివృద్ధి కళాశాలలు, తిరుపతిలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. వీటిలో శిక్షణ పొందేవారికి ఇంటర్న్షిప్ సమయంలో అబ్బాయిలకు రూ.2,500, అమ్మాయిలకు రూ.3 వేలు ఇస్తాం.
ప్రభుత్వ ఉద్యోగులకు..
జగనన్న విదేశీ విద్యకు ఎంపిక కాని ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి వారు తీసుకున్న విద్యా రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని వారి కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్ఠంగా ఐదేళ్లపాటు చెల్లిస్తాం. రూ.25 వేల వరకు జీతం పొందే ఆప్కాస్లోని ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా వర్కర్ల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాలూ వర్తిస్తాయి.
వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తి చేస్తాం..
- భోగాపురం విమానాశ్రయాన్ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేస్తాం.
- ఐదేళ్లలో పోలవరం, 17 వైద్య కళాశాలలు, నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, భూముల సర్వే, పేదలందరికీ ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం, ఆక్వా, ఉర్దూ, గిరిజన విశ్వవిద్యాలయాలు పూర్తి చేస్తాం.
విశాఖ నుంచి పాలన
వైకాపా తిరిగి అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన సాగుతుంది. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం.
చంద్రబాబు.. సంపద ఎక్కడ సృష్టించారు?
‘నేను సంపద సృష్టిస్తా, కాబట్టే పథకాలను ఇవ్వగలనని చంద్రబాబు సమర్థించుకుంటున్నారు. ఆధారాలతో చూపిస్తున్నా, ఆయన 14 సంవత్సరాల పాలనలో ఏ ఏడాదీ రెవెన్యూ మిగులు లేదు, రెవెన్యూ వ్యయంలోనే లోటు ఉంటే ఇక ఆయనెక్కడ సంపద సృష్టించారని అడుగుతున్నా. అదే చంద్రబాబుకు ముందు, తర్వాత ప్రభుత్వాల్లో రెవెన్యూ మిగులు ఉంది. ఆయనకు సమర్థమైన ఆర్థిక నియంత్రణ లేదు, సంపదను సృష్టించే శక్తీ లేదు. కానీ, జగన్ వద్ద అవినీతి, వివక్ష లేదు. కాబట్టే ఇన్ని పథకాలను చేయగలిగాడు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
సామాజిక న్యాయాన్ని చూపించాం
- 175 అసెంబ్లీ, 25 లోక్సభ.. మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం.
- ప్రభుత్వ బడుల్లో పిల్లలకు ఆంగ్ల మాధ్యమ విద్య హక్కుగా అమల్లోకి తెచ్చాం. 2039లో పదో తరగతి పిల్లలు రాష్ట్ర బోర్డుతోపాటు ఐబీ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. విద్యలోనే కాదు వైద్య రంగంలో, మహిళా సాధికారతలో, సామాజిక న్యాయంలో కనీవినీ ఎరగని మార్పులు ఈ రోజు కనిపిస్తున్నాయి.
- పింఛన్ రూ.3 వేలను రాబోయే ఐదేళ్లలో రెండు విడతలుగా మరో రూ.3,500కు పెంచుతాం. ఇందులో 2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో మరో రూ.250 పెంచుతాం.
- వైఎస్సార్ చేయూత రూ.75 వేలు ఉండేది. నాలుగు దఫాల్లో ఇచ్చాం. మరో నాలుగు దఫాల్లో ఇంకో రూ.75 వేలు ఇస్తాం.
- రైతుభరోసా కింద గత ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.16 వేల చొప్పున రూ.80 వేలు అందజేస్తాం. పంట వేసే సమయంలో రూ.8 వేలు, కోత కోసేటప్పుడు రూ.4 వేలు, సంక్రాంతికి మరో రూ.4 వేలు ఇస్తాం. రైతులకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది.
- ఆటో, ట్యాక్సీలతోపాటు సొంత టిప్పర్, లారీలు నడిపేవారికీ వాహనమిత్ర వర్తింపజేస్తాం. వీరికి రూ.10 లక్షల ప్రమాదబీమా కల్పిస్తాం.
- వైఎస్సార్ కాపు నేస్తం గత ఐదేళ్లలో రూ.60 వేలు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో మరో రూ.60 వేలు ఇస్తాం.
- వైఎస్సార్ ఈబీసీ నేస్తం గతంలో మూడు దఫాల్లో రూ.45 వేలు ఇచ్చాం. ఇప్పుడు నాలుగు దఫాల్లో మొత్తం రూ.60 వేలు ఇస్తాం.
- జగనన్న అమ్మ ఒడి కింద గతంలో రూ.15 వేలు ఇచ్చేవాళ్లం. ఇందులో అమ్మలకు రూ.13 వేలు, పాఠశాల నిర్వహణకు రూ.2 వేలు కేటాయించేవాళ్లం. ఇప్పుడు ఆ మొత్తాన్ని అమ్మలకు రూ.15 వేలు పెంచి ఇస్తాం. పాఠశాలల నిర్వహణకు రూ.2 వేలు అదనంగా కేటాయిస్తాం.
- వైఎస్సార్ ఆసరా కింద రూ.3 లక్షల వరకు రుణాలపై సున్నా వడ్డీ పథకాన్ని వచ్చే ఐదేళ్లూ కొనసాగిస్తాం.
- వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా ఈ ఐదేళ్లు కూడా కొనసాగుతుంది.
- పేదలందరికీ ఇళ్ల పట్టాలు. ఇప్పటికే 31 లక్షల పట్టాలు ఇచ్చాం. వాటిలో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇందులో 9 లక్షలు పూర్తయ్యాయి. మిగిలినవి కట్టే కార్యక్రమం కొనసాగుతుంది.
- పట్టణాల్లోని మధ్యతరగతి వారి కోసం ఎంఐజీ లేఅవుట్లను తీసుకువస్తాం. దీని కోసం ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తూ.. రూ.2 వేల కోట్ల కార్పస్ ఫండ్నూ పెడతాం.
- మొత్తం జనాభాలో 50 శాతం దళితులు లేదా వారి జనాభా 500కు పైన ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం