Adani Group: అదానీ గ్రూప్పై మరోసారి తీవ్ర ఆరోపణలు
Adani Group: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగనే లేదు. తాజాగా మరో సంస్థ ఈ గ్రూప్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నివేదిక విడుదల చేసింది.
దిల్లీ: అదానీ గ్రూప్పై తాజాగా మరో సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రమోటర్ కుటుంబంతో భాగస్వామ్యం ఉన్న పలువురు.. వందల మిలియన్ల డాలర్లు అదానీ గ్రూప్ (Adani Group) స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి లబ్ధి పొందారని ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP)’ ఆరోపించింది. మారిషస్ కేంద్రంగా పనిచేస్తున్న పలు ‘అజ్ఞాత’ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ (Adani Group) తీవ్రంగా ఖండించింది. అమెరికన్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ (Hindenburg) చేసిన ఆరోపణలనే ఓసీసీఆర్పీ మరోసారి తెరపైకి తెస్తోందని తెలిపింది.
తాజా ఆరోపణలు చేసిన ఓసీసీఆర్పీ (OCCRP)లో ప్రముఖ అంతర్జాతీయ మదుపరి జార్జ్ సోరోస్, రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ వంటి వారికి పెట్టుబడులు ఉన్నాయి. స్టాక్ ధరల్ని పెంచేందుకు అదానీ గ్రూప్ (Adani Group) అవకతవకలకు పాల్పడిందని హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను గతంలో జార్జ్ సోరోస్ సమర్థించారు. వీటన్నింటిని అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.
ఆ ఇద్దరిపై అనుమానం..
పన్నులు తక్కువగా ఉండే పలు దేశాల్లోని పత్రాలు, అదానీ గ్రూప్ అంతర్గత ఇ-మెయిళ్లను తాము పరిశీలించినట్లు ఓసీసీఆర్పీ తెలిపింది. కనీసం రెండు కేసుల్లో ‘అనుమానాస్పద’ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్లను విదేశీ ఫండ్ల ద్వారా క్రయవిక్రయాలు చేసినట్లు గుర్తించామని పేర్కొంది. నాసర్ అలీ షాబాన్ అహ్లీ, ఛాంగ్ చుంగ్-లింగ్ అనే ఇద్దరు వ్యక్తులు అదానీ కుటుంబంతో దీర్ఘకాలంగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి చెందిన పలు కంపెనీల్లో వీరు డైరెక్టర్లుగా, వాటాదారులుగా కూడా వ్యవహరించినట్లు తెలిపింది. వీరు విదేశీ ఫండ్ల ద్వారా అదానీ గ్రూప్ స్టాక్స్ను కొనుగోలు చేసి విక్రయిస్తూ వస్తున్నారని వెల్లడించింది. ఫలితంగా గణనీయంగా లాభాలను ఆర్జించారని పేర్కొంది.
అదానీ కుటుంబ సమన్వయంతోనే..
అహ్లీ, చాంగ్ అదానీ గ్రూప్ ప్రమోటర్ల తరఫునే వ్యవహరిస్తున్నారని భావించాలా అని ఓసీసీఆర్పీ ప్రశ్నించింది. ఒకవేళ అదే నిజమైతే.. కంపెనీలో ఇన్సైడర్లే 75 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకున్నట్లు అవుతుందని తెలిపింది. ఇది భారత లిస్టింగ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అయితే, అహ్లీ, చాంగ్.. అదానీ ఫ్యామిలీ నుంచి తీసుకున్న డబ్బులను ఇన్వెస్ట్ చేశారనడానికి తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. కానీ, అదానీ స్టాక్స్లో వారి కుటుంబ సభ్యుల సమన్వయంతోనే ట్రేడింగ్ జరిగినట్లు తమ పరిశోధనలో ఆధారాలు లభించాయని పేర్కొంది. 2013 సెప్టెంబరులో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. గత ఏడాదికి 260 బిలియన్ డాలర్లకు చేరినట్లు గుర్తుచేసింది.
ఇది ఓ కుట్ర..
ఓసీసీఆర్పీ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తాజా ఆరోపణల్లో పేర్కొన్న మారిషస్ ఫండ్స్ను హిండెన్బర్గ్ సైతం ఉటంకించిందని గుర్తుచేసింది. తాజా ఆరోపణలు కేవలం వాటి పునశ్చరణ మాత్రమేనని కొట్టిపారేసింది. వీటికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. నమోదిత అదానీ గ్రూప్ సంస్థలన్నీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయని వివరించింది. ‘‘మేం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం. ఈ వార్తలు యోగ్యత లేని హిండెన్బర్గ్ నివేదికను పునశ్చరిస్తున్నాయి. జార్జ్ సోరోస్ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్లు విదేశీ మీడియాలోని ఒక విభాగం మద్దతుతో చేస్తున్న కుట్రగా ఇది కనిపిస్తోంది. నిజానికి దీన్ని మేం ముందే ఊహించాం. ఇప్పటికే వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇటువంటి నివేదికలు రావడం అనుమానాస్పదంగా ఉంది. ఏదేమైనా జరుగుతున్న న్యాయప్రక్రియను గౌరవించాల్సిన అవసరం ఉంది’’ అని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అదానీ గ్రూప్లోని నమోదిత కంపెనీల షేర్లన్నీ ఈరోజు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:24 గంటల సమయంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 3.46 శాతం నష్టపోయి రూ.2,426 దగ్గర ట్రేడవుతోంది. అత్యధికంగా అదానీ పవర్, అదానీ గ్రీన్ షేర్లు నాలుగు శాతం నష్టపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)