జగన్ ముఖ్యమంత్రా? మద్యం వ్యాపారా?
కూటమి కలయిక తమ కోసం కాదని.. రాష్ట్రం, ప్రజల కోసమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. అన్ని వర్గాల సంక్షేమం కోరి ఈ నెల 30న పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
మద్యం అమ్మకాలతో రూ.41 వేల కోట్లు సంపాదించారు
అంతులేని వైకాపా దోపిడీకి ఓటుతో సమాధానం చెప్పండి
అందరికీ ఆమోదయోగ్యంగా 30న కూటమి మ్యానిఫెస్టో
ఇంద్రపాలెం, సామర్లకోట సభల్లో పవన్ కల్యాణ్
ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం
16 మద్యం తయారీ కంపెనీలు జగన్ బినామీలవే..
‘జగన్, వైకాపా నాయకులు మాట్లాడితే.. పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నారు. అవినీతి చేయకపోతే ఎంత మిగులుతుందో మీకు చెప్తాను. 2019లో మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి.. ముఖ్యమంత్రిలా కాకుండా సారా వ్యాపారిలా మారి రూ.41 వేల కోట్లను జగన్ సంపాదించారు. ఉత్పత్తి అవుతున్న లిక్కర్లో 74 శాతం, 16 కంపెనీలు జగన్ బినామీలవే. ఆదాన్ డిస్టిలరీ, స్పై ఆగ్రో మిథున్రెడ్డి కంపెనీలు. వైకాపా నాయకులు రాష్ట్రంలో ఎవర్నీ బతకనివ్వరు. యువత బలంగా నిలబడి అలాంటి వారిని ఎదుర్కోకపోతే మీకే నష్టం.’
జనసేనాని పవన్ కల్యాణ్
కూటమి కలయిక తమ కోసం కాదని.. రాష్ట్రం, ప్రజల కోసమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. అన్ని వర్గాల సంక్షేమం కోరి ఈ నెల 30న పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటల్లో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. కుల గణాంకాలు, ప్రతిభ గణాంకాలు తీసుకుంటామని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ‘వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది? మీకు వివరంగా చెప్పా. అరుపులతో లాభం లేదు, ఓట్లు వేయండి చాలు. వైకాపా రౌడీయిజానికి, దాష్టీకానికి భయపడితే ఎక్కడికని పారిపోతారు? మీ గుండెల్లో ధైర్యమనే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు ఇచ్చినా వృథాయే’ అని అన్నారు. ‘ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడానికి డబ్బుల్లేవు. కానీ పీడీఎస్ బియ్యం స్కాంలో రూ.20 వేల కోట్లు దోచేశారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడానికి, వాటిని తీయడానికి రూ.2,300 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వాహనాల స్కాం రూ.830 కోట్లు, చెత్త సేకరణ స్కాం రూ.1,500 కోట్లు. చిన్నపిల్లలు తినే చిక్కీల్లోనూ రూ.61 కోట్లు దోచేశారు. బైజూస్ ట్యాబ్ల పేరుతో రూ.212 కోట్లు మింగేశారు’ అని మండిపడ్డారు.
చిరంజీవి భిక్షతో ఎదిగారు.. ఆయన కోసం నిలబడలేరా?
జగన్ అహంకారంతో చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్.. అందర్నీ పిలిచి అవమానించారని, వారు బతిమాలుతుంటే వీడియోలు తీసి, విడుదల చేశారని మండిపడ్డారు. ‘ఆయన అలా అవమానిస్తుంటే.. చిరంజీవి భిక్షతో ఎదిగిన మీరేం చేస్తున్నారు? ఆయన వెనుక నిలబడాలనే ఇంగితం లేదా? సిగ్గుందా?’ అని కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కన్నబాబుపై దుమ్మెత్తిపోశారు. ‘డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు నేడు రూ.వెయ్యి కోట్ల ఆస్తిపరుడయ్యారు. కాకినాడ గ్రామీణంలోని వాకలపూడిలో రూ.20 కోట్ల విలువైన 4.86 ఎకరాల లేఔట్లో 20 మంది స్థలాలు కొనుక్కుంటే కడప జిల్లా వైకాపా నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కన్నబాబు అండతో చుట్టూ గోడ కట్టించేశారు. స్థలాలు కొన్న బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాకినాడ గ్రామీణంలో అనుమతి లేఔట్కు ఇన్ని లక్షలని రేటు కట్టి వసూలు చేస్తున్నారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక డాక్టర్ కిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. 5 ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడితో అగ్రిమెంట్ చేయించుకుంటే ఆస్తి పత్రాలు, ఆస్తి తీసుకుని వేధించారు’ అని పవన్ ధ్వజమెత్తారు. ఇంతమందిని దోపిడీ చేసిన కన్నబాబు లాంటి వారిని వ్యక్తిని, మత్స్యకారులకు ద్రోహం చేసినవారిని గెలిపిస్తామా అని ప్రజల్ని ప్రశ్నించారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక ద్వారంపూడి, కన్నబాబులతో నరకం స్పెల్లింగ్ రాయిస్తా. అందుకే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. వీళ్ల సంగతి తేల్చడానికే వచ్చా’ అని హెచ్చరించారు.
వైకాపాకు ఎందుకు ఓటేయాలని అడగండి
‘వైకాపా నాయకులు వస్తే మీకు ఎందుకు ఓటేయాలని అడగండి. జగన్ బీసీ ఉప ప్రణాళిక నిధులు మళ్లించారు. 27 దళిత పథకాలు తీసేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వనన్నారు. ఈబీసీ రిజర్వేషన్ తీసేశారు. బీసీలు, ఎస్సీలకు, ఎస్టీలు, కాపులకు అన్యాయం చేశారు. కల్లుగీత కార్మికులపై అక్రమంగా 9 వేల కేసులు పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి, రోడ్డు మీదకు లాగేస్తారు’ అని ధ్వజమెత్తారు.
భవిత కోసం కూటమి రావాలి
‘యువతకు ఉపాధి, భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీసి, యువతను రాజకీయ లబ్ధికి వాడుకున్నారు. తుని ఘటనలో ఎంతోమంది రైల్వే కేసుల్లో నలిగిపోయారు. జనసేన, తెదేపా ఆలోచనా విధానం ఒకటే. నదుల అనుసంధానం చేసి రైతులు కన్నీరు పెట్టకుండా చేయడమే లక్ష్యం. ఉద్యోగులకు సీపీఎస్పై ఒక పరిష్కారం కనుక్కుంటాం. ఏ పథకాన్నీ రద్దు చేయం. అదనంగా ఇస్తాం. ఐదేళ్లలో రూ.200 కోట్లు సంపాదించి, రూ.73 కోట్లు ట్యాక్స్ కట్టాను. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్చరణ్ అంత పెద్ద నటుణ్ని కాకపోయినా నాదైన బలం నాకుంది. ఇంత సంపాదించినా ఈ నేల కోసం కష్టపడే బలమైన సమూహం నాకు కావాలి’ అని పవన్ అన్నారు. కూటమి కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్, కాకినాడ గ్రామీణం అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పలను గెలిపించాలని పవన్ కల్యాణ్ కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ