Budget 2024: ‘ఇదే ఆఖరు’.. బడ్జెట్పై విపక్షాల రియాక్షన్ ఇదే!
Opposition Reactions on budget: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటూ దుమ్మెత్తిపోశాయి.
దిల్లీ: సార్వత్రిక సమరానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ‘అద్భుతాలేవీ ఉండకపోవచ్చు’ అంటూ ఆమె గతంలో పేర్కొన్నట్లే.. పెద్ద పెద్ద ప్రకటనలేవీ లేకుండానే ప్రసంగాన్ని ముగించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపాలన్నదే తమ లక్ష్యమని ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్నికల అనంతరమూ తామే బడ్జెట్ను ప్రవేశపెడతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ను అధికార భాజపా, ఎన్డీయే కూటమి పక్షాలు స్వాగతించాయి. ప్రభుత్వ ఆకాంక్షలకు ఈ బడ్జెట్ అద్దం పడుతోందని పేర్కొన్నాయి. విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఆ పార్టీకిదే ఆఖరు బడ్జెట్ అని, అబద్ధాల పుట్ట అంటూ విమర్శలు గుప్పించాయి.
- భాజపా ప్రభుత్వానికిదే ఆఖరి బడ్జెట్ అంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. పదేళ్లుగా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బడ్జెట్లను ప్రవేశపెడుతోందని, ఆ రికార్డును ఇంకెవరూ తిరగరాయలేరని దుయ్యబట్టారు. ప్రజల అభివృద్ధి పట్టని బడ్జెట్ అర్థం లేనిదంటూ విమర్శించారు.
- నిర్మలా సీతారామన్ బడ్జెట్పై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అపజయాలను విజయాలుగా పేర్కొనడం ఈ ప్రభుత్వం ప్రత్యేకత అంటూ ఎద్దేవా చేశారు. 45 శాతం యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే.. దాని గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వంలో జీడీపీలో ఎఫ్డీఐలు 3.6 శాతంగా ఉంటే.. ఇప్పుడు ఒక శాతం కూడా లేవని విమర్శించారు.
- అద్దంలో వెనక్కి చూసుకుంటూ కారు నడుపుతున్నట్లు ఉందంటూ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ బడ్జెట్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ద్రవ్య లోటు రూ.18 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
- మోదీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్ను ప్రవేశ పెట్టిందంటూ ఉద్ధవ్ ఠాక్రే కామెంట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుండెను బరువు చేసుకుని బడ్జెట్ను ప్రవేశపెట్టారంటూ విమర్శించారు. ప్రజల అంచనాలపై ఆర్థిక మంత్రి మరోసారి నీళ్లు చల్లారని ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
- ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించడానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించలేదని దుయ్యబట్టారు.
- మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు మరోసారి బడ్జెట్ వేదిక అయ్యిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ విమర్శించారు.
- పదేళ్ల పాలనలో ఏమీ చేయనప్పటికీ.. తమను తాము పొగుడుకోవడానికి ఆర్థిక మంత్రి అధిక సమయమే తీసుకున్నారంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో ఏమీ చేయని దానికి శ్వేత పత్రం విడుదల చేయడం ఎందుకో? అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్