Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. వైకాపా దుశ్చర్య.. రైతుల పాదయాత్రపైకి వాటర్ బాటిళ్లు..
మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై వైకాపా శ్రేణుల కవ్వింపులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో పాదయాత్రగా వెళ్తున్న రైతులను రెచ్చగొట్టేలా వైకాపా కార్యకర్తలు వాటర్ బాటిళ్లు విసిరారు. ఆజాద్ చౌక్ మీదుగా శాంతియుతంగా రైతులు, అఖిలపక్ష నేతలు వెళ్తుండగా నల్లబెలూన్లు ప్రదర్శిస్తూ వైకాపా శ్రేణులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇటు అమరావతి రైతులు, అటు వైకాపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నేను సన్స్క్రీన్ వాడను: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా సాధారణ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన వారితో మాట్లాడుతూ.. వారి ఇబ్బందులను తెలుసుకొంటున్నారు. అదే సమయంలో ప్రజలు, అభిమానులు అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానాలిస్తున్నారు. ఎండలో పాదయాత్ర చేస్తున్న రాహుల్.. టాన్ రాకుండా ఏం వాడుతున్నారని ఓ అభిమాని అడిగన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ‘కాంతార’ 1.. ‘బాహుబలి’ 101.. టాప్ 250 సినిమాలివే..
‘కాంతార’.. ప్రస్తుతం అన్ని చోట్లా ఈ పేరే మారుమోగుతోంది. నెట్టింట ఈ కన్నడ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్గా మారుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. అధిక వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ప్రకటించిన ‘టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్’ జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్ను రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ₹ 3 లక్షల ల్యాప్టాప్.. ప్రత్యేకతలు ఏంటంటే?
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ఫోన్లు.. ఆ తర్వాత మడత ఫోన్లు వచ్చాయి. తాజాగా ఆసుస్ కంపెనీ మడత ల్యాప్టాప్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆసుస్ జెన్బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ (Asus Zenbook 17 Fold OLED) పేరుతో ఈ ల్యాపీని తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్టాప్ ఇదేనని ఆసుస్ కంపెనీ చెబుతోంది. మరి, ఈ ల్యాప్టాప్ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఫైనల్కు వెళ్లేది ఆ రెండు జట్లే: సునీల్ గావస్కర్
టీ20 ప్రపంచకప్ టోర్నీ క్వాలిఫయర్ మ్యాచ్లు ఎంతో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. పసికూనలాంటి జట్లు మాజీ చాంఫియన్లు, దిగ్గజ జట్టను మట్టికరిపిస్తుండటంతో.. టోర్నీ ఆరంభంలోనే అసలు సిసలు క్రికెట్ మజాను అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఇక అసలైన సూపర్ 12 గ్రూప్ మ్యాచ్లు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ చేరేదెవరు..? కప్ గెలిచేదెవరు? అంటూ పలువురు అంచనాలు వేస్తున్నారు. మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా తన ఫెవరేట్ జట్లేంటో వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఉత్తరాఖండ్లో ఘోరం.. కుప్పకూలిన కేదార్నాథ్ యాత్రికుల హెలికాప్టర్
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. ఫటా హెలిప్యాడ్ నుంచి యాత్రికులను తీసుకెళ్తుండగా.. కేదార్నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడ్ ఛాటి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆరు మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కాగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సత్ప్రవర్తన కారణంగానే బిల్కిస్ బానో దోషుల విడుదల: గుజరాత్ సర్కారు
బిల్కిస్ బానో (Bilkis Bano) అత్యాచార కేసులో దోషుల విడుదల ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించామని, 14 ఏళ్లకు పైగా జైల్లో గడిపినందునే వారిని విడుదల చేశామని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొంది. బిల్కిస్ బానో కేసులో దోషులకు రెమిషన్ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఒక్కసారి పెట్టుబడి.. బీమాతో పాటు రెండింతలకు పైగా రాబడి!
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో కొత్త జీవిత బీమా పాలసీని తీసుకొచ్చింది. ‘ఎల్ఐసీ ధన వర్ష (ప్లాన్ 866)’ పేరిట దీన్ని అందిస్తోంది. దీంట్లో బీమాతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకవేళ మరణిస్తే కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. ఇది క్లోజ్డ్ ఎండెడ్ ప్లాన్. 2023 మార్చి 31తో ప్లాన్ విక్రయాలు ముగియనున్నాయి. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటివ్, ఇండివిజువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం జీవిత బీమా పథకం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ‘గీతాఆర్ట్స్’లో ‘గీత’ వెనుక కథ అదే.. అందుకే ఆ పేరు పెట్టాం: అల్లు అరవింద్
మహా నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలను అల్లు అరవింద్ ‘ఆలీతో సరదాగా’ మొదటి భాగంలో పంచుకున్నారు. రెండో భాగంలో మరికొన్ని విషయాలను చెప్పారు. వాటితో పాటు చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ల గురించి అల్లు అరవింద్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. జమ్మూకశ్మీర్లో మళ్లీ పౌరులే లక్ష్యంగా హత్యలు.. నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి
జమ్మూకశ్మీర్లో మరోసారి మైనార్టీలు, వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపగా.. తాజాగా మరో ఇద్దరు వలసకూలీలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. షోపియాన్లోని హర్మెన్ ప్రాంతంలో వలసకూలీలు నివసిస్తున్న ఇంటిపైకి ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TS ECET Results) ఫలితాలు విడుదలయ్యాయి. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతోపాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు