Covishield Booster: బూస్టర్ వ్యవధిని 6నెలలకు తగ్గించండి : పూనావాలా
బూస్టర్ డోసు వ్యవధిని తొమ్మిది నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు.
కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ
దిల్లీ: కొవిడ్ పోరులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రికాషనరీ డోసు పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటిని ప్రైవేటులో కేంద్రాల్లోనే అందిస్తుండగా.. రెండో డోసు తీసుకున్న 9 నెలల గడువు పూర్తయిన వారికే పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసు వ్యవధిని తొమ్మిది నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. తద్వారా వీలైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించవచ్చని సూచించారు.
‘ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. ఎందుకంటే రెండు, మూడు డోసుల మధ్య గడువు 9 నెలలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వీటి మధ్య వ్యవధి 6 నెలలుగా ఉన్నందున భారత్ కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాను’ అని సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ పేర్కొన్నారు. తద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి బూస్టర్ డోసును అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక ప్రైవేటులో అందిస్తోన్న కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు ధర రూ.600 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని అదర్ పూనావాలా వెల్లడించారు. మరోవైపు కొవాగ్జిన్ ప్రికాషన్ డోసును రూ.225కే అందిస్తున్నట్లు భారత్ బయోటెక్ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ప్రికాషనరీ డోసు పంపిణీ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమైంది. తొలి రోజు దాదాపు 10వేల డోసులను పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 18ఏళ్లకు పైబడిన వారికి ప్రైవేటులో మాత్రమే ప్రికాషన్ డోసును అందిస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 185.74కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.