బడ్జెట్పై ఎవరు ఏమన్నారంటే..
సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తాత్కాలిక బడ్జెట్-2024ను ప్రవేశపెట్టారు.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తాత్కాలిక బడ్జెట్-2024ను ప్రవేశపెట్టారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే అద్భుతమైన బడ్జెటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పక్షాలు స్వాగతించాయి. వైఫల్యాలకు విజయాల ముసుగు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.
మోదీజీ నిబద్ధతకు అద్దం
ఆర్థికరంగంలో సూపర్ పవర్గా శరవేగంగా భారత్ చెందుతున్న రూపాంతరాన్ని ఈ బడ్జెట్ ముందుకు తీసుకువెళుతుంది. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలన్న ప్రధాని మోదీజీ నిబద్ధతకు బడ్జెట్ దోహదం చేస్తుంది. దేశ సమగ్రాభివృద్ధికి స్పష్టమైన మార్గం చూపుతున్న ఈ బడ్జెట్ సమాజంలోని భిన్న వర్గాలకు ప్రయోజనాలు అందించి, నవభారతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చాటుతోంది.
నితిన్ గడ్కరీ, రోడ్డురవాణా, హైవేల మంత్రి
అన్ని వర్గాలకు సానుకూల బడ్జెట్
అందరం స్వాగతించదగిన సానుకూల బడ్జెట్ ఇది. రైల్వేలపరంగా మూడు కొత్త ఆర్థిక కారిడార్ల ఏర్పాటుకు నిర్ణయించడం బాగుంది. దేశ ఆర్థికప్రగతికి ఇది దోహదం చేస్తుంది. మధ్యతరగతికి ప్రత్యేక గృహనిర్మాణ పథకం, ఉపాధిహామీ బడ్జెటును రూ.60 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు పెంచడం, స్టార్టప్ కంపెనీలకు పన్ను ప్రయోజనాలు అభినందనీయం.
నీతీశ్కుమార్, బిహార్ ముఖ్యమంత్రి (జేడీయూ అధినేత)
చైనా జీడీపీ 5.5 రెట్లు ఎక్కువ
ఇది ధనికుల కోసం ధనికులు నడుపుతున్న ధనికుల ప్రభుత్వం. జీడీపీ గురించి మాట్లాడిన ఆర్థికమంత్రి తలసరి ఆదాయం మాటెత్తలేదు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 7.7% ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ అని చెప్పుకోవడం ఒక్కటే గౌరవం కాదు. మన జీడీపీ కంటే చైనా జీడీపీ 5.5 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ప్రభుత్వ పాలనలో దిగువన ఉన్న 50 శాతం ప్రజలను మరచిపోవడంతో ఆర్థికవ్యవస్థ దారుణంగా తయారైంది.
పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి (కాంగ్రెస్)
ధనవంతులకే లబ్ధి
దేశంలో శ్రామికవర్గం ఎదుర్కొంటున్న భయంకరమైన ఆర్థిక పరిస్థితిని కేంద్ర తాత్కాలిక బడ్జెట్ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ధి ఆలోచనలు ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదలను మరింత పేదలుగా మార్చేలా ఉన్నాయి. సామాజికరంగాల వ్యయం తగ్గింది. ఇది దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.
సీపీఎం
రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?
కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెటు ఎన్నికల గిమ్మిక్కులా ఉంది. దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు. అన్నదాతల సంక్షేమం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగం గత అయిదేళ్లలో జరిగిన 53,478 మంది రైతుల ఆత్మహత్యలను గేలి చేసినట్టుగా ఉంది. రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఊసే లేదు. సమాఖ్య వ్యవస్థను మోసగించి, ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నారు.
డెరెక్ ఓబ్రియెన్, ఎంపీ.. చంద్రిమా భట్టాచార్య (ప.బెంగాల్ మంత్రి), టీఎంసీ
రామరాజ్య దృక్పథం గల బడ్జెట్
- దేశంలో రామరాజ్య స్థాపన దృక్పథానికి కేంద్ర బడ్జెట్ అద్దం పట్టింది. ఇది దేశ స్వావలంబనకు చేసిన ప్రతిజ్ఞలా ఉంది. మధ్యతరగతికి గృహనిర్మాణ పథకం ప్రతిపాదన విప్లవాత్మకమైన ముందడుగు. పేదల సంక్షేమానికి అంకితమైన దూరదృష్టి గల బడ్జెట్ ఇది.
జె.పి.నడ్డా, భాజపా అధ్యక్షుడు
- ఇది సానుకూల బడ్జెట్. సమాజంలోని ప్రతి వర్గానికి ఎంతోకొంత లబ్ధి చేకూర్చేలా ఉంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణరంగం, తయారీరంగం, గృహనిర్మాణం, సాంకేతిక అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారు.
రాజ్నాథ్ సింగ్, రక్షణమంత్రి
- మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలకు సమతుల్యమైన ప్రాధాన్యం ఇచ్చారు. ఆత్మనిర్భర్, వికసిత భారత్లకు పునాది వేసే సమగ్ర మార్గదర్శిగా బడ్జెట్ నిలుస్తోంది.
అనురాగ్ ఠాకుర్, కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి
- ప్రధాని మోదీ దూరదృష్టి, బలమైన నాయకత్వం కింద పేదలు, గ్రామీణ భారత సంక్షేమంలో భాగంగా అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ కొత్త భాష్యం చెప్పింది. పీఎంఏవై (గ్రామీణ) పథకం కింద దాదాపు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం మౌలిక వసతుల అభివృద్ధిలో ఓ మైలురాయి.
స్మృతి ఇరానీ, కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి
- భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెటు బలమైన పునాది వేసింది.
అర్జున్ మేఘవాల్, న్యాయశాఖ మంత్రి
వైఫల్యాలకు విజయాల ముసుగు
బడ్జెట్ ప్రసంగం క్లుప్తంగా, అసంతృప్తి కలిగించేలా ఉంది. వైఫల్యాలకు విజయాల ముసుగు తొడిగే నైపుణ్యం ఈ సర్కారు సొంతం. దేశంలోని యువతలో 45% నిరుద్యోగులు ఉండగా, వారి సాధికారత గురించి మాట్లాడలేదు. మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు క్షీణిస్తున్న వాస్తవం కళ్ల ముందు కనిపిస్తుండగా మంత్రి ‘నారీశక్తి’ గురించి మాట్లాడారు. పెరుగుతున్న ద్రవ్యలోటు అత్యంత ఆందోళనకరం. మంత్రి చెప్పిన గణాంకాల మేరకే ఇది రూ.18 లక్షల కోట్ల మేర ఉంది.
శశిథరూర్, మనీశ్ తివారి, కాంగ్రెస్
ఆ 4 కులాలను ఇప్పటికైనా గుర్తించారు
మోదీ ప్రభుత్వ తుది బడ్జెట్ను చాలా భారమైన హృదయంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దేశంలో పేదలు, మహిళలు, యువత, రైతులనే నాలుగు ‘కులాలు’ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ వర్గాలను గుర్తించింది.
ఉద్ధవ్ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం (శివసేన - యూబీటీ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్