అత్యాధునిక ఆత్మనిర్భర పతాక
అమృతోత్సవ వేళ.. ఆత్మ నిర్భరతకు ప్రతీకగా సరికొత్త పార్లమెంటు భవనం ఆరంభానికి సిద్ధమైంది. సనాతన కళాకృతులతో, ఆధునిక హంగులతో, దూరదృష్టితో, భారతీయ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఈ ప్రజాస్వామ్య దేవాలయం ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది.
సంప్రదాయ శైలికి ప్రతిరూపం
ఆధునిక పార్లమెంటు భవనం ఓ కళాఖండం
రూ.1200 కోట్లకు పైగా వ్యయం
28న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అమృతోత్సవ వేళ.. ఆత్మ నిర్భరతకు ప్రతీకగా సరికొత్త పార్లమెంటు భవనం ఆరంభానికి సిద్ధమైంది. సనాతన కళాకృతులతో, ఆధునిక హంగులతో, దూరదృష్టితో, భారతీయ నిర్మాణ కౌశలంతో నిర్మించిన ఈ ప్రజాస్వామ్య దేవాలయం ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది. ప్రస్తుత వృత్తాకార పాత భవనం పక్కనే స్వదేశీ ఆలోచనలతో త్రికోణాకారంలో సుమారు రూ.1200 కోట్లకుపైగా వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూపుదిద్దుకుంది ఈ కొత్త భవంతి. రాజ్పథ్ ఆధునికీకరణ, ప్రధాన మంత్రికి కొత్త నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి కొత్త కార్యాలయం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
కొత్తది ఎందుకంటే..
ప్రస్తుత పార్లమెంటు భవనానికి 1921లో శంకుస్థాపన చేశారు. ఆంగ్లేయుల ఆలోచనలకు, అప్పటి అవసరాలకు అనుగుణంగా ఆరేళ్లలో (1927లో) అది సిద్ధమైంది. బ్రిటిష్ హయాంలో కౌన్సిల్ హౌస్గా పిలిచిన ఇందులోనే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొలువుదీరేది. 1956లో ప్రస్తుత భవనానికి రెండు అంతస్థులు అదనంగా కలిపారు. కాలానుగుణంగా అప్పటికి ఇప్పటికీ అవసరాలు పెరిగాయి. స్థలపరంగానూ ఇరుకుగా మారింది. సమావేశాలకే ఇబ్బందిగా ఉంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి సెంట్రల్ హాలున్నా అందులో 436 మందే కూర్చోవచ్చు. సంయుక్త సమావేశం నిర్వహించినప్పుడల్లా దాదాపు 200 కుర్చీలను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చేది. అంతేగాకుండా వందేళ్లకు చేరుకుంటున్న ఈ భవంతిలో కొత్తగా ఎలక్ట్రిక్ కేబుళ్లు, సీసీ టీవీలు, శీతలీకరణ, ఆడియో వీడియో తదితరాల కోసం ఎప్పటికప్పుడు అదనంగా ఏర్పాట్లు చేయడంతో భవనం పటిష్ఠత దెబ్బతింది. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. అప్పుడు సీట్లు పెరుగుతాయి. అందుకు ప్రస్తుత పార్లమెంటు భవనం సరిపోదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది.
సంయుక్త సభలిక అక్కడే
పాత దానిలో మాదిరిగా సెంట్రల్ హాలులాంటిదేమీ కట్టలేదు. ఉభయ సభల సంయుక్త సమావేశాలకు లోక్సభనే వాడుకుంటారు. 888 సీట్లున్న లోక్సభ హాలులో మొత్తం 1272 సీట్లకు వెసులుబాటుంది.
సభ్యుడి సీటు వద్దే మల్టీమీడియా
సభ్యుల ఓటింగ్కు వీలుగా సీట్లలో బయోమెట్రిక్, డిజిటల్ అనువాద పరికరాలు, మార్చుకోగల మైక్రోఫోన్లు తదితరాలను అమర్చారు. ప్రతి సభ్యుడి సీటువద్దా మల్టీమీడియా డిస్ప్లే సదుపాయం ఉంటుంది. సామాన్యులు గ్యాలరీల్లో ఎక్కడ కూర్చుని చూసినా స్పష్టంగా కనిపించేలా సీట్లను ఏర్పాటు చేశారు. మీడియాకూ ప్రత్యేక, ఆధునిక ఏర్పాట్లు చేశారు. మొత్తం 530 సీట్లను మీడియాకు కేటాయించారు.
పార్లమెంటు కొత్త భవనానికి జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలు
ఈనాడు, దిల్లీ: త్రిభుజాకారంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మలుగా నామకరణం చేసినట్లు తెలిసింది. ఈ మూడు ద్వారాల పక్కన వేల సంవత్సరాల భారతీయ చరిత్రను తెలిపే కాంస్య చిత్రాలను ఏర్పాటు చేశారు. జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి-యాజ్ఞవల్క్య మధ్య జరిగిన సంవాద దృశ్యం, మరోవైపున నలంద చిత్రాలను నెలకొల్పుతున్నారు. శక్తి ద్వారానికి ఒకవైపున చాణక్య, మరోవైపున మహాత్మా గాంధీ దండి యాత్ర దృశ్యాలను ఏర్పాటు చేస్తున్నారు. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపున సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, బాబాసాహెబ్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాలను నెలకొల్పుతున్నారు. ఇంకోవైపు పార్లమెంటు భవనం లోపల ఇండియన్ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన పెయింటింగ్స్, శిల్పకళలను ఉంచుతున్నారు. భవనం ప్రారంభోత్సవానికి ఎంపీలను ఆహ్వానిస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఇప్పటికే ఆహ్వాన పత్రాలు పంపారు. ఈ భవనాన్ని 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి ప్రారంభించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇందులో స్పీకర్ ఓం బిర్లా పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆహ్వాన పత్రంపై రాజ్యసభ ఛైర్మన్ పేరు లేకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ వివేక్ థంకా తప్పుబట్టారు. ఈ కార్డుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పేరు ఎందుకు లేదని ఆయన ట్విటర్లో ప్రశ్నించారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
ప్రజ్వల్ రేవణ్ణ స్వదేశానికి తీసుకొచ్చేందుకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వెల్లడించారు. -
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎన్టీఏ కొట్టిపారేసింది. -
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
నేపాల్ తన కరెన్సీ నోట్లపై కొన్ని భారతీయ భూభాగాలను చిత్రీకరించాలన్న నిర్ణయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆస్పత్రికి తరలించిన సైన్యం.. ఆమె ప్రాణాలను కాపాడింది. -
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..