Sukesh- Jacqueline: నిజాలన్నీ బయటపెడతా: జాక్వెలిన్ను బెదిరిస్తూ సుకేశ్ లేఖ..!
Sukesh- Jacqueline: జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ను బెదిరిస్తూ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ నటి గురించి నిజాలన్నీ బయటపెడతానని అతడు అందులో హెచ్చరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
దిల్లీ: ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆమె విచారణకు కూడా హాజరైంది. అయితే, జైల్లో ఉన్న సుకేశ్.. ఆ మధ్య నటికి పలుమార్లు ప్రేమ సందేశాలు పంపాడు. దీంతో జాక్వెలిన్ తాజాగా కోర్టును ఆశ్రయించింది.
సుకేశ్ తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేగాక, సుకేశ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడు తనను ట్రాప్ చేశాడని నటి తన పిటిషన్లో పేర్కొంది. తనపై కేసును కొట్టివేయాలని అభ్యర్థించింది. జాక్వెలిన్ పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది. అయితే, నటి పిటిషన్ గురించి తెలుసుకున్న సుకేశ్.. ఆమెపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఓ లేఖ రాశాడు. అందులో అతడు జాక్వెలిన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. అది ఆమెనుద్దేశించే రాసినట్లు సుకేశ్ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు.
కొండల్లో నక్కి.. ‘బ్లైండ్ స్పాట్’ వద్ద టార్గెట్ చేసి..!
ఇక, ఆ లేఖలో సుకేశ్.. జాక్వెలిన్ను బెదిరించినట్లు తెలుస్తోంది. ‘‘నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యా. ఎవరినైతే (జాక్వెలిన్ను ఉద్దేశిస్తూ) భద్రంగా చూసుకోవాలనుకున్నానో.. వారే ఇప్పుడు ఎదురుతిరిగారు. వెన్నుపోటు పొడిచారు. బాధితులుగా పేర్కొంటూ నిందలు వేయడం మొదలుపెట్టారు. నన్ను చెడ్డవాడిగా చూపించాలనుకుంటున్నారు. ఇది నేను కలలో కూడా ఊహించలేదు. హృదయం ఉన్నది ముక్కలవ్వడం కోసమే అని ఇప్పుడు అర్థమైంది. ఇక నాకు వాస్తవాలను బయటపెట్టడం తప్ప మరో అవకాశం లేదు’’ అంటూ సుకేశ్ తన లేఖలో పేర్కొన్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
‘‘ఆ వ్యక్తిని (జాక్వెలిన్) రక్షించేందుకు ఇన్నాళ్లూ రహస్యంగా దాచి ఉంచి ఆధారాలన్నీ బయటపెడతా. చాట్స్, స్క్రీన్షాట్స్, రికార్డింగ్స్, విదేశీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు.. అన్నింటి గురించి చెబుతా. ఆ వ్యక్తిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు మిలియన్ డాలర్ల చెల్లింపులు చేశా. అందుకు సంబంధించిన ఇన్వాయిస్లను బయటపెడతా. ఈ వాస్తవాలను ప్రపంచం తెలుసుకోవాలి’’ అని సుకేశ్ అందులో బెదిరించినట్లు తెలుస్తోంది.
సుకేశ్ (Sukesh Chandrashekar) నుంచి జాక్వెలిన్ (Jacqueline Fernandez) ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసులో ఆమెను పలుమార్లు విచారించింది కూడా. అయితే సుకేశ్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్ ఆ మధ్య వాపోయింది. అతడు తన జీవితంతో ఆడుకొని కెరీర్ను, జీవనోపాధిని నాశనం చేశాడని న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో ఓ ముఖ్య అధికారిగా సుకేశ్ తనను తాను పరిచయం చేసుకున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.