Barbie: బార్బీ బొమ్మలుగా కరోనా ఫ్రంట్లైన్ మహిళా వారియర్లు!
కరోనా సమయంలో వైద్య సిబ్బంది వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించారు. అందుకే వారి సేవలను ప్రపంచమంతా కొనియాడుతోంది. తాజాగా బార్బీ బొమ్మలను తయారు చేసే మాట్టెల్ సంస్థ కూడా ఫ్రంట్లైన్ వారియర్లుగా నిలిచిన మహిళా వైద్య సిబ్బంది గౌరవార్థం ‘రోల్ మోడల్ డాల్స్’ పేరుతో బార్బీ బొమ్మల
(Photo: barbie twitter)
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సమయంలో వైద్య సిబ్బంది వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించారు. అందుకే వారి సేవలను ప్రపంచమంతా కొనియాడుతోంది. తాజాగా బార్బీ బొమ్మలను తయారు చేసే మాట్టెల్ సంస్థ కూడా ఫ్రంట్లైన్ వారియర్లుగా నిలిచిన మహిళా వైద్య సిబ్బంది గౌరవార్థం ‘రోల్ మోడల్ డాల్స్’ పేరుతో బార్బీ బొమ్మల కొత్త ఎడిషన్ను విడుదల చేసింది. కొవిడ్పై పోరులో తమ వంతు సేవలు అందించిన ఆరుగురు మహిళా వైద్య సిబ్బందిని గుర్తించి వారి రూపురేఖలతో బార్బీ బొమ్మలను తయారు చేసింది. వారిలో కరోనా వ్యాక్సిన్ ఆస్ట్రా-జెనికాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త సారా గిల్బర్ట్ కూడా ఉన్నారు.
మాట్టెల్ సంస్థ తనలాంటి బార్బీ బొమ్మను తయారు చేయడం పట్ల గిల్బర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘నాలా కనిపించే బార్బీ బొమ్మను తయారు చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ, అమ్మాయిలు సైన్స్ను తమ కెరీర్గా ఎంచుకోవడానికి ఈ బార్బీ బొమ్మలు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశిస్తున్నా’’అని తెలిపారు. గిల్బర్ట్తోపాటు మరో ఐదుగురు వైద్య సిబ్బందికి ఈ అరుదైన గౌరవం దక్కింది.
అమెరికాలోని బ్రూక్లిన్లో తొలి కరోనా బాధితుడికి చికిత్స అందించిన నర్సు అమీ ఓ సులివన్, లాస్వెగాస్కు చెందిన వైద్యురాలు ఆండ్రే క్రూజ్, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టోరొంటోలో సైక్రియాటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ చికా స్టాకీ ఒరియువా, బ్రెజిల్కు చెందిన బయోమెడికల్ రీసెర్చర్ జాక్వెలిన్ గోస్ డి జీసస్, ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం సర్జికల్ గౌను రూపొందించిన ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ కిర్బీ వైట్ బార్బీ రోల్ మోడల్ డాల్స్గా మారారు.
అంతకుముందు టోక్యో ఒలింపిక్స్లో మహిళా అథ్లెట్లు విశేషంగా రాణించాలని, పతకాలు సాధించాలని కాంక్షిస్తూ అథ్లెట్ల బార్బీ బొమ్మలను రూపొందించింది. స్పోర్ట్స్ దుస్తుల్లో, మెడలో పతకాలతో ఉన్న బార్బీ బొమ్మలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.