నీరు, నిప్పుతో అమెరికా అతలాకుతలం
కరోనా ఎఫెక్ట్తో తల్లడిల్లుతున్న అగ్రరాజ్యం అమెరికాను వరుస ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి.
అగ్రరాజ్యంపై ప్రకృతి కన్నెర్ర
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే కరోనా ప్రభావంతో అల్లాడుతున్న అగ్రరాజ్యం అమెరికాను వరుస ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాలిఫోర్నియాలో వేగంగా వ్యాప్తిస్తున్న కార్చిచ్చుతో సతమతమైతున్న ఈ దేశంపై.. ఇప్పుడు పెనుతుపాను ‘లారా’ విరుచుకుపడనుంది.
గత కొద్ది రోజులుగా కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న కార్చిచ్చు 1.5 మిలియన్ ఎకరాలను దహించివేసింది. ఇప్పటివరకు సంభవించిన 7012 అగ్నిప్రమాద ఘటనలు ఇక్కడి నివాస స్థలాలను, అటవీ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆగస్టు నుంచి నవంబరు వరకు అగ్నిప్రమాద ఘటనలు సంభవించడం సర్వసాధారణమే. ‘డ్రై థండర్స్టార్మ్స్’గా పిలిచే వర్ష రహితమైన పొడి ఉరుముల కారణంగా అటవీ, నివాస ప్రాంతాల్లో మంటలు చెల రేగుతాయి. అయితే ఈ సారి వీటి తీవ్రత మరింత అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
కాలిఫోర్నియాలోనే అతి పెద్దదైన ఎల్ ఎన్ యూ కాంప్లెక్స్ కార్చిచ్చు.. సోమవారం నాటికి 3,50,00 ఎకరాల్లో వ్యాప్తించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. కాలిఫోర్నియాలో పార్కులు తదితర బహిరంగ ప్రదేశాలన్నింటినీ మంటలు, పొగ కారణంగా మూసివేశారు. ఈ మంటలను ఆర్పేందుకు 14,000 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, 2400కు పైగా ఫైరింజన్లతో రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు. ఇందుకు 200కు పైగా విమానాలు, హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు.
విరుచుకుపడనున్న ‘లారా’
ఇక మరోవైపు పెనుతుపాను ‘లారా’ అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలపై విరుచుకుపడనుంది. దీని ఫలితంగా గంటకు 240 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. ఇదే తీవ్రత కొనసాగితే లారా, అమెరికాలో పెను ప్రభావం చూపిన తుపానుల్లో ఒకటిగా నిలిచిపోనుంది. ఈ తుపాను ఇరు రాష్ట్రాల్లో అపార నష్టం కలిగించనుందని నిఫుణులు అంటున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు ఐదు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రజల తరలింపు క్లిష్టంగా మారింది. భయంకర తుపానుగా మారే అవకాశమున్న లారా నుంచి తప్పించుకోవటం కష్టమని.. దీనివల్ల తీవ్ర ప్రాణనష్టం సంభవించ వచ్చనే అభిప్రాయాన్ని వాతావరణ సంస్థ వ్యక్తంచేసింది. లారా ప్రభావంతో ఇళ్లు తీవ్రంగా దెబ్బతినడం, చెట్లు వేళ్లతోసహా కూలిపోవటం, విద్యుత్తు, నీటి సరఫరా వారాల తరబడి నిలిచిపోయే అవకాశం కూడా ఉందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
80కి పైగా స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?