icon icon icon
icon icon icon

ఇప్పుడు గెలవకపోతే.. ఇంకెప్పుడూ పోటీ చేయను: కేఏ పాల్‌

ఈ సారి ఎన్నికల్లో తాను గెలవకపోతే మరే ఎన్నికల్లోనూ పోటీచేయనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి కేఏ పాల్‌ అన్నారు.

Updated : 09 May 2024 07:05 IST

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: ఈ సారి ఎన్నికల్లో తాను గెలవకపోతే మరే ఎన్నికల్లోనూ పోటీచేయనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి కేఏ పాల్‌ అన్నారు. విశాఖ లోక్‌సభ పరిధిలోని శృంగవరపుకోట నియోజకవర్గంలో బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు. గెలిచిన వంద రోజుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విశాఖ మార్గంలో రోడ్డు పక్కన సరదాగా తాటిముంజలు కొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img