ఈ చలిలో.. ఇగ్లూలో.. ఆ కిక్కే వేరు!
ఎత్తైన పర్వతాలు..పచ్చని లోయలు.. హిమానీ నదుల అందాలు.. గలగలపారే సెలయేళ్లు.. సాహసోపేతంగా సాగే నదీయానం.. వీటికితోడు మంచుతో నిర్మించిన ఇగ్లూ ఇళ్లు.. పర్యాటకులను కట్టి పడేస్తున్నాయి. ఇంతకీ ఇవన్నీఎక్కడో బయటి దేశంలో ఉన్నాయనుకుంటే పొరబడినట్లే..
మనాలిలో ప్రత్యేక ఆకర్షణగా ఇగ్లూ హోటల్
ఇంటర్నెట్ డెస్క్: ఎత్తైన పర్వతాలు.. తెల్లగా పరుచుకున్న మంచు దుప్పట్లు.. మధ్యలో మంచుతో నిర్మించిన ఇళ్లు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడో బయటి దేశంలో ఉన్నాయనుకుంటే పొరబడినట్లే. ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే హిమాచల్ప్రదేశ్లోని మనాలికి వెళితే చాలు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులూ ఇంట్లోనే ఉన్న పర్యాటక ప్రియులు.. ఈసారి మనాలికి వెళ్తే ఓ సరికొత్త అనుభూతిని పొందొచ్చు. మనం చిన్నప్పుడు సాంఘికశాస్త్రంలో చదువుకున్న ఇగ్లూలు అక్కడ దర్శనమిస్తాయి. ఆ మంచు ఇళ్లలో సరదాగా రెండు మూడు రోజులు గడిపేయొచ్చు. దేశంలోనే మొట్టమొదటి సారి నిర్మించిన ఇగ్లూల్లో ఉంటూ ఆర్కిటిక్ ప్రాంత అనుభూతిని పొందొచ్చు.
ప్రకృతి అందాల కలబోత..
మనాలి.. ప్రకృతి అందాలతో నిండిన సుందర ప్రదేశమే కాదు.. సాహస క్రీడలకు అనువైన ప్రాంతం కూడా. ఇది సిమ్లా నుంచి దాదాపు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి మరో 15 కిలోమీటర్లు వెళ్తే హమ్తా పాస్లోని ఇగ్లూ హోస్ట్ ప్రాంతానికి చేరుకోవచ్చు. సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ మంచు ఇళ్లను 2017లో సేథన్ గ్రామానికి చెందిన వికాస్ కుమార్, తాషీ అనే ఇద్దరు యువకులు ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఈ ఇళ్లలో ఉండాలంటే అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.
ఏటా శీతాకాలంలో ఈ ఇగ్లూలను పర్యాటకుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఏప్రిల్ వరకు ఇవి పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది లాక్డౌన్ నేపథ్యంలో మార్చిలోనే మూసివేశారు. కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం తాజాగా వికాస్ బృందానికి ఇగ్లూ హోటల్ తెరవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో ఇగ్లూలను నిర్మించే పనిలో పడింది వికాస్ బృందం.
పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
మనాలిలోని ఈ ఇగ్లూలను హోటల్గా మార్చారు. ప్రస్తుతం ఆరుగురు వ్యక్తులు దీన్ని నిర్వహిస్తున్నారు. మనాలిలో రాత్రి ఉష్ణోగ్రత మైనస్ నాలుగు నుంచి ముప్పై డిగ్రీలకు పడిపోతుంది. అందువల్ల, పర్యాటకులు చలిని తట్టుకునేలా జనరేటర్ సాయంతో హీటర్లను ఏర్పాటు చేశారు. ఇగ్లూ లోపల ఎండుగడ్డి, విద్యుత్ దీపాల ఏర్పాటు ఉంటుంది. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక దుస్తులు, వేడి నీళ్ల బాటిళ్లు సైతం అందుబాటులో ఉంటాయి. అలాగే రాత్రి ఇక్కడ బస చేసే వారికి అల్పాహారం, టీ, కాఫీతో పాటు శాకాహారం, మాంసాహారంతో చేసిన వివిధ రకాల వంటకాలు సైతం లభిస్తాయి.
అందుబాటులో ప్యాకేజీలు..
ఇగ్లూలో ఉండేందుకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కేవలం పగటి వేళ మాత్రమే అయితే పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. పగలు, ఒకరాత్రి ఉండేందుకు రూ.5,500 వసూలు చేస్తున్నారు. అలాగే రెండు రాత్రులు, మూడు రోజుల ప్యాకేజీకి ఒక్కో వ్యక్తికి రూ.పదివేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆరేళ్లలోపు పిల్లలకు ఇక్కడికి అనుమతి లేదు. వీటితో పాటు పగటి వేళ స్కేయింగ్, స్నో బోర్డింగ్ వంటి ఆటలతోపాటు రోహతాంగ్ పాస్, చంద్రఖని పాస్, సోలాంగ్ లోయ, సుల్తాన్పుర ప్యాలెస్ వంటి ప్రదేశాలను చూడొచ్చు. చలిని తట్టుకునేలా మంచు సూట్, చేతి తొడుగులు, సాక్సులు, బూట్లు కూడా ఇక్కడ అద్దెకు లభిస్తాయి. వీటితోపాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిబ్బంది పర్యాటకుల వెంట ఉంటారు. వీరు టూర్ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు సందర్శకులతోనే ఉండి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?