ఇంగ్లండ్లో మళ్లీ లాక్డౌన్
ఇంగ్లండ్ వ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి............
కొత్తరకం కరోనా కట్టడి కోసం తప్పని ఆంక్షలు
లండన్: ఇంగ్లండ్ వ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు స్కాట్లాండ్లో మంగళవారం అర్ధరాత్రి నుంచే కఠిన ఆంక్షల్ని అమలు చేయనున్నారు.
ఇప్పటికే ఇంగ్లండ్లో దాదాపు 44 మిలియన్లు అంటే దేశ మొత్తం జనాభాలో మూడొంతుల మంది కఠిన ఆంక్షల వలయంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ మరణాలు నమోదవుతున్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. కరోనా కొత్త రకం వ్యాప్తి మరింత వేగవంతమైనట్లు అక్కడి వైద్య వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం నాటికి 27వేల మంది కొవిడ్తో ఆస్పత్రుల్లో చేరినట్లు బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఏప్రిల్లో నమోదైన తొలి విడత విజృంభణ కంటే ఇది 40 శాతం అధికం కావడం గమనార్హం. గత మంగళవారం ఒక్కరోజే ఏకంగా 80వేల పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పటికే ప్రజల కదలికలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా, భారీ స్థాయిలో కేసుల రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాల్సి వస్తోందని అధికారులు వివరించారు.
లాక్డౌన్లో భాగంగా స్కూళ్లు, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, జిమ్లు పూర్తిగా మూసివేయనున్నారు. ఉదయం పూట వ్యాయామం, వైద్య సాయం కోసం తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. విద్యార్థుల వార్షిక పరీక్షల నిర్వహణపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. మరోవైపు వ్యాక్సిన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మరో ఆరు వారాల్లో వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు సహా కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తవుతుందన్నారు.
ఇవీ చదవండి..
బ్రిటన్లో ఆక్స్ఫర్డ్ టీకా షురూ
4 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు