2 గ్రామాలపై ఉగ్రదాడి.. 100 మంది కాల్చివేత

పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు.

Updated : 04 Jan 2021 08:12 IST

నైజర్‌: పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు. మాలి సరిహద్దు వద్ద రెండు గ్రామాలపై దాడి చేసి దాదాపు 100 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై నైజర్‌ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి జరిగిన తోచబంగౌ‌, జారౌమ్‌దారే గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు సానుభూతి తెలియజేశారు.

శనివారం తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపారు. ప్రతికారేచ్ఛతో రగిలిపోయిన ఉగ్రవాదులు రెండు గ్రామాలపై దాడి చేసి వంద మందిని కాల్చి చంపారు. బోకోహారమ్‌ గ్రూపునకు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి..
లాస్‌ ఏంజెలెస్‌లో అంత్యక్రియలకూ కటకట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని