Gold: మట్టిలో కప్పిఉంచిన 106 బంగారం బిస్కెట్లు స్వాధీనం

అటవీ ప్రాంతంలో ఓ గుంత తవ్వి మట్టికింద దాచి ఉంచిన 106 బంగారు బిస్కెట్లను డీఆర్‌ఐ, బీఎస్ఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Published : 03 Sep 2023 18:22 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. భారత్‌ - బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం(BSF), డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో సెప్టెంబర్‌ 2న సోదాలు చేయగా.. ఓ గుంత తవ్వి మట్టికింద అక్రమంగా దాచి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు, ముక్కలను సీజ్‌ చేశారు. బంగారం బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కిలోలు ఉండగా.. దీని ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా. బంగారం అక్రమ తరలింపులో వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటు అతడికి సహాయకుడిగా ఉన్న మరొకరిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని