WHO+చైనా: ట్రంప్ చెప్పిందే పచ్చి నిజం!
కరోనా వైరస్పై చైనా సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వలేదు. మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైంది. డ్రాగన్ దేశానికి అనుకూలంగా ప్రవర్తించింది. ప్రపంచ దేశాల ప్రయోజనాలను పరిరక్షించలేకపోయింది. అది చైనా ప్రభావం నుంచి బయటపడాలి. -అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్....
కరోనా సమాచారం ఇచ్చేందుకు కావాలనే చైనా ఆలస్యం
చిరాకు వచ్చినా చైనాపై ప్రశంసలకే డబ్ల్యూహెచ్వో పరిమితం
కరోనా వైరస్పై చైనా సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వలేదు. మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైంది. డ్రాగన్ దేశానికి అనుకూలంగా ప్రవర్తించింది. ప్రపంచ దేశాల ప్రయోజనాలను పరిరక్షించలేకపోయింది. అది చైనా ప్రభావం నుంచి బయటపడాలి. -అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
తరిచి చూస్తే అగ్రరాజ్యం అధ్యక్షుడి మాటలే నిజమని తెలుస్తోంది. కొవిడ్-19 వైరస్ జన్యుపరివర్తన క్రమాన్ని చైనా దురుద్దేశ పూర్వకంగానే ఆలస్యంగా బహిర్గతం చేసిందని తెలుస్తోంది. ఇన్నాళ్లూ చైనా గొప్ప, చైనా సత్వరమే స్పందించింది, వేగంగా వివరాలను పంచుకుందని బాకా ఊదిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులే అదంతా నిజం కాదని చెప్పినట్టు అసోసియేట్ ప్రెస్ (ఏపీ) సంచలన విషయాలను బయటపెట్టింది.
జనవరి మొత్తం ప్రశంసలే
నిజానికి ఈ ఏడాది జనవరి నెల మొత్తం చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసిస్తూనే ఉంది. డ్రాగన్ ప్రభుత్వం వెనువెంటనే వైరస్ జెనెటిక్ మ్యాప్ను పంచుకుందని చెప్పింది. అంతేకాదు, అందుకు ధన్యవాదాలు తెలిపింది. వాస్తవంగా చైనాలోని ప్రయోగశాలలు ఈ పనిని ఎప్పుడో చేశాయి. జన్యు పరివర్తన క్రమాన్ని డీకోడ్ చేశాయి. అయితే వైరస్ నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ తయారీకి అత్యంత అవసరమైన ఈ వివరాలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొన్ని వారాల తర్వాత గానీ వెల్లడించలేదని తెలిసింది. సమాచారం బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమలు చేసింది.
సమాచారం ఆలస్యం
వైరస్ సమాచారంపై కఠిన నిబంధనలు, చైనా ప్రజారోగ్య వ్యవస్థలోనే అంతర్గత పోటీ ఆలస్యానికి కారణంగా అంతర్గత పత్రాలు, ఈమెయిళ్లు, ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తోందని ఏపీ కుండబద్దలు కొట్టింది. డ్రాగన్ ప్రభుత్వ అధికారులు జనవరి 11న జీనోమ్ వివరాలను ప్రచురించగా అంతకన్నా ముందే అక్కడి ల్యాబ్ ఒకటి వివరాలను ప్రచురించడం గమనార్హం. అత్యంత అవసరమైన ఈ వివరాలను డబ్ల్యూహెచ్వోకు సైతం ఇచ్చేందుకు చైనా కనీసం రెండు వారాలు ఆలస్యం చేసిందని ఆ సంస్థ అంతర్గత సమావేశాల ద్వారా తెలిసిందని ఏపీ తెలిపింది. అప్పటికి కరోనా వైరస్ అంటువ్యాధిగా ప్రకటించలేదు.
డబ్ల్యూహెచ్ ప్రతినిధుల ఆవేదన
కొవిడ్-19పై చైనా సరైన, అవసరమైన సమాచారం సమగ్రంగా ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సైతం ఆవేదన చెందారట. వివరాలు లేకపోవడంతో కొత్త వైరస్ ఏ మేరకు ప్రమాదకరమో, ప్రపంచానికి ఎంత కీడు చేస్తుందో డబ్ల్యూహెచ్వో అంచనా వేయలేకపోయిందని ఏపీ వివరించింది. ‘సీసీటీవీలో వివరాలు వెల్లడించేందుకు 15 నిమిషాల ముందు మాకు సమాచారం ఇచ్చారన్నది నిజమే’ అని చైనాలోని డబ్ల్యూహెచ్లో అత్యున్నత అధికారి డాక్టర్ గాడెన్ గాలీ చెప్పడం గమనార్హం. అప్పటికే వివరాలు దాస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య సంస్థపై ముప్పేట దాడి మొదలుపెట్టేశారు. మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో చైనా, అమెరికా మధ్యన డబ్ల్యూహెచ్వో అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కుపోయింది.
చైనాను రక్షించేందుకు నిందల పాలు
ప్రపంచ ఆరోగ్యానికి అవసరమైన సమాచారాన్ని పంచుకోవాలన్న అంతర్జాతీయ చట్టాలు ఉన్నప్పటికీ సభ్య దేశాలను కఠినంగా డిమాండ్ చేసే అధికారాలు డబ్ల్యూహెచ్వోకు లేవు. అందుకే చైనా అరకొర సమాచారమే ఇచ్చినా బతిమాలడం మినహా ఏమీ చేయలేకపోయింది. తాను చీకట్లో కూరుకుపోతూ, నిందల పాలవుతూ చైనాను వెలుగులో ఉంచింది. సమాచారం ఇవ్వడం లేదని ప్రపంచానికి బహిర్గత పరచకుండా డ్రాగన్ దేశం ఎంతగానో సహకరిస్తున్నట్టు ప్రపంచం ముందు నటించింది! జన్యు పరివర్తన క్రమాన్ని వేగంగా ఆవిష్కరించిన శాస్త్రవేత్తలను నొప్పించకుండా చైనాపై ఎలా ఒత్తిడి చేయాలో డబ్ల్యూహెచ్వోకు తెలియక ప్రశంసలు కురిపించిందట.
మరిన్ని ప్రశ్నలకు నిరాకరణ
‘డబ్ల్యూహెచ్వో చైనాను రక్షించాలంటే స్వతంత్రంగా విశ్లేషణ చేయాలి. లేదంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే విషయం ప్రశ్నార్థకం అవుతుంది. ఇతర దేశాలు దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాయి’ అని ఆరోగ్య సంస్థ ఎమర్జన్సీ చీఫ్ డాక్టర్ మైకేల్ రేయాన్ అనడం గమనార్హం. జనవరి 2న వైరస్ను తొలిసారి డీకోడ్ చేయగా జనవరి 30న డబ్ల్యూహెచ్వో కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. ఈ మధ్యలో వైరస్ 100-200 రెట్ల వేగంతో వ్యాపించిందని చైనా వ్యాధుల నియంత్రణ సంస్థ సమాచారాన్ని బట్టి తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరగా రికార్డు చేస్తే ఇవ్వలేమని డబ్ల్యూహెచ్వో అధికారులు నిరాకరించారట.
ల్యాబుపై రహస్య ఆంక్షలు
గతేడాది డిసెంబర్లోనే విచిత్రమైన నిమోనియాతో రోగులు చైనాలోని ఆస్పత్రులకు పోటెత్తారు. కారణమేంటో తెలుసుకొనేందుకు నమూనాలు తీసుకొని ప్రైవేటు ల్యాబులకు పంపించారు. విజన్ మెడికల్స్ అనే సంస్థ డిసెంబర్27న ఈ వైరస్ గతంలోని సార్స్ను పోలివుందని తెలిపింది. వుహాన్ అధికారులను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వారు నిమోనియాపై హెచ్చరిస్తూ అంతర్గత నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 30న వుహాన్లోని వైరాలజీ ల్యాబ్లోని కరోనా వైరస్ నిపుణులు షి ఝెంగ్లి కొవిడ్-19పై అప్రమత్తం చేశారు. జనవరి 2న ఆమె బృందం వైరస్ను పూర్తిగా డీకోడ్ చేసింది. ఈ సమాచారాన్ని ప్రపంచంతో పంచుకొనేందుకు మాత్రం ఆ దేశం వక్రంగా ప్రవర్తించింది. తమ అనుమతి లేకుండా వివరాలు ఇవ్వకూడదని ల్యాబులకు రహస్య నోటీసులు జారీ చేసింది. దాంతో షి ఝెంగ్లీ బృందం వీటిని ఇవ్వలేకపోయింది. ప్రపంచానికి ఉన్న ముప్పును చెప్పలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్