Coronavirus: 69కు పెరిగిన జేఎన్‌.1 సబ్‌వేరియంట్ కేసులు

దేశంలో జేఎన్‌.1(JN.1) రకం కేసుల సంఖ్య మరింత పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 

Published : 26 Dec 2023 17:49 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌(Covid-19) కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1(JN.1) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దాంతో జేఎన్‌.1 మొత్తం కేసుల సంఖ్య 69కి చేరిందని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా గోవాలోనే ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్‌ సోకిన బాధితులు ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నాయి. ఆసుపత్రిలో చేరికల సంఖ్యలో పెరుగుదల కనిపించడం లేదని, ప్రస్తుతానికి ఈ వేరియంట్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించాయి.

‘ ‘సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం!’’

కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ జేఎన్‌.1(JN.1) వేరియంట్‌కు సంబంధించి తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో).. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. క్రియాశీల కేసులు 4,170కి చేరాయి. జేఎన్‌.1 గురించి ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని