icon icon icon
icon icon icon

MRPS: జగన్‌ ఏపీకి శాపం.. ఆయన్ని ఇంటికి పంపాల్సిందే: మందకృష్ణ మాదిగ

 రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిన సీఎం జగన్‌ను ఇంటికి పంపాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

Published : 06 May 2024 20:24 IST

అనంతపురం: రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిన సీఎం జగన్‌ను ఇంటికి పంపాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. అనంతపురంలో ఎమ్మార్పీఎస్‌ నాయకుల ఆత్మీయసమ్మేళనంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... వైకాపా పాలనలో ఎస్సీ వర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్‌ నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలన్నా, ఎస్సీ వర్గీకరణ సాధించాలన్నా, ఎన్డీయే కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అనంతపురం లోక్‌సభ కూటమి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img