Lok Sabha: ప్రధాని మోదీ నోట ‘రహ్మాన్ బర్క్’ మాట..!
లోక్సభలో అత్యంత వృద్ధ, పిన్న వయసు సభ్యులతోపాటు సుదీర్ఘకాలం సేవలందించిన నేతల పేర్లనూ ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎస్పీ ఎంపీ రహ్మాన్ బర్క్ గురించి మాట్లాడారు.
దిల్లీ: తొమ్మిది దశాబ్దాలకుపైగా సేవలందించిన భారత పార్లమెంటు పాత భవనం (Parliament Old Building) నుంచి కార్యకలాపాలు కొత్త భవనంలోకి మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో.. లోక్సభ ప్రాముఖ్యత, మునుపటి, ప్రస్తుత సభ్యుల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కొనియాడారు. ఈ సందర్భంగా లోక్సభలో అత్యంత వృద్ధ, పిన్న వయసు సభ్యులతోపాటు సుదీర్ఘకాలం సేవలందించిన నేతల పేర్లనూ ప్రధానమంత్రి ప్రస్తావించారు.
లోక్సభలో ప్రస్తుతం అత్యంత ఎక్కువ వయసు కలిగిన షఫీకుర్ రహ్మాన్ బర్క్ పేరును ప్రధాని మోదీ ప్రస్తావించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన బర్క్ వయస్సు 93ఏళ్లు. లోక్సభ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. తొలిసారిగా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ పార్లమెంటు స్థానం నుంచి 1996లో గెలుపొందిన బర్క్.. అంతకుముందు నాలుగుసార్లు ఎమ్మెల్యేగాను విజయం సాధించారు. 1998, 2004లో మొరాదాబాద్ నుంచి ఎన్నికవగా..2009, 2019లో సంభల్ నుంచి గెలుపొందారు.
వివాదాలకు కేంద్ర బిందువు..
లోక్సభలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న రహ్మాన్ బర్క్.. పలు సందర్భాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 2019లో పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ‘వందే మాతరం’ అనేందుకు నిరాకరించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాకుండా అఫ్గానిస్థాన్ను తాలిబాన్లు ఆక్రమించిన ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇక్కడ దేశద్రోహం కేసు కూడా నమోదయ్యింది.
ఎంతో ప్రయాసతో తెలంగాణ ఏర్పాటు: లోక్సభలో ఏపీ విభజనను ప్రస్తావించిన మోదీ
ఇక అత్యంత పిన్న వయస్కురాలిగా బిజూ జనతాదళ్ (BJD) పార్టీ సభ్యురాలు చంద్రాణి ముర్ము నిలిచారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ హరిహరన్ సోరెన్ కుమార్తె అయిన ఆమె.. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఒడిశాలోని కియోంఝర్ స్థానం నుంచి 25 ఏళ్ల వయసులోనే గెలుపొందారు. 2019లో తొలిసారి లోక్సభలో అడుగుపెట్టి.. లోక్సభ్యుల్లో పిన్న వయస్కురాలిగా కొనసాగుతున్నారు.
ఇంద్రజిత్ గుప్తాదే రికార్డు..
లోక్సభ ఎంపీగా సుదీర్ఘకాలం సేవలందించిన కమ్యూనిస్టు పార్టీకి (సీపీఐ) చెందిన ఇంద్రజిత్ గుప్తానూ ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. 1960-2001 మధ్యకాలంలో 36ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. లోక్సభలో సుదీర్ఘకాలం సేవలందించిన వ్యక్తి ఇంద్రజిత్ గుప్తా. 1960లో జరిగిన పార్లమెంటు ఉపఎన్నికల్లో తొలిసారి ఎన్నికైన ఆయన.. కేవలం 1977-80 మినహా సుమారు నాలుగు దశాబ్దాల పాటు లోక్సభలో సేవలందించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2001లో మరణించేవరకూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. పశ్చిమబెంగాల్లోని కలకత్తా సౌత్వెస్ట్, అలీపుర్, బషీర్హట్, మిద్నాపుర్ లోక్సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన గుప్తా.. హెచ్డీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాల్లో కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు. -
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
ఆప్ నేతలు ఒక్కొక్కరిగా అరెస్టుకు గురి కావడంతో కేంద్రంలోని భాజపాపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకుంటానని.. వీలైనంతమందిని అరెస్టు చేసుకోమంటూ సవాల్ విసిరారు. -
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
సార్వత్రిక ఎన్నికల క్రమంలో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. -
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
LS Polls: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా రెండు నెలల్లో దాదాపు 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తాజాగా వెల్లడించింది. -
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
ఆలయాల్లో లైబ్రరీలు ఏర్పాటుచేయడం ద్వారా యువతను దేవాలయాల వైపు ఆకర్షించవచ్చని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. -
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
Lava MD: బెయిల్ పొడిగింపు కోసం లావా కంపెనీ మాజీ ఎండీ అతితెలివి ప్రదర్శించారు. తనలాంటి మరో వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి రెడ్ హ్యాండెడ్గా బుక్కయ్యాడు. -
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
రాయ్బరేలీ నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. -
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
Swati Maliwal assault case: స్వాతి మాలీవాల్పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ను దిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
శస్త్రచికిత్స అనంతరం కేజ్రీవాల్ నివాసానికి రాఘవ్ చద్దా
శస్త్రచికిత్స అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా మొదటి సారిగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో కనిపించారు. -
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
లైంగిక దౌర్జన్యం కేసులో తప్పు చేసిన వారిని వదిలిపెట్టవద్దని జేడీఎస్ అధినేత దేవెగౌడ పేర్కొన్నారు. -
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర రేల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. దేశంలో రైల్వే వ్యవస్థలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
తనపై దాడి జరిగిందని స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపించిన రోజునాటి దృశ్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. -
కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు
లోక్సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. -
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై దాడి ఘటన నేపథ్యంలో.. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. -
ఆత్మవిశ్వాసంతో ఏం సాధించొచ్చు?
ఆత్మవిశ్వాసం ప్రతిసారీ మనల్ని విజయ తీరాలకు చేర్చలేకపోవచ్చు. అన్నింటినీ మనకు అనుకూలంగా మార్చకపోవచ్చు. -
రహస్య ఓటింగ్కు విఘాతమంటూ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ప్రస్తుత ఎన్నికల విధానంలో రహస్య ఓటింగ్ అనే ప్రక్రియకు విఘాతం కలుగుతోందని, ఆ నిబంధన ఉల్లంఘనకు గురవుతోందంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
పోలింగ్ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు?
సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై కచ్చితమైన అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను సంధించింది. -
పౌరుల స్వేచ్ఛ అంశంలో ప్రతి రోజూ విలువైందే: సుప్రీంకోర్టు
పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసుల్లో ప్రతి రోజూ విలువైందేనని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. -
రాజ్యాంగ ధర్మాసనం తీర్పే గీటురాయి
వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సోరెన్ బెయిల్ పిటిషన్పై ఈడీకి సుప్రీం నోటీసులు
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారానికల్లా స్పందన తెలపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే మించిన సంతృప్తి ఏముంటుంది
వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’పై ఇటీవల రష్మిక ప్రయాణించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు