icon icon icon
icon icon icon

వైకాపా సర్పంచి కారులో 58 కేసుల కర్ణాటక మద్యం పట్టివేత

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె అగస్థి పెట్రోల్‌ బంకు వద్ద ఆలపల్లె వైకాపా సర్పంచి రమణారెడ్డి కారులో 58 కేసుల కర్ణాటక మద్యాన్ని డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీప్రసన్న, జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం, పోలీసులు శనివారం పట్టుకున్నారు.

Published : 05 May 2024 06:40 IST

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె అగస్థి పెట్రోల్‌ బంకు వద్ద ఆలపల్లె వైకాపా సర్పంచి రమణారెడ్డి కారులో 58 కేసుల కర్ణాటక మద్యాన్ని డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీప్రసన్న, జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం, పోలీసులు శనివారం పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.3,50,700 ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. పలమనేరులో శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌ సభకు వైకాపా నాయకులు భారీగా జనసమీకరణ చేశారు. సభకు వచ్చిన వారికి పంపిణీ చేయడానికే ఈ మద్యాన్ని తీసుకొచ్చినట్లు ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img