Rahul Gandhi: ఈ డబ్బంతా ఎవరిది? అదానీదేనా.. ఇంకెవరిదైనా?: రాహుల్ గాంధీ
అదానీ గ్రూప్ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.
ముంబయి: అదానీ గ్రూప్ అక్రమాలపై ఇవాళ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఒక బిలియన్ డాలర్ల ధనం భారత్ నుంచి వెళ్లి వివిధ మార్గాల్లో మళ్లీ తిరిగి వచ్చిందంటూ ఆ కథనాలు పేర్కొంటున్నాయని చెప్పారు. గురువారం ముంబయిలో విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశానికి విచ్చేసిన ఆయన అదానీ వ్యవహారంపై ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారు. షేర్ల పెరుగుదలతో వచ్చిన సొమ్ముతో అదానీ ఎన్నో ఆస్తులు కొన్నారు. అదానీ పోర్టులు, ఎయిర్ పోర్టులు కొనుగోలు చేశారు. ఈ డబ్బంతా ఎవరిది.. అదానీదేనా? ఇంకెవరిదైనా? ఈ మొత్తం అక్రమాల మాస్టర్ మైండ్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ. నాసర్ అలీ, ఛాంగ్ చుంగ్ లింగ్దీని వెనుక ఉన్నట్టు కథనాలు వచ్చాయి. గతంలో వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్నకు సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎన్డీటీవీలో డైరెక్టర్గా ఉన్నారు. దీన్నిబట్టే అదానీ గ్రూపులో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది’’ అని రాహుల్ అన్నారు.
అదానీ గ్రూప్పై మరోసారి తీవ్ర ఆరోపణలు
ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరపరు?
‘‘అదానీ వ్యవహారంపై అంతర్జాతీయంగా ప్రముఖ ఫైనాన్షియల్ వార్తా పత్రికలు చాలా కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మనది చాలా పారదర్శక వ్యవస్థ అని ప్రపంచానికి చెబుతున్నాం. ప్రధానికి సన్నిహితుడైన వ్యక్తి తన సంస్థ షేర్ల విలువ పెంచేందుకు బిలియన్ డాలర్లు విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టించారు. ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరిపించరు?’’ అని రాహుల్ ప్రశ్నించారు.
జీ20 సదస్సులో విదేశాలు ప్రశ్నిస్తే ఏం చెబుతాం?
అదానీ గ్రూప్ వ్యవహారంపై జేపీసీతో విచారణకు ఎందుకు అనుమతించడంలేదు. విచారణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చొరవ తీసుకోవడంలేదు. ఈ కుంభకోణానికి పాల్పడిన వాళ్లను జైళ్లో ఎందుకు పెట్టడంలేదు? త్వరలో దిల్లీలో జీ20 సమావేశం జరగబోతోంది. ఆ కీలక సమావేశంలో అదానీ గ్రూప్పై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? ఈ అదానీ గ్రూప్.. ఎందుకు అంత ప్రత్యేక సంస్థగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థపై స్వారీ చేసేందుకు అదానీకి ఎందుకు అనుమతిస్తున్నారు. అదానీ గ్రూపు వ్యవహారంపై జేపీసీ వేసి సమగ్ర విచారణ జరిపించాలి’’ అని రాహుల్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ను వీడిన అనంతరం రాధికా ఖేడా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. -
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
ఝార్ఖండ్లో భారీ మొత్తంలో వెలుగుచూసిన నగదుపై ప్రధాని మోదీ (Modi) స్పందించారు. -
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
తల్లిదండ్రుల తోడు లేకపోయినా.. చదువుతో పాటు తన సోదరి బాధ్యతను మోస్తూ ముందుకెళ్తున్న పదేళ్ల కుర్రాడిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. -
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడిది హరియాణాలోని కర్నాల్ ప్రాంతం. -
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ(IAF) సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. -
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
అతడు రూ. 15 వేల జీతగాడు. కానీ, అతడి ఇంటిని తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఓ గదిలో గుట్టలుగా పేర్చిన నగదు చూసి షాకైంది. -
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
గుంతల రహదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కోనుంది. నిర్మాణంలో కొత్త మెటీరియలను వినియోగించే అంశంపై పనిచేస్తోంది. -
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు