జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం
సీఎం జగన్ మానసిక పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా అధినేత చంద్రబాబే కారణమంటున్నారని మండిపడ్డారు.
సీఎంకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది
దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు విమర్శలు
ఈనాడు, కడప: సీఎం జగన్ మానసిక పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా అధినేత చంద్రబాబే కారణమంటున్నారని మండిపడ్డారు. జగన్కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు. కడపలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జగన్ ఏ స్థాయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు నిరూపించాలని డిమాండు చేశారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వివేకా హత్యకేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్ ఆరోపించారు. సీబీఐ విచారణ కోరారు. సీఎం అయ్యాక సీబీఐ విచారణ అక్కర్లేదన్నారు. చంద్రబాబు హస్తం ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడారు?’ అని షర్మిల ఎద్దేవా చేశారు. తన కుమారుడి వివాహానికి పిలిచేందుకు చంద్రబాబును కలిశానని, తర్వాత మళ్లీ కలిసిందిలేదని స్పష్టంచేశారు. సునీత తన తండ్రి వివేకా హత్యకు సంబంధించి న్యాయం కోసం పోరాడుతుంటే.. ఆమె కూడా చంద్రబాబుతో చేతులు కలిపిందంటూ దారుణంగా విమర్శిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘సీఎం జగన్కు ఓ అద్దం పంపుతున్నా. ఆయన ఆ అద్దంలో చూసుకుంటే తన ముఖం కనిపిస్తుందో... చంద్రబాబు కనిపిస్తారో చెప్పాలి’ అని షర్మిల ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు చెబితేనే నీ కోసం 3,200 కి.మీ. పాదయాత్ర చేశానా? బై బై బాబు అనే క్యాంపెయిన్లో పాల్గొన్నానా?’ అని జగన్ను షర్మిల ప్రశ్నించారు. ‘నేను వైఎస్ఆర్ బిడ్డను.. నేను ఎంత మొండిదాన్నో జగన్కూ తెలుసు. నేను ఎవరో కంట్రోల్ చేస్తే తిరిగే వ్యక్తిని కాదు’ అని స్పష్టంచేశారు.
వైఎస్ఆర్ పేరును చేర్పించింది పొన్నవోలు..
జగన్పై అక్రమాస్తుల కేసు వేసింది.. మాజీ మంత్రి శంకర్రావని.. కానీ ఆయన కేసు చెల్లలేదని షర్మిల గుర్తుచేశారు. ఈ కేసులో తెదేపా నేత ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయ్యారని, ఆ తర్వాత కేసు విచారణ ముందుకు సాగిందని వివరించారు. శంకర్రావు కానీ, ఎర్రన్నాయుడు కానీ వైఎస్ఆర్ పేరును కేసులో చేర్చలేదని స్పష్టంచేశారు. అక్రమాస్తుల కేసు నుంచి బయటపడాలంటే ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరునూ చేర్చాలని జగన్ భావించారని, ఈ మేరకు పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు వెళ్లి మరీ చేర్పించారని గుర్తుచేశారు. జగన్ సీఎం అయ్యాక పొన్నవోలుకు అదనపు అడ్వొకేట్ పదవి ఇచ్చింది అందుకేనని చెప్పారు. ‘వైఎస్ఆర్పై కాంగ్రెస్ కేసు పెట్టిందని మొదట్లో నేను కూడా అనుకున్నాను. సోనియాగాంధీని కలిసిన తర్వాత అసలు విషయం తెలిసింది. మేమెందుకు కేసు పెడతామని సోనియా అన్నారు’ అని షర్మిల వివరించారు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్కుమార్ను కలిసినప్పుడు కూడా ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరును జగనే చేర్పించారని చెప్పినట్లు షర్మిల వెల్లడించారు. వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని జగన్ అప్పట్లో ఆరోపించారని, వైకాపా వారు ఆ సంస్థ ఆస్తుల్ని ధ్వంసం చేశారని గుర్తుచేశారు. తాను సీఎం అయ్యాక రిలయన్స్ చెప్పిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చి.. ఆ సంస్థపై తాను చేసిన ఆరోపణలు అబద్ధమని జగన్ నిరూపించుకున్నారన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్