రోజూ 5 KMల నడక.. ఈ ఆహార పదార్థాలపై నిషేధం.. అమర్నాథ్ యాత్రికులకు సూచనలివే!
అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులకు ఆలయ బోర్డు పలు ఆరోగ్య సూచనలు జారీ చేసింది. దీంతోపాటు యాత్రలో 40కిపైగా ఆహార పదార్థాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది.
శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్ (Jammu Kashmir)లోని హిమాలయాల్లో అమర్నాథ్ పుణ్యక్షేత్రానికి జులై 1 నుంచి యాత్ర (Amarnath Yatra) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎత్తయిన మంచు కొండల్లో సాగే ఈ యాత్రకు వెళ్లేందుకు తగినంత శారీరక సన్నద్ధత, ఆరోగ్యం అవసరం. ఈ క్రమంలోనే యాత్రికులకు అమర్నాథ్ క్షేత్ర బోర్డు (SASB) కీలక ఆరోగ్య సలహాలు జారీ చేసింది. రోజూ కనీసం 5 కి.మీల నడకతో యాత్ర కోసం శారీరకంగా సన్నద్ధం కావాలని సూచించింది. యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలని తెలిపింది. దీంతోపాటు యాత్రలో 40కిపైగా ఆహార పదార్థాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. శీతల పానీయాలు, వేపుడు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
దక్షిణ కశ్మీర్లోని మంచు పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. అనంతనాగ్ జిల్లాలోని సాంప్రదాయ 48 కి.మీల నున్వాన్- పహల్గాం మార్గంతోపాటు గందర్బాల్ జిల్లాలోని 14 కి.మీ నిటారైనన బాల్తాల్ మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ క్రమంలో యాత్రను ప్రారంభించే ముందు.. నిషేధిత ఆహార పదార్థాలను వెంట తీసుకురావద్దని, అనుమతించిన వస్తువుల జాబితాను సరిచూసుకోవాలని అధికారులు తెలిపారు. లేనిపక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరించారు. హైపోథర్మియా (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం) బారిన పడే ప్రమాదం ఉన్నందున.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నిషేధిత పదార్థాలివే..: మాంసాహారంతోపాటు ఫ్రైడ్ రైస్, పూరీ, పిజ్జా, బర్గర్, దోశె, వెన్నతో కూడిన బ్రెడ్, క్రీమ్ పదార్థాలు, ఊరగాయ, చట్నీ, వేయించిన పాపడ్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, శీతల పానీయాలు, హల్వా, జిలేబీ, గులాబ్ జామ్, సమోసా, చిప్స్ వంటివి ఉన్నాయి.
అనుమతి ఉన్నవి: తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలు, సలాడ్లు, బంగాళాదుంపలు, చపాతీలు, ఇడ్లీ, బ్రెడ్ జాం, పండ్లు, మొలకలు, పాయసం, ఎండు ఫలాలు, నువ్వుల లడ్డూలు, వేడివేడి ద్రవపదార్థాలను బోర్డు సిఫార్సు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు
లోక్సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. -
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై దాడి ఘటన నేపథ్యంలో.. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ఏం సాధించొచ్చు?
ఆత్మవిశ్వాసం ప్రతిసారీ మనల్ని విజయ తీరాలకు చేర్చలేకపోవచ్చు. అన్నింటినీ మనకు అనుకూలంగా మార్చకపోవచ్చు. -
రహస్య ఓటింగ్కు విఘాతమంటూ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ప్రస్తుత ఎన్నికల విధానంలో రహస్య ఓటింగ్ అనే ప్రక్రియకు విఘాతం కలుగుతోందని, ఆ నిబంధన ఉల్లంఘనకు గురవుతోందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
పోలింగ్ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు?
సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై కచ్చితమైన అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను సంధించింది. -
పౌరుల స్వేచ్ఛ అంశంలో ప్రతి రోజూ విలువైందే: సుప్రీంకోర్టు
పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసుల్లో ప్రతి రోజూ విలువైందేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. -
రాజ్యాంగ ధర్మాసనం తీర్పే గీటురాయి
వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సోరెన్ బెయిల్ పిటిషన్పై ఈడీకి సుప్రీం నోటీసులు
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారానికల్లా స్పందన తెలపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే మించిన సంతృప్తి ఏముంటుంది
వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’పై ఇటీవల రష్మిక ప్రయాణించారు. -
కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. -
నా చెంపపై ఏడెనిమిదిసార్లు కొట్టారు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తన చెంపపై ఏడెనిమిసార్లు గట్టిగా కొట్టారంటూ ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణ చేశారు. -
మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు
భారత్ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం. -
దేశానికి ముప్పుగా భూతాపం
భారతదేశానికి భూతాపం(గ్లోబల్ వార్మింగ్) అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. -
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
కోల్కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, భాజపా లోక్సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. -
జస్టిస్ బోపన్నకు ఘనంగా వీడ్కోలు
పదవీ విరమణ పొందుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.బోపన్నకు సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయం, సమయపాలన, ఔదార్యానికి ఆయన మారుపేరు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఈ సందర్భంగా కొనియాడారు. -
క్రిమిసంహారాల అతి వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
ఆహారోత్పత్తులపై క్రిమిసంహారాలను, రసాయనాలను అధికంగా వినియోస్తున్నందున దేశంలో మరణాల సంఖ్య పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. -
బీబీసీ డాక్యుమెంటరీపై విచారణ నుంచి వైదొలగిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీకి సంబంధించి ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జయరామ్ భంభానీ వైదొలిగారు. -
ఎయిరిండియా విమానానికి ప్రమాదం
ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురికావడంతో సర్వీసును రద్దు చేశారు. పుణె నుంచి 200 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం దిల్లీకి బయలుదేరేందుకు ఆ విమానం రన్వే పైకి వచ్చింది. -
వాయవ్య భారతంలో వడగాల్పులు
విపరీత ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో వాయవ్య భారతం అల్లాడుతోంది. దిల్లీలోని నజఫ్గఢ్లో శుక్రవారం నమోదైన 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతే దేశంలో ఇప్పటివరకు అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. -
పెరుగుతున్న జీవక్రియ వ్యాధులు
మధుమేహం, అధిక రక్తపోటు, నడుం చుట్టూ కొవ్వు పెరగడం వంటి జీవక్రియ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని లాన్సెట్ వైద్య విజ్ఞాన పత్రికలో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం హెచ్చరించింది. -
వైవాహిక అత్యాచారాలకు మినహాయింపుపై పిటిషన్
వైవాహిక అత్యాచారాలను నూతన క్రిమినల్ చట్టాల (భారత న్యాయ సంహిత) నుంచి మినహాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.