బీసీజీ వ్యాక్సిన్తో వైరస్ సంక్రమణకు అడ్డుకట్ట
బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) వాక్సిన్ కరోనా సంక్రమణను, మరణాల రేటును తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీసీజీ టీకా వేసిన..
వెల్లడించిన ఓ అధ్యయనం
దిల్లీ: బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) వాక్సిన్ కరోనా సంక్రమణ, మరణాల రేటును తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బీసీజీ టీకా వేసిన మొదటి 30 రోజుల్లో దాని ప్రభావం అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ పత్రికలో ప్రచురించిన ఈ అధ్యయనం పలు విషయాలు వెల్లడిస్తోంది. కరోనాతో అమెరికా సతమతమవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశంగా నిలిచింది. అయితే దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను తప్పనిసరి చేసి ఉంటే అగ్రరాజ్యంలో ఇన్ని కొవిడ్ మరణాలు సంభవించేవి కాదని అధ్యయనం పేర్కొంది.
క్షయవ్యాధిని నివారించేందుకు పుట్టిన బిడ్డకు బీసీజీ టీకా ఇస్తారు. అంటువ్యాధుల నుంచి రక్షించుకునేందుకు బీసీబీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని, కొవిడ్ -19పై ఈ టీకా ప్రభావమంతంగా పనిచేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 135 దేశాల్లో ప్రతి రోజు కరోనా కేసుల పెరుగుదల ఎలా ఉంది, 134 దేశాల్లో మొదటి 30 రోజుల్లో మరణాలు ఎంత శాతంగా ఉన్నాయన్న విషయాన్ని నిపుణులు విశ్లేషించారు.ఈ టీకాను తప్పనిసరి చేస్తే సంక్రమణను తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వ్యాక్సిన్ అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పలేమని, ఇందుకు మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనా మహమ్మారిని వివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వ్యాక్సిన్ల తయారీకి క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయి. భారత్లో 16 టీకాల ప్రయోగాలు పలు దశల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శనివారం వెల్లడించారు. బీసీజీ వ్యాక్సిన్ మూడో దశ పరీక్షల్లో ఉందని ఆయన తెలిపారు. జైడుస్, క్యాడిలా డీఎన్ఏ మొదటి, రెండో దశలో ఉన్నాయని అన్నారు. 4 టీకాలు క్లినికల్ పరీక్షలు ముగించుకొని చివరి దశలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
-
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
-
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం