icon icon icon
icon icon icon

ఎవరొస్తారో రండిరా..

కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Published : 06 May 2024 05:40 IST

ముమ్మిడివరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్‌కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాట్రేనికోన మండలం పల్లంలో శనివారం తన సామాజికవర్గమైన అగ్నికుల క్షత్రియులతో సమావేశం నిర్వహించారు. పొన్నాడ మాట్లాడుతూ.. ‘ఓటు కోసం ఒకరి వద్దకు వెళ్లి దేహీ అని అడుక్కునే జాతి మాది కాదు.. నీతికి నిలబడే జాతి ఏదైనా ఉందంటే అది అగ్నికుల క్షత్రియులదే. నా జాతిని కొంటారా.. ఎవరు వస్తారో రండిరా..’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img