కడచూపు కోసం.. కన్నీటి వెతుకులాట
ఒకవైపు శవాగారంలో కుప్పలుగా మృతదేహాలు. కానీ ముఖాలు ఛిద్రమవడంతో.. చనిపోయింది ఎవరో గుర్తుపట్టలేని దుస్థితి.
ఒడిశా ప్రమాద బాధిత కుటుంబికుల దైన్యం
భువనేశ్వర్ ఎయిమ్స్ శవాగారం వద్ద పడిగాపులు
భువనేశ్వర్ ఎయిమ్స్ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
ఒకవైపు శవాగారంలో కుప్పలుగా మృతదేహాలు. కానీ ముఖాలు ఛిద్రమవడంతో.. చనిపోయింది ఎవరో గుర్తుపట్టలేని దుస్థితి. మరోవైపు తమవారి ఆచూకీ తెలియక కుటుంబికులు, బంధువుల అవస్థలు.. కనీసం మృతదేహాలైన కనిపించకపోవడంతో మిన్నంటుతున్న రోదనలు. ఒడిశా రైళ్ల ప్రమాదంతో నెలకొన్న దయనీయ పరిస్థితులివి. తమవారు బతికి ఉండొచ్చన్న ఆశ దాదాపుగా కొడిగట్టడంతో.. భౌతికకాయాలనైనా గుర్తించి అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న తపనతో భువనేశ్వర్ ఎయిమ్స్ శవాగారానికి ప్రమాద బాధితుల సంబంధికులు భారీగా తరలివస్తున్నారు.
177 మృతదేహాల అప్పగింత
బాలేశ్వర్లో ప్రమాదం జరిగి అయిదు రోజులవుతోంది. ఈ దుర్ఘటనలో 278 మంది మృతిచెందగా... సోమవారం సాయంత్రం వరకూ 177 మృతదేహాలను గుర్తించి, వారి సంబంధికులకు అప్పగించారు. మరో 101 భౌతికకాయాలు ఎవరివనేది ఇంకా తేలలేదు. అవన్నీ భువనేశ్వర్ ఎయిమ్స్ శవాగారంలో పేరుకుపోయాయి. మృతుల్లో తమవారు ఉన్నారేమో చూసేందుకు బాధితుల కుటుంబికులు, స్నేహితులు, బంధువులు అక్కడికి తరలివస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ తమవారి ఆచూకీ లభించకపోవడంతోపాటు ఆసుపత్రులన్నీ వెతికినా కనిపించకపోవటంతో వారు మరణించి ఉంటారనే నిర్ధారణకు వచ్చి.. మృతదేహాల కోసం శవాగారాల వద్ద వెతుకుతున్నారు.
దొరికింది ఒకరి మృతదేహమే
బిహార్లోని మధుబన్ జిల్లా జానకీనగర్ గ్రామానికి చెందిన కుల్దీప్ ఠాకుర్, మనోజ్ రాయ్, రంజిత్ రాయ్, రామ్ భరోసా ఠాకూర్, అమిత్ మండల్, సలాం రైన్లు కలిసి కోరమండల్ ఎక్స్ప్రెస్లో చెన్నై వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. వారంతా పాతికేళ్ల లోపు యువకులే. దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ వీరి ఆచూకీ లేదు. గాయపడి ఎక్కడైనా చికిత్స తీసుకుంటున్నారమోనన్న ఉద్దేశంతో వారి స్నేహితులు.. బాలేశ్వర్, కటక్, భువనేశ్వర్లలోని అన్ని ఆసుపత్రులనూ గాలించారు. అయినా ఫలితం లేదు. చివరికి సోమవారం సాయంత్రానికి కుల్దీప్ ఠాకుర్ ఒక్కరి మృతదేహం మార్చురీలో లభించింది. మిగతా అయిదుగురూ చనిపోయే ఉంటారని భావిస్తున్నామని వారి స్నేహితుడు, జానకీనగర్ గ్రామస్థుడు లక్ష్మీకుమార్ షా ‘ఈనాడు’కు చెప్పారు. కానీ వారి మృతదేహాలు లభించకపోవటం, ఆచూకీ తెలియకపోవటం తమకు పెద్ద సవాల్గా మారిందని పేర్కొన్నారు.
దుర్గంధం మధ్యే దుర్భర పరిస్థితుల్లో..
దుర్ఘటన చోటుచేసుకొని అయిదు రోజులవుతుండటంతో మృతదేహాలు పాడవుతున్నాయి. ప్రమాదం జరిగాక భౌతికకాయాలను తొలుత బహానగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. రెండోరోజు బాలేశ్వర్లోని నోసీ ఇండస్ట్రీయల్ పార్కుకు తరలించారు. సోమవారం నాటికి వాటిని భువనేశ్వర్ ఎయిమ్స్లోని శవాగారాల్లో భద్రపరిచారు. ఇలా ఒకచోట నుంచి మరో చోటకు మార్చడం, సరిగ్గా భద్రపరచకపోవటంతో మృతదేహాల నుంచి భరించలేనంత దుర్గంధం వస్తోంది. వాటి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని స్థితి నెలకొంది. అలాంటి దుర్భర పరిస్థితుల మధ్యే మృతదేహాల కోసం వెతుకుతున్నారు.
భర్త జాడ తెలియక..
ఒడిశాకు చెందిన కార్తీక్ బేర విజయవాడలోని ఓ హోటల్లో పనిచేసేవారు. విజయవాడ నుంచి ఒడిశాలోని తన స్వగ్రామానికి వస్తున్న సమయంలో రైలు ప్రమాదం బారిన పడి ఉంటారని ఆయన కుటుంబికులు భావిస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఫోన్ పనిచేయడం లేదు. కార్తీక్ ఆచూకీ తెలియక ఆయన భార్య రమామాణి బేర కన్నీరుమున్నీరవుతున్నారు. సోమవారం ఆమె శవాగారం వద్ద పడిగాపులు కాశారు. అక్కడున్న మృతదేహాలన్నీ ఒకటికి రెండుసార్లు చూశారు. వాటిలో కార్తీక్ భౌతికకాయం దొరకలేదు.
మృతదేహాలను గుర్తించండి
ఫొటోలు విడుదల చేసిన రైల్వే శాఖ
ఈనాడు, దిల్లీ: ఒడిశా దుర్ఘటనలో చనిపోయినవారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది. ఇప్పటివరకూ తమవారి ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నవారిని దృష్టిలో ఉంచుకొని చనిపోయినవారు, వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, గుర్తించలేనంతగా ఛిద్రమైన మృతదేహాల సమాచారాన్ని ఒడిశా ప్రభుత్వ స్పెషల్ రిలీఫ్ కమిషనర్, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లలో ఉంచింది. చనిపోయినవారి ఫొటోలను https://srcodisha.nic.in/Photos%20Of%20Deceased%20with%20Disclaimer.pdf లింక్లో ఉంచింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి జాబితాను https://www.bmc.gov.in/train-accident/downloadists-of-Passengers-Undergoing-Treatment-in-Different-Hospitals_040620230830.pdf లింక్తో జత చేసింది. కటక్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న గుర్తుతెలియని వ్యక్తుల ఫొటోలను https://www.bmc.gov.in/train-accident/download/Un-identified-person-under-treatment-at-SCB-Cuttack.pdf లో ఉంచింది. అవసరమైనవారు రైల్వే హెల్ప్లైన్ నెంబర్ 139కిగానీ, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్లైన్ నెంబర్ 18003450061/1929కిగానీ ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చని రైల్వే శాఖ తెలిపింది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కంట్రోల్ రూం ఏర్పాటుచేశారని, అక్కడినుంచి వాహనాలను క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వద్దకు, మృతదేహాలు ఉంచిన మార్చురీకి తీసుకెళ్తారని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
ఎయిరిండియా (Air India Express)లో కొందరు క్యాబిన్ సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ.. సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. -
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
Election Commission: పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష నేతలకు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. అసలేం జరిగిందంటే..? -
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడాన్ని విపక్ష నేతలు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయమని ఆప్ అభివర్ణించింది. -
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
ఖలిస్థానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి నిబంధనల ప్రకారం సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. -
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఓ వ్యక్తి సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. వీటిల్లో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి