PM Modi: ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు.
భోపాల్: లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఒకే రోజు పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం యూపీలో పర్యటించిన ఆయన.. అక్కడినుంచి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చేరుకున్నారు. దమోహ్లో ఏర్పాటుచేసిన భాజపా (BJP) బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడికి ఓ యువకుడు తీసుకొచ్చిన చిత్రాన్ని చూసి మోదీ ఉద్వేగానికి లోనయ్యారు.
సభలో ప్రధాని మాట్లాడుతుండగా దూరం నుంచి ఓ యువకుడి చేతిలో ఫొటోఫ్రేమ్ కన్పించింది. తన మాతృమూర్తి హీరాబెన్ (Heeraben) తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది. పెన్సిల్తో గీసిన ఆ చిత్రాన్ని చూసిన మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపారు. ఆ తర్వాత చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందించారు. ఆ ఫొటో వెనక అతని పేరు, చిరునామా రాసివ్వాలని అతడికి సూచించారు. తాను లేఖ రాస్తానని మోదీ చెప్పారు.
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
ప్రధాని మాతృమూర్తి హీరాబెన్ 100 ఏళ్ల వయసులో 2022 డిసెంబరు 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. తల్లి చనిపోయిన దుఃఖంలోనూ ప్రధాని తన విధులను మరువలేదు. బాధను దిగమింగుకుని అదే రోజున పలు అధికారిక కార్యక్రమాల్లో వర్చువల్గా పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘400 సీట్లు జోక్.. 300 అసాధ్యం.. 200 సవాలే’: భాజపాపై శశిథరూర్ విమర్శలు
సార్వత్రిక ఎన్నికల్లో 400లకుపైగా స్థానాల్లో గెలుస్తామని భాజపా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు. -
మరణమే వారసత్వంగా మా నాన్నకొచ్చిన ఆస్తి: ప్రియాంక గాంధీ
ప్రాణత్యాగం తప్ప తన తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏదీ లేదని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రధాని మోదీ విమర్శలపై ఈ వ్యాఖ్యలు చేశారు. -
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. బ్రిజ్భూషణ్ స్థానంలో కుమారుడికి టికెట్
BJP: లోక్సభ ఎన్నికలకు భాజపా మరో విడత జాబితా విడుదలైంది. ఎంపీ బ్రిజ్భూషణ్ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో అభ్యర్థిని ప్రకటించింది. -
రాహుల్ను ప్రధానిని చేయాలని పాక్ తహతహ: మోదీ ధ్వజం
PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ను దేశ ప్రధానిని చేయాలని దాయాది పాకిస్థాన్ తహతహలాడుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్-పాక్ బంధం బయటపడిందని అన్నారు. -
ఆ కుంభకోణం గురించి పార్టీకి ముందే తెలుసు: టీఎంసీ మాజీ నేత సంచలన ఆరోపణలు
తృణమూల్ కాంగ్రెస్కు ఎన్నికల ముందు మరో పెద్దషాక్ తగిలింది. మొన్నటి వరకు పార్టీలో ఉన్న ఓ కీలక నేత తీవ్ర ఆరోపణలు చేశాడు. ఉద్యోగ నియామక కుంభకోణం పార్టీకి 2021లోనే తెలుసని తెలిపారు. -
బ్రిజ్ భూషణ్కు టికెట్ కట్..!
ఉత్తరప్రదేశ్ బాహుబలి నేతల్లో ఒకరైన బ్రిజ్భూషణ్కు ఈ సారి భాజపా టికెట్ కట్ చేసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ, అస్సాంలలో భాజపా రహస్య ఒప్పందాలు: ప్రియాంక
అస్సాంలో మాఫియా రాజ్యమేలుతోందని, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. -
ఓటమి భయంతో హుందాతనాన్ని మరచిన మోదీ
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూటమికి ఓటమి అనివార్యమని తేలిపోవడంతో ప్రధాని మోదీ నిరాశా నిస్పృహలకు లోనై ఆ పదవి హుందాతనాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. -
రిజర్వేషన్లపై 50% కోటా పరిమితి ఎత్తివేస్తారా?
లోక్సభ ఎన్నికల ఘట్టంలో ఇంకా అయిదు విడతలు మిగిలి ఉండగా, రిజర్వేషన్ల కోటాపై ప్రధాన పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆ అంశాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. -
ఎవరూ భయపడటం లేదు.. అమేఠీ, రాయ్బరేలీపై నేడు నిర్ణయం: కాంగ్రెస్
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది 24 నుంచి 30 గంటల్లో ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. -
గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రొటోకాల్
గుర్తుల లోడింగ్ యూనిట్ల (ఎస్ఎల్యూ) నిర్వహణ, నిల్వకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) నూతన ప్రొటోకాల్ను తీసుకొచ్చింది. -
ప్రజాక్షేత్రంలో శివసేనలకు పరీక్ష
శివసేన పార్టీల మధ్య కీలక పోరు ముంబయిలో జరగనుంది. ఇక్కడి మొత్తం 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల రెండు శివసేనలే ముఖాముఖి తలపడుతున్నాయి. -
‘మత’ రిజర్వేషన్ల ఉద్దేశం లేదని లిఖిత గ్యారంటీ ఇవ్వగలరా?
కాంగ్రెస్ మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటోందని, ఆ పార్టీ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి అటువంటి ఉద్దేశం లేకపోతే లిఖితపూర్వక గ్యారంటీ ఇవ్వగలరా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవాలు విసిరారు. -
వారణాసిలో మోదీపై మిమిక్రీ కళాకారుడి పోటీ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేయనున్నట్లు మిమిక్రీ కళాకారుడు, కమెడియన్ శ్యామ్ రంగీలా(29) ప్రకటించారు. -
భాజపాలో చేరిన నటి రూపాలి గంగూలీ, జోతిష్యుడు అమేయా జోషీ
ప్రముఖ బుల్లితెర నటి రూపాలి గంగూలీ, మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త, జోతిష్యుడు అమేయా జోషీ భాజపాలో చేరారు. -
సంక్షిప్త వార్తలు (7)
దిల్లీలో ఆప్తో పొత్తు కాంగ్రెస్లో అంతర్గత సమస్యలకు దారి తీస్తోంది. వారం వ్యవధిలోనే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. ఝార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి సమన్లు
రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి నకిలీ వీడియోను వ్యాప్తి చేసిన కేసులో దిల్లీ పోలీసులు ఝార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకుర్కు సమన్లు జారీ చేశారు. -
20 ఏళ్ల తర్వాత పోటీ.. దిల్లీలో కీలక పదవిపై కన్ను..!
శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గతంలో ఆయన ఇక్కడినుంచి ఐదుసార్లు గెలుపొందారు. -
‘టీఎంసీ’ కంటే ‘భాజపా’కు ఓటేయడమే ఉత్తమం - కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్
తృణమూల్ (TMC) కంటే భాజపాకు ఓటు వేయడం ‘ఉత్తమం’ అని సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించడంపై టీఎంసీ మండిపడింది. -
మహాత్మాగాంధీ కోరికను ప్రజలు నెరవేర్చనున్నారు: రాజ్నాథ్ సింగ్
మహాత్మాగాంధీ ఆశయాన్ని దేశ ప్రజలు నెరవేర్చి, ఎన్నికల్లో కాంగ్రెస్ను దేశ రాజకీయాల నుంచి తుడిచిపెడతారని భాజపా నేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అన్నారు.
తాజా వార్తలు
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..