మోదీ నాయకత్వాన్ని ప్రపంచమంతా కోరుకుంటోంది
దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో తీసుకెళ్తున్న మోదీ నాయకత్వాన్ని యావత్ ప్రపంచం కోరుకుంటోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ అన్నారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ
నిజామాబాద్ భాజపా అభ్యర్థిగా అర్వింద్ నామినేషన్
ఈనాడు, నిజామాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో తీసుకెళ్తున్న మోదీ నాయకత్వాన్ని యావత్ ప్రపంచం కోరుకుంటోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ అన్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గురువారం ముఖ్యఅతిథిగా హాజరైన పుష్కర్సింగ్ అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో సీఏఏ అమలు.. కశ్మీర్లో 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన ధైర్యశాలి మోదీ అని అన్నారు. దేశంలో పౌరులందరికీ సమన్యాయం కోసం ఒకే చట్టం ఉండేలా యూనిఫాం సివిల్ కోడ్ను ప్రతిపాదించినట్లు చెప్పారు. ప్రజలంతా భాజపాకు ఓటు వేసి, మోదీకి అండగా నిలిచి దేశ ప్రగతికి తోడ్పాటునందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం లౌకికవాద జపం చేస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహించిన ఆ పార్టీ.. మైనార్టీల ఓట్ల కోసం తన మ్యానిఫెస్టో రూపొందించిందన్నారు. రాష్ట్రంలో అహంకారంతో పాలన సాగించిన భారాసను, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఓడించాలని కోరారు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి దోషిగా రుజువు కావడం ఖాయమని, దీంతో జులైలో ఆయన రాజీనామా చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని అర్వింద్ అన్నారు. గాంధీభవన్లో.. భాజపా పాలనపై రేవంత్ ఛార్జిషీట్ విడుదల చేయడంపై ఆయన స్పందించారు. ఓటుకు నోటు కేసులో దోషిగా తేలుతాననే ఆందోళనతో రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం కుట్రతోనే రైతుబంధు ఆగింది
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను దీవించారు.. పదిహేనేళ్లు పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను. ఆ తర్వాత ఒక్కోటి బాగుచేస్తూ రాష్ట్రాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దాను. -
విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లు ఎలా అడుగుతారు?
ప్రధాని మోదీ.. విభజన హామీలేవీ నెరవేర్చకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వరంగల్ వస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు
ఎన్నికల ప్రచారం, పోలింగ్కు నేతల సన్నద్ధతపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం సాగుతున్న తీరుపై రాష్ట్ర ముఖ్యనేతలను అప్రమత్తం చేసింది. -
అవినీతి అంతం మోదీతోనే సాధ్యం
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి భాజపాను గెలిపించాలని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ పిలుపునిచ్చారు. -
దేశ సుస్థిరతకు మోదీ నాయకత్వం అవసరం
దేశ సుస్థిరతకు, ప్రజాసంక్షేమానికి కేంద్రంలో మోదీ నాయకత్వం అవసరమని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి కిషన్రెడ్డి అన్నారు. -
ఓట్ల కోసమే ‘రైతు భరోసా’ను అడ్డుకున్నాయి
రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తుంటే.. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి భాజపా, భారాస అడ్డుకున్నాయని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్లు మంగళవారం విమర్శించారు. -
ప్రియాంకాగాంధీ పర్యటన 11కు వాయిదా
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 10న కాకుండా 11న తెలంగాణకు వస్తున్నారు. -
నేడు మోదీ, రేపు అమిత్షా సభలు
ప్రధాని మోదీ బుధవారం, కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మోదీ మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకుని రాజ్భవన్లో బస చేశారు. -
సీబీఐ విచారణకు నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా!
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఆ పార్టీ నేతలు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మండిపడ్డారు. -
సోషల్ మీడియా ప్రచార ఖర్చుపై ఎన్నికల సంఘం నజర్
లోక్సభ అభ్యర్థుల ప్రచార ఖర్చుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. అనుమతులు లేకుండా సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్తో చేస్తున్న ప్రచార వివరాలను సమీకరిస్తోంది. -
మోదీ మోసం.. కేసీఆర్ నమ్మక ద్రోహం
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ, పదేళ్లు పాలించి యువతను మోసం చేశారని.. దళిత ముఖ్యమంత్రి, రెండు పడక గదుల ఇళ్ల హామీలను నెరవేర్చకుండా భారాస అధ్యక్షుడు కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
రఘురాంరెడ్డికి ఓటేయండి
అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు.. ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు.. అలాంటి రఘురాంరెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీనటుడు విక్టరీ వెంకటేశ్ పిలుపునిచ్చారు. -
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు భాజపా యత్నం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థులు పన్నెండు మందిని తప్పకుండా గెలిపిస్తే.. ఆర్నెల్ల వ్యవధిలోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారు?
‘‘పిరమైన ప్రధాని నరేంద్ర మోదీజీ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి. దశాబ్ద కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లడగండి’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా మంగళవారం ప్రధానిని ఉద్దేశించి.. కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. -
భాజపాను మించిన అవినీతి పార్టీ లేదు
దేశంలో భాజపాను మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు 57 ఎస్సీ ఉప కులాల ఫెడరేషన్ మద్దతు
రాష్ట్రంలో 57 దళిత ఉపకులాలు, వృత్తి కళాకారులు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ 57 ఎస్సీ ఉప కులాల ఫెడరేషన్ అధ్యక్షుడు పశుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
రిజర్వేషన్ల రద్దే భాజపా అసలు ఎజెండా
భాజపా అసలు ఎజెండా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేయడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పార్టీ నేతలు బండ్ల గణేశ్, సామ రాంమోహన్రెడ్డిలతో కలసి గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఆరు గ్యారంటీల్లో అమలైంది ఒక్కటే
‘కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చెప్పిన 6 గ్యారంటీలు.. 66 హామీలు.. 400కుపైగా వాగ్దానాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరేదీ అమలు కాలేదు. -
మోదీపై కాంగ్రెస్ ఫిర్యాదు
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. -
మెజారిటీ స్థానాలు భాజపావే..
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ భాజపాకు ఎంతో అనుకూలంగా ఉందని, రానున్న ఐదు రోజులు కీలకమని, అప్రమత్తంగా వ్యవహరించాలని భాజపా కీలక నేత బి.ఎల్.సంతోష్ పార్టీ విభాగాలకు సూచించారు. -
రిజర్వేషన్లపై నకిలీ వీడియోల వెనక సీఎం రేవంత్రెడ్డి
రిజర్వేషన్ల విషయంలో మార్ఫింగ్ వీడియోలతో భాజపాను అభాసుపాలు చేయాలని కొంతమంది చూస్తున్నారని.. అలాంటి వారికి ఓట్ల రూపంలో ప్రజలే గుణపాఠం చెబుతారు అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు.