Viral video : వృద్ధుల సమయస్ఫూర్తి పసి ప్రాణాన్ని కాపాడింది!
విద్యుత్ షాక్ తగిలి బురద నీటిలో పడిపోయిన బాలుణ్ని ముగ్గురు వృద్ధులు రక్షించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా (Viral video) మారింది.
Image : crocrimehq
ఇంటర్నెట్ డెస్క్ : అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలు రహదారిపై నిలిచిన వర్షపు నీటిలో పడిపోయాయి. ఆ మడుగులో అడుగుపెట్టిన ఓ చిన్నారి షాక్కు గురయ్యాడు. ముగ్గురు వృద్ధులు చాకచక్యంగా వ్యవహరించి ఆ బాలుణ్ని రక్షించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారణాసిలోని చేత్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో జితేంద్ర నివాసం ఉంటున్నాడు. మంగళవారం వారు ఉంటున్న వీధిలో భారీ వర్షం కురిసింది. కాస్త తెరిపివ్వగానే జితేంద్ర కుమారుడు కార్తీక్ ఆడుకోవడానికి బయటకు వచ్చాడు. ఆ క్రమంలో విద్యుత్ ప్రసరిస్తున్న స్తంభానికి సమీపంగా వెళ్లి ఒక్కసారిగా రోడ్డుపై నిలిచిన నీటిలో పడిపోయాడు.
రోజువారీ పనులకూ డ్రోన్ల వినియోగం..!
ఆ సమయంలో అటుగా వస్తున్న ముగ్గురు వృద్ధులు బాలుడు పడిపోయిన విషయాన్ని గమనించారు. అందులో ఒకరు పరుగున వెళ్లి చిన్నారి పైకి లేపేందుకు యత్నించారు. అయితే, విద్యుత్ షాక్ ప్రసరిస్తున్నట్లు గ్రహించి వెనక్కి తగ్గారు. విషయం తెలిసి మిగిలిన ఇద్దరు వృద్ధులు వెంటనే ఓ కర్ర సేకరించి తీసుకొచ్చారు. అందులో ఒకరు దాన్ని నెమ్మదిగా బాలుడి చేతికి అందించారు. చిన్నారి దాన్ని పట్టుకోగానే అతడిని బురద నీటిలో నుంచి పక్కకు లాగారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. ఆ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అది వైరల్గా మారింది. వృద్ధుల సమయ స్ఫూర్తిని పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.