ట్రంప్ రెచ్చిపోతారేమో.. జాగ్రత్తగా ఉండండి!
నాలుగేళ్ల పాలనలో ఇరాన్పై కత్తిగట్టి కఠిన ఆంక్షలు విధించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల ఆ దేశంపై దాడికి కూడా సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో అధికార పీఠాన్ని వీడే చివరి రోజుల్లో ట్రంప్ నుంచి
మిత్రదేశాలను హెచ్చరించిన ఇరాన్
బాగ్దాద్: నాలుగేళ్ల పాలనలో ఇరాన్పై కత్తిగట్టి కఠిన ఆంక్షలు విధించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల ఆ దేశంపై దాడికి కూడా సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో అధికార పీఠాన్ని వీడే చివరి రోజుల్లో ట్రంప్ నుంచి ముప్పు తప్పదని భావించిన ఇరాన్ అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండండంటూ తన మిత్రదేశాలను కూడా హెచ్చరించింది. అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలు వద్దని, అలా చేస్తే ట్రంప్ రెచ్చిపోయే ప్రమాదముందని మధ్యప్రాచ్యంలోని ఇరాన్ మిత్రదేశాలకు సూచించింది.
ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇరాన్తో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ దేశంతో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు కఠినమైన వాణిజ్య ఆంక్షలు కూడా విధించారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఇరాన్ అత్యున్నత స్థాయి కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీపై దాడి చేయించి ఆయన మరణానికి కారణమయ్యారు. అమెరికా చర్యకు ఇరాన్ కూడా దీటుగా బదులచ్చింది. ఇరాక్లో యూఎస్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిపింది. అలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.
అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్పై బైడెన్ విజయం సాధించడంతో మళ్లీ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఇరాన్ భావించింది. బైడెన్ పాలనలో మళ్లీ అణు ఒప్పందం చేసుకోవాలని అనుకుంది. ఇరాన్ మిత్ర దేశాలు కూడా ట్రంప్ ఓటమిని స్వాగతించాయి. అయితే ఎన్నికల్లో ఓటమిని ఇంకా అంగీకరించిన ట్రంప్ ఇటీవల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇరాన్పై దాడికి ఉన్న ప్రత్యామ్నాయాల గురించి అధికారులను ఆరా తీశారు. అయితే దాని వల్ల పొంచి ఉన్న ముప్పులను అధికారులు వివరించడంతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఇరాన్.. తన మిత్రదేశాలకు హెచ్చరికలు పంపింది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే చివరి రోజుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ప్రమాదముందని, అందుకే అమెరికాతో ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సూచించింది. వచ్చే రెండు నెలలు ట్రంప్నకు అవకాశం ఇవ్వకుండా, ఉద్రిక్తతలకు తావివ్వకుండా కాస్త తగ్గి ఉండండని కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత స్థాయి జనరల్.. ఆ దేశ మిత్రపక్షాలకు సందేశం పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ దాడి వార్తలపై స్పందించిన ఇరాన్ రక్షణ మంత్రి హొస్సేన్ డెఘాన్ కూడా ‘మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు’ అని మీడియాకు చెప్పారు. అయితే ట్రంప్ యంత్రాంగం దూకుడుగా ప్రవర్తిస్తే మాత్రం దీటైన జవాబు ఇస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.