icon icon icon
icon icon icon

వైకాపా అభ్యర్థి బావమరిది అతి తెలివి.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి..

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బావమరిది, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పి.మునిరెడ్డి అలియాస్‌ బంగారురెడ్డి అతి తెలివితేటలు ప్రదర్శించారు.

Updated : 01 May 2024 10:35 IST

ఈనాడు, కడప: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బావమరిది, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పి.మునిరెడ్డి అలియాస్‌ బంగారురెడ్డి అతి తెలివితేటలు ప్రదర్శించారు. శివప్రసాద్‌రెడ్డికి ఎన్నికల్లో అక్రమంగా తోడ్పడటానికి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేసి రంగంలో నిలిచారు. ప్రచారంలో ఎన్నికల వ్యయం, పోలింగ్‌ రోజు అభ్యర్థిగా నియోజకవర్గంలో తిరగడం, తన తరఫున పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లను పెట్టుకోవడం వంటి ఎత్తుగడల్లో భాగంగా ఈ పథకం వేశారు. తన పేరు, ఫొటో సరిగ్గా కనిపిస్తే తనకు ఓట్లు పడి బావకు అన్యాయం జరుగుతుందని ముందుగానే ఆలోచించారు. ఆ అవకాశం లేకుండా తలనీలాలు తీసేసినప్పటి ఫొటోను నామినేషన్‌కు సమర్పించి.. పేరునూ కాస్త మార్చి పి.మునిరెడ్డి బంగారుగా పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం జారీ చేయగా అందులో వరుస సంఖ్య పదిలో ఆయన పేరు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img