Ayodhya: ప్రాణప్రతిష్ఠ వేడుక.. రామజ్యోతి వెలిగించిన ప్రధాని మోదీ

రామ్‌ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని దిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ.. దీపాలు వెలిగించారు.

Published : 22 Jan 2024 20:41 IST

దిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని (Ayodhya Ram mandir Inauguration) వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకను పురస్కరించుకుని రాత్రికి ఇళ్లలో దీపాలు (Ram Jyoti) వెలిగించాలని, దీన్ని దీపావళి పండగలా చేసుకోవాలని ప్రధాన మంత్రి మోదీ (Narendra Modi) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ.. దీపాలు వెలిగించారు. రామ్‌ లల్లా చిత్రపటానికి హారతి ఇచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దేశవ్యాప్తంగానూ ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ చేతులమీదుగా రామ్‌ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని