IMA : మీ తీరు తీవ్రంగా బాధిస్తోంది
మూడో ముప్పు పొంచిఉందని, ఎట్టిపరిస్థితుల్లో కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం వద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అభ్యర్థించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ.. ఓ ప్రకటన చేసింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, అధికార యంత్రాంగాలు వ్యవహరిస్తోన్న తీరు తీవ్రంగా బాధిస్తోందని వ్యాఖ్యానించింది.
ముప్పు పొంచి ఉంది..అలసత్వం వద్దు
దిల్లీ: మూడో ముప్పు పొంచి ఉందని, ఎట్టిపరిస్థితుల్లో కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం వద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అభ్యర్థించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ.. ఓ ప్రకటన చేసింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, అధికార యంత్రాంగాలు వ్యవహరిస్తోన్న తీరు తీవ్రంగా బాధిస్తోందని వ్యాఖ్యానించింది.
‘మహమ్మారుల చరిత్రను గమనిస్తే.. మూడోముప్పు అనివార్యం. ప్రజలు ఏ మాత్రం కొవిడ్ నియమావళిని పాటించకుండా.. గుంపులుగా చేరడం తీవ్రంగా బాధిస్తోంది. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. విహార, ఆధ్యాత్మిక యాత్రలు అవసరమే. కానీ, మరికొద్ది నెలలు వేచి ఉందాం. కరోనా టీకాలు తీసుకోకుండా చేరుతున్న జన సమూహాలు.. మూడో దఫా విజృంభణకు సూపర్ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉంది’ అని ఐఎంఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాదిన్నర కాలంగా ఉన్న అనుభవాలను పరిశీలిస్తే.. భారీ సంఖ్యలో టీకాల పంపిణీ, కొవిడ్ నియమాళిని పాటించడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించగలమని వెల్లడించింది. మరో రెండు మూడు నెలలు జాగ్రత్త వహించాలని సూచించింది. అలాగే రెండో దఫా విజృంభణ సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇటీవల పలు ఆధ్మాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు భారీగా గుమిగూడిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అందులో ఎవరు నిబంధనలను పాటించిన దాఖలాలు లేవు. దీనిపై నెట్టింట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. వీటిపై ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. మూడో ముప్పునకు అవకాశం ఇవ్వొద్దని అభ్యర్థించింది. ఈ క్రమంలోనే ఐఎంఏ ప్రకటన విడుదలైంది.
ఇదిలా ఉండగా.. మూడో ముప్పుపై నివేదికలు వస్తోన్న తరుణంలో అందుకు తగ్గట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. రెండోదశలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని ఆరోగ్య శాఖ నూతన మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అత్యవసర ప్రతిస్పందన నిమిత్తం ఇటీవల కేంద్ర కేబినెట్ రూ. 23వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని చెప్పారు. చిన్నారుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సరైన సమయంలో స్పందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
తన భార్య మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ వాపోయారు. -
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి ఆమ్గేను ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ తాజాగా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో ‘సీఐఎస్ఎఫ్’ నిర్వహించనుంది. 3300 మందికిపైగా సిబ్బంది సోమవారం (మే 20) నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీకి దిగడంపై ప్రధాని మోదీ స్పందించారు. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. -
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
భాజపా తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటి కంగనా రనౌత్.. ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ను వీడుతారా అనే ప్రశ్నకు బదులిచ్చారు. -
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
ఆప్ నేత స్వాతి మాలీవాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. -
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. -
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
Swati Maliwal: ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ సొంత పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకప్పుడు న్యాయం కోసం జరిగిన ఆందోళనలు.. ఇప్పుడు నిందితుణ్ని రక్షించడం కోసం జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..