పొన్నవోలును ఏఏజీగా నియమించడం.. ‘క్విడ్ ప్రో కో’ కాక మరేమిటి?
‘ఎవరైనా తన తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్పించిన వ్యక్తిని పిలిచి ఏఏజీ (అదనపు అడ్వొకేట్ జనరల్)గా నియమిస్తారా? నేనైతే అలా చేయను.
సీబీఐ ఛార్జిషీట్లో ఆయన చేతనే వైఎస్సార్ పేరు చేర్పించారు
అక్రమాస్తుల కేసులో జగన్ బయటపడాలనే ప్రయత్నంలో ఇదో భాగం
అందుకు ప్రతిఫలమే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏఏజీగా నియామకం
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం
ఈనాడు డిజిటల్-విశాఖపట్నం, శ్రీకాకుళం, న్యూస్టుడే, టెక్కలి: ‘ఎవరైనా తన తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్పించిన వ్యక్తిని పిలిచి ఏఏజీ (అదనపు అడ్వొకేట్ జనరల్)గా నియమిస్తారా? నేనైతే అలా చేయను. కానీ జగన్ చేశారు. వాస్తవానికి అక్రమాస్తుల కేసులో రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఆయన పేరు లేకపోతే దాని నుంచి బయటపడటం అసాధ్యమని జగన్ భావించారు. దీంతో వైఎస్సార్ పేరు చేర్చేలా సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పొన్నవోలుతో పిటిషన్లు వేయించారు. వైఎస్సార్ అంటే గౌరవం అని పొన్నవోలు చెప్పడం అబద్ధం. అభిమాన నాయకుడైతే ఛార్జిషీట్లో ఆయన పేరు చేర్చాలని కోర్టుల చుట్టూ తిరుగుతారా? జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పొన్నవోలుకు ఏఏజీ పోస్టు కట్టబెట్టారు. మీ మధ్య ఏం సంబంధం లేకపోతే ఏఏజీగా ఎందుకు అవకాశం ఇచ్చారు. ఇది క్విడ్ ప్రో కో కాకపోతే మరేమిటి?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు విశాఖ స్టీల్ప్లాంట్లోని సీఐటీయూ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో జగనే పెట్టించారని గతంలో ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. పీసీసీ అధ్యక్షురాలైన నన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నారు’ అని షర్మిల మండిపడ్డారు. ఛార్జిషీట్లో పేర్లు చేర్చడంలో ఎవరి ప్రమేయం ఉండదని సీబీఐ మాజీ జేడీ, జైభారత్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. సీబీఐ అధికారిగా చేసిన పనులకు, పార్టీ అధ్యక్షుడిగా చేసే వ్యాఖ్యలకు తేడా ఉంటుందని సమాధానమిచ్చారు.
వైకాపా మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేయండి
‘2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్న హామీలు నెరవేర్చనప్పుడు.. కొత్త మ్యానిఫెస్టోను ఎలా నమ్మాలి. ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు. మద్యపాన నిషేధం చేయలేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. వైకాపా కార్యకర్తలకు వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి వాటినే ప్రభుత్వ ఉద్యోగాలుగా మభ్యపెట్టారు. మూడు రాజధానులని ఊదరగొట్టి ఒక్క నగరాన్ని కూడా నిర్మించలేదు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. అన్ని విషయాల్లో విఫలమైన మీకు మళ్లీ ఎందుకు ఓటెయ్యాలి. మీ మ్యానిఫెస్టోను తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయండి’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంగా బాధ్యత లేదా?
‘విశాఖ స్టీల్ప్లాంట్ను విక్రయించాలని చూస్తున్నారు. గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాను జగన్ రూ.600 కోట్లకు అదానీకి అమ్మేశారు. గంగవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లో ఉంటే స్టీల్ప్లాంట్కు మేలు జరిగేది. ఉక్కు పరిశ్రమకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఐరన్ఓర్ గనులను కేటాయించాలని వైఎస్సార్ ప్రయత్నించారు. అయిదేళ్లు సీఎంగా ఉన్న జగన్ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఉక్కు పోరాట కమిటీ నాయకులు ఇటీవల జగన్ను కలిస్తే.. స్టీల్ప్లాంట్ నష్టాల్లో ఉందా అని ప్రశ్నించిన ఆయన గురించి ఏం చెప్పాలి. పరిశ్రమలను కాపాడాల్సిన బాధ్యత సీఎంగా తనపై లేదా?’ అని ప్రశ్నించారు.
రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి..
‘వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడినని చెప్పుకొనే జగన్లో ఆయన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నిత్యం ప్రజల్ని కలిసి సమస్యలు పరిష్కరించిన వైఎస్ ఎక్కడ.. ఐదేళ్లపాటు ప్రజలకు కనిపించని జగన్ ఎక్కడ. స్వప్రయోజనాల కోసం పనిచేశారే తప్ప ప్రజల కోసం ఏం చేయలేదు. ఆఖరికి రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి వెళ్తున్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లతో మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం తాగి చాలామంది చనిపోతున్నారు’ అని షర్మిల మండిపడ్డారు.
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్
‘రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి ఫ్యాక్షనిజం నిర్మూలనకు కృషి చేస్తే.. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. హత్యలు చేసిన వారిని కాపాడుతున్నారు. రాజారెడ్డిని హత్య చేసిన వారిలో ఒకరైన సతీష్రెడ్డి ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు’ అని విమర్శించారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సత్యారెడ్డి, విశాఖ తూర్పు, ఉత్తరం, దక్షిణ, భీమిలి కాంగ్రెస్ అభ్యర్థులు శ్రీనివాసరావు, రామారావు, సంతోష్, హాసిని వర్మ, పశ్చిమ నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి విమల, గాజువాక సీపీఐ అభ్యర్థి జగ్గునాయుడు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!