సీఎం జగన్కు షర్మిల ‘నవ’ ప్రశ్నలు
న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంటే.. హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, న్యాయం జరగకపోతే ఆవేశం రాదా?.. అన్యాయం జరుగుతుంటే గుండె మండదా?.. అంటూ సీఎం జగన్ను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.
హంతకులను అందలం ఎక్కిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ఈనాడు, కడప: న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంటే.. హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?, న్యాయం జరగకపోతే ఆవేశం రాదా?.. అన్యాయం జరుగుతుంటే గుండె మండదా?.. అంటూ సీఎం జగన్ను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని, ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రిని అవుతానన్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం వడ్డమాను గ్రామం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు బహిరంగ సభల్లో మాట్లాడారు. ఎంపీ అవినాష్రెడ్డి కిల్లర్ అని, ఆయన ఎప్పుడైనా కడప స్టీల్ ప్లాంట్ కోసం కొట్లాడారా? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్న హత్య కేసులో నిందితుడని తెలిసీ జగన్ ఆయన్ను మళ్లీ చట్టసభలకు పంపాలని చూస్తున్నారని విమర్శించారు. ‘రాష్ట్రానికి పట్టుమని పది పరిశ్రమలూ తీసుకురాలేదు. ఉద్యోగాలంటూ యువతను మోసం చేశారన్నారు. జగన్కు ఏ వర్గం మీదా ప్రేమ లేదు. ఆయనో కుంభకర్ణుడు. నాలుగున్నరేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు లేచి.. ‘సిద్ధం’ అంటూ హడావుడి చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘వివేకాను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వాళ్లు, హంతకులను కాపాడే వాళ్లు అవసరమా? బద్వేలు నియోజకవర్గానికి రూ.500 కోట్లు ఇస్తామని జగన్ మోసం చేశారు. సోమశిల ఎత్తిపోతల పథకం ద్వారా 40 వేల ఎకరాలకు సాగు నీరిస్తామని పట్టించుకోలేదు. సొంత జిల్లాకే న్యాయం చేయని వ్యక్తి అవసరమా?’ అని ప్రశ్నించారు. న్యాయానికి, నేరస్థులకు మధ్య జరుగుతున్న పోరులో ధర్మం వైపు నిలబడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
వీటికి జవాబు చెప్పాకే ఓట్లు అడగాలని సవాలు
ఈనాడు డిజిటల్, అమరావతి: దళిత, గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వ హయాంలో అమలైన 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్ను ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు చేసిన అన్యాయాలంటూ ‘నవ న్యాయ సందేహాలు’ పేరుతో సీఎం జగన్కు 9 ప్రశ్నలు సంధిస్తూ బుధవారం బహిరంగ లేఖ రాశారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సమాధానాలు చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండు చేశారు. లేకుంటే ఓట్లు అడిగే నైతిక హక్కు వైకాపాకు లేదన్నారు.
షర్మిల సంధించిన 9 ప్రశ్నలు
1 . ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను మీ ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించడం నిజం కాదా?
2 . భూమిలేని పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సాగు కోసం భూమినిచ్చే కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు?
3 . వెట్టి, జోగిని వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది?
4 . విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం చేపట్టిన పథకానికి అంబేడ్కర్ పేరును ఎందుకు తొలగించారు? వేరొకరి పేరు ఎందుకు పెట్టారు?
5 . దళిత, గిరిజన సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి ఈ ఎన్నికల్లో టికెట్లు ఎందుకు నిరాకరించారు? ఇది వివక్ష కాదా?
6 . ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అమలైన 28 పథకాలను ఎందుకు ఆపేశారు?
7 . 2021లో హత్యలు, అత్యాచారాలు, దాడులు అసాధారణంగా పెరిగినట్టు మీ ప్రభుత్వమే కేంద్రానికి నివేదించింది నిజం కాదా?
8 . దళిత డ్రైవర్ను దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో మీ పార్టీ ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు?
9 . ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లకు నిధులివ్వక వాటిని నిర్వీర్యం చేసి, విద్యార్థుల జీవితాలను అంధకారం చేసింది నిజం కాదా?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం