icon icon icon
icon icon icon

ఉద్యోగాల కల్పనకు ఎన్నారైల హామీ హర్షణీయం: అయ్యన్నపాత్రుడు

తెదేపా ఎన్నారై విభాగం లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

Published : 01 May 2024 06:33 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా ఎన్నారై విభాగం లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పలువురు ప్రవాసాంధ్రులతో కలిసి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగాలొచ్చేలా చూడటం యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబును గెలిపించాలని కోరేందుకు ఎన్నారైలు వచ్చి గ్రామాల్లో ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ జన్మభూమి స్ఫూర్తితో తెదేపా విజయం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఐదేళ్లలో వైకాపా నాయకులు యువతను గంజాయికి బానిసలుగా చేశారని మండిపడ్డారు. నియోజకవర్గానికి ఒక ఎన్నారై తెదేపా కార్యాలయం ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌, ఎన్నారైలు కిశోర్‌బాబు చలసాని, కృష్ణప్రసాద్‌ కాట్రగడ్డ, రాజేష్‌బాబు పోలేటి, యాష్‌ బొడ్డులూరి, డాక్టర్‌ హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img