భారత్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1024కి చేరింది. వీరిలో 96 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు....

Updated : 29 Mar 2020 21:56 IST

దిల్లీ: భారత్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1024కి చేరింది. వీరిలో 96 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.

> బిహార్‌లో కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 15కి చేరింది. 

> కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 203కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 22 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. వీరిలో 35 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 8 మంది మరణించారు.

> ఉత్తరాఖండ్‌లో 47 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 7కి చేరింది. వీరిలో మగ్గురికి పరీక్షల్లో నెగటివ్ రావడంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు.

> కర్ణాటకలో కొత్తగా ఏడుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 83కి చేరింది. వీరిలో ఐదుగురు కోలుకోగా ముగ్గురు మృతిచెందారు. 

>  గుజరాత్‌లో ఆదివారం మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 58కి చేరింది. 

> తమిళనాడులో 8 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.విజయ్‌భాస్కర్ తెలిపారు. దీంతో కరోనా కేసు సంఖ్య 42కి చేరింది. వీరిలో ఇద్దరిని కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేశారు.  

> భారత్‌లో తొలి కరోనా కేసు నమోదయిన కేరళలో తాజాగా 20 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ తెలిపారు. వీరిలో 18 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా, మరో ఇద్దరు కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 202కి చేరింది.

> గోవాలో రెండు కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు విదేశాల నుంచి రాగా, మరొకరు కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల సోకినట్లు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. దీంతో గోవాలో కరోనా కేసుల సంఖ్య 5కి చేరింది. 

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 23 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72కి చేరింది. 

> పశ్చిమబెంగాల్‌లో ఆదివారం మరో ఇద్దరు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 17కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని